అన్వేషించండి

Caught On Cam: పాక్ ఆర్మీ కాన్వాయ్ పేల్చివేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ, 10 మంది జవాన్లు మృతి

Baloch Liberation Army

క్వెట్టా: పహల్గాంలో చేసిన ఉగ్రదాడితో పాక్ సొంతగా ఉచ్చు బిగించుకున్నట్లు పరిస్థితి తయారైంది. ఓవైపు భారత ప్రభుత్వం సింధు జలాల పంపకాలపై నిషేధం, పాక్ జాతీయులకు అన్ని రకాల వీసాలు రద్దు చేసి బిగ్ షాకిచ్చింది. మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్‌లోని క్వెట్టా సమీపంలో రిమోట్ కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ద్వారా పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై బాంబు దాడి చేసింది బలూచ్ ఆర్మీ. ఇందుకు తామే బాధ్యత వహిస్తున్నామని సైతం ప్రకటించుకుంది.

బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేసిన ఈ బాంబు దాడి మార్గట్ ప్రాంతంలో జరిగింది. ఈ దాడిలో కనీసం 10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని బలూచ్ టీమ్ చెబుతోంది. పాకిస్తాన్ ఆర్మీ వాహనం ధ్వంసమైందని, జవాన్లు చనిపోయారని ప్రకటించింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఐఈడీ పేల్చివేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్వెట్టా సమీపంలో తాము ఐఈడీ బాంబు దాడి చేశామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి జీయంద్ శుక్రవారం ఓ ప్రకటనలో ధృవీకరించారు. ఈ ప్రాంతంలో తమను ఆక్రమిత దళాలుగా అభివర్ణించిన పాకిస్తాన్ ఆర్మీపై విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారని తెలిపారు.  బలూచిస్తాన్‌లో తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని, తమ చర్యలను తప్పుపడితే రియాక్షన్ ఇలాగే ఉంటుందని హెచ్చరించింది. 

గత నెలలో బలూచ్ వేర్పాటువాద గ్రూపు ఏకంగా ఓ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేయడంతో వారి ప్రాబల్యాన్ని చాటాలని చూశారు. BLA మిలిటెంట్లు బోలాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ రైలును హైజాక్ చేసి ఏకంగా 339 మంది ప్రయాణికులను బంధీలుగా ఉంచారు. ఈ ఘటనలో కాల్పులు, దాడులు జరగడంతో 25 మంది మరణించారు. క్వెట్టా నుండి పెషావర్ వెళ్లే రైలులో  ట్రాక్‌పై పేలుడు పదార్థాలను పేల్చివేసి రైలు నిలిచిపోయేలా చేశారు. ఆపై రైలు బోగీలు పట్టాలు తప్పడం, మొత్తానికి రైలు అక్కడికక్కడే ఆగిపోయింది. వెంటనే బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలగాలు జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులోకి ఎక్కి అందులోని ప్రయాణికులను బంధీలుగా చేసుకున్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
Advertisement

వీడియోలు

ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
Andhra King Taluka Collections : 'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
Marriages in 2026: డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
SUVs to launch in December 2025: మారుతి నుంచి టాటా వరకు, మార్కెట్లోకి 4 కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వాలి
మారుతి నుంచి టాటా వరకు, మార్కెట్లోకి 4 కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వాలి
Embed widget