News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

7 Minutes Cancer Treatment: 7 నిమిషాల్లోనే క్యాన్సర్ చికిత్స, ప్రపంచంలోనే తొలిసారిగా ఇంగ్లాండ్‌లో అందుబాటులోకి

7 Minutes Cancer Treatment: క్యాన్సర్ చికిత్సకు 7 నిమిషాల్లోనే చికిత్స పూర్తయ్యే ఔషధాన్ని బ్రిటన్ లో అందుబాటులోకి వచ్చింది.

FOLLOW US: 
Share:

7 Minutes Cancer Treatment: క్యాన్సర్ ఓ మహమ్మారి. అత్యంత ప్రమాదకరమైనది. సరైన సమయంలో, సరైన చికిత్స అందిస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు. ఆ చికిత్స కూడా ఎంతో కష్టంగా, బాధాకరంగా ఉంటుంది. క్యాన్సర్ చికిత్స వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిన్నింటిని తట్టుకుని బతికితీరాలన్న సంకల్పం, పట్టుదల, మానసిక మద్దతు ఉంటే క్యాన్సర్ ను జయించవచ్చు. ఈ మహమ్మారిని తగ్గించడానికి, సులువైన చికిత్స అందించడానికి ప్రపంచవ్యాప్తంగా నిత్యం ప్రయోగాలు, పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అధునాతన వైద్య చికిత్సలు, ఔషధాలు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా బ్రిటన్ లో అందుబాటులోకి వచ్చిన చికిత్స ఇప్పుడు వైద్య రంగంలో కీలక మలుపుగా భావిస్తున్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన చికిత్సలో కేవలం 7 నిమిషాల్లోనే క్యాన్సర్ చికిత్స పూర్తి అవుతుంది. క్యాన్సర్ రోగికి ఇచ్చే ఇంజెక్షన్ సమయాన్ని తగ్గించే సరికొత్త ఆవిష్కరణకు బ్రిటన్ హెల్త్ సర్వీసెస్ తాజాగా ఆమోదం తెలిపింది.

గంట చికిత్స 7 నిమిషాలకు తగ్గింపు

ప్రపంచంలోనే మొదటి సారిగా ఈ చికిత్సను ఇంగ్లాండ్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఆవిష్కరణ చికిత్సా సమయాన్ని మూడు వంతులు తగ్గించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వల్ల క్యాన్సర్ చికిత్స విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని భావిస్తున్నారు. క్యాన్సర్ రోగులకు ఇమ్యునోథెరపీలో భాగంగా అటెజోలిజుమాబ్ ఇంజెక్షన్ ను డ్రిప్ ద్వారా చర్మం కింద ఇస్తారు. ఇందుకు 30 నిమిషాల నుంచి ఒక గంట వరకు సమయం పడుతుంది. కానీ తాజాగా ఆమోదించిన ఔషధాన్ని కేవలం 7 నిమిషాల్లోనే ఇవ్వవచ్చు. ఈ కొత్త చికిత్స విధానం వల్ల అటు క్యాన్సర్ రోగులకు, వైద్యులకు ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. 

రోగులకు, వైద్యులకూ మేలు

ఈ 7 నిమిషాల ఇంజెక్షన్ కు యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్‌ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ(MHRA) 7 నిమిషాల చికిత్సకు ఆమోదం తెలిపింది. అలా ఆగస్టు 29వ తేదీన 100 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఈ ఇంజెక్షన్ ను ప్రయోగాత్మకంగా అందించారు. రొమ్ము, మూత్రాశయ, ఊపిరితిత్తులు, కాలేయ క్యాన్సర్ రోగులకు ఈ చికిత్స అందించనున్నట్లు ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ తెలిపింది. ఈ ఇంజెక్షన్ వల్ల అటు రోగులకు అనుకూలంగా ఉండటమే కాదు.. వైద్యులు కూడా ఎక్కువ మంది బాధితులకు చికిత్స చేయాడనికి వీలు కలుగుతుందనని ఎంహెచ్ఆర్ఏ పేర్కొంది.

Also Read: Modi Charishma: ఏమాత్రం తగ్గని మోదీ ఛరిష్మా, ప్రతి 10 మందిలో 8 మంది ఆయన వైపే - తేల్చి చెప్పిన రీసెర్చ్

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

అటెజోలిజుమాబ్ ఇమ్యునోథెరపీ ఔషధం.. క్యాన్సర్ కణాలను వెతికి నాశనం చేస్తుంది. అలాగే క్యాన్సర్ రోగుల్లో ఇమ్యూనిటీ పవర్ ను శక్తివంతం చేస్తుంది. ఇంగ్లాండ్ లో ఏటా దాదాపు 3,600  మంది క్యాన్సర్ రోగులు సమయాన్ని ఆదా చేసే అటెజోలిజుమాబ్ ఇంజెక్షన్ కి మారాలని భావిస్తున్నట్లు NHS ఇంగ్లాండ్ తెలిపింది. అయితే అటెజోలిజుమాబ్ తో కలిసి ఇంట్రావీనస్ కిమోథెరపీ చేసుకునే రోగులు రక్తమార్పిడి చేయించుకునే వీలు కలుగుతుందని పేర్కొంది. సాధారణంగా శరీరంలోని అసాధారణ కణాలు రోగ నిరోధక వ్యవస్థలోని టీ కణాల నుంచి తప్పించుకుని, కణితులుగా మారి పలు రకాల క్యాన్సర్లకు దారి తీస్తాయి.

Published at : 31 Aug 2023 11:13 AM (IST) Tags: England Cancer Treatment Seven Minutes Cancer Treatment Worlds First Treatment 7 Minutes Cancer Treatment

ఇవి కూడా చూడండి

భారత్‌తో మైత్రి మాకు చాలా అవసరం, దారికి వచ్చిన కెనడా ప్రధాని ట్రూడో!

భారత్‌తో మైత్రి మాకు చాలా అవసరం, దారికి వచ్చిన కెనడా ప్రధాని ట్రూడో!

India-Canada Row: కెనడా వివాదంపై నోరు విప్పని భారత్‌, అమెరికా విదేశాంగ మంత్రులు

India-Canada Row: కెనడా వివాదంపై నోరు విప్పని భారత్‌, అమెరికా విదేశాంగ మంత్రులు

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్

కెనడా ఆర్మీ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసిన ఇండియన్ హ్యాకర్స్! మరింత పెరిగిన ఉద్రిక్తతలు

కెనడా ఆర్మీ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసిన ఇండియన్ హ్యాకర్స్! మరింత పెరిగిన ఉద్రిక్తతలు

బిచ్చగాళ్లను ఎగుమతి చేస్తున్న పాకిస్థాన్, వీసాలు తీసుకుని మరీ విదేశాలకు!

బిచ్చగాళ్లను ఎగుమతి చేస్తున్న పాకిస్థాన్, వీసాలు తీసుకుని మరీ విదేశాలకు!

టాప్ స్టోరీస్

పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన

పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన

Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Telangana BJP :  సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Breaking News Live Telugu Updates: రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం

Breaking News Live Telugu Updates: రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు