అన్వేషించండి

Caught On Cam: పాక్ ఆర్మీ కాన్వాయ్ పేల్చివేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ, 10 మంది జవాన్లు మృతి

Baloch Liberation Army

క్వెట్టా: పహల్గాంలో చేసిన ఉగ్రదాడితో పాక్ సొంతగా ఉచ్చు బిగించుకున్నట్లు పరిస్థితి తయారైంది. ఓవైపు భారత ప్రభుత్వం సింధు జలాల పంపకాలపై నిషేధం, పాక్ జాతీయులకు అన్ని రకాల వీసాలు రద్దు చేసి బిగ్ షాకిచ్చింది. మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్‌లోని క్వెట్టా సమీపంలో రిమోట్ కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ద్వారా పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై బాంబు దాడి చేసింది బలూచ్ ఆర్మీ. ఇందుకు తామే బాధ్యత వహిస్తున్నామని సైతం ప్రకటించుకుంది.

బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేసిన ఈ బాంబు దాడి మార్గట్ ప్రాంతంలో జరిగింది. ఈ దాడిలో కనీసం 10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని బలూచ్ టీమ్ చెబుతోంది. పాకిస్తాన్ ఆర్మీ వాహనం ధ్వంసమైందని, జవాన్లు చనిపోయారని ప్రకటించింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఐఈడీ పేల్చివేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్వెట్టా సమీపంలో తాము ఐఈడీ బాంబు దాడి చేశామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి జీయంద్ శుక్రవారం ఓ ప్రకటనలో ధృవీకరించారు. ఈ ప్రాంతంలో తమను ఆక్రమిత దళాలుగా అభివర్ణించిన పాకిస్తాన్ ఆర్మీపై విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారని తెలిపారు.  బలూచిస్తాన్‌లో తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని, తమ చర్యలను తప్పుపడితే రియాక్షన్ ఇలాగే ఉంటుందని హెచ్చరించింది. 

గత నెలలో బలూచ్ వేర్పాటువాద గ్రూపు ఏకంగా ఓ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేయడంతో వారి ప్రాబల్యాన్ని చాటాలని చూశారు. BLA మిలిటెంట్లు బోలాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ రైలును హైజాక్ చేసి ఏకంగా 339 మంది ప్రయాణికులను బంధీలుగా ఉంచారు. ఈ ఘటనలో కాల్పులు, దాడులు జరగడంతో 25 మంది మరణించారు. క్వెట్టా నుండి పెషావర్ వెళ్లే రైలులో  ట్రాక్‌పై పేలుడు పదార్థాలను పేల్చివేసి రైలు నిలిచిపోయేలా చేశారు. ఆపై రైలు బోగీలు పట్టాలు తప్పడం, మొత్తానికి రైలు అక్కడికక్కడే ఆగిపోయింది. వెంటనే బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలగాలు జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులోకి ఎక్కి అందులోని ప్రయాణికులను బంధీలుగా చేసుకున్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget