అన్వేషించండి

Viral News: ఆకాశంలో విమానం, బాత్రూములో ప్రాణాలొదిలిన పైలట్ - తర్వాత ఏం జరిగిందంటే?

Viral News: ఆకాశంలో విమానం విహరిస్తున్న సమయంలో బాత్రూముకు వెళ్లిన పైలట్.. అక్కడి మృతి చెందాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Viral News: ఈమధ్యకాలంలో విమాన ప్రయాణాలు తరచూ హాట్ టాపిక్ అవుతున్నాయి. విమానాల్లో వివిధ ఘటనలతో నిత్యం ఏదో ఒక ఎయిర్ లైన్స్ వార్త న్యూస్ లో నిలుస్తోంది. తాజాగా మరో విమానం వార్త వైరల్ అవుతోంది. ఆదివారం రాత్రి అమెరికా పనామాలోని టోకుమెను ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఒక విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ విమానం ఫ్లోరిడాలోని మియామీ నుంచి చిలీలోని శాంటియాగో విమానాశ్రయానికి వెళ్తోంది. లాథమ్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం.. 271 మంది ప్రయాణికులతో ఆదివారం సాయంత్రం వేళ బయలుదేరింది. విమానంలో గాల్లో తన గమ్యం వైపు దూసుకెళ్తోంది. టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత ఆ విమాన పైలట్ అయిన 56 ఏళ్ల కెప్టెన్ ఇవాన్ అందూర్ అస్వస్థతకు గురయ్యాడు. పైలట్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించగా కాస్తంతా కోలుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ ఇవాన్ అందూర్ బాత్రూమ్ కు వెళ్లారు. బాత్రూమ్ కు వెళ్లి ఇవాన్ అందూర్ ఎంతకీ బయటకు రాలేదు. ఇంత సేపు వెళ్లడం ఏమిటని అనుమానించిన హోస్టెస్ వెళ్లి చూడగా.. పైలట్ కాస్త కింద పడిపోయి కనిపించాడు.

ఎయిర్ లైన్స్ సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించారు. వారు దగ్గర్లోని పనామా నగరంలోని టోకుమెన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి ఇచ్చారు. వెంటనే కో పైలట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అక్కడి వైద్యుల బృందం పైలట్ ఇవాన్ అందూర్ ను పరిశీలించారు. అయితే పైలట్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై లాథమ్ ఎయిర్ లైన్స్ స్పందించింది. కెప్టెన్ ఇవాన్ అందూర్ తమ ఎయిర్ లైన్స్ లో చాలా కాలంగా పని చేస్తున్నారని, ఆయనకు 25 ఏళ్ల అనుభవం ఉందని లాథమ్ ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది. అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని తెలిపింది. కెప్టెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. అప్పటి వరకు విధులు నిర్వర్తించిన కెప్టెన్.. ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా మారడం పట్ల ఎయిర్ లైన్స్ సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లు కలిసి పని చేసిన వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. ఈ ఘటన నేపథ్యంలోనే ఆ విమానంలోని ప్రయాణికులను మరుసటి రోజు చిలీకి చేర్చినట్లు ఎయిర్ లైన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.

Also Read: Delhi Teacher: హిందీ పుస్తకం తీసుకురాలేదని కొట్టిన టీచర్, విద్యార్థికి ఆస్పత్రిలో చికిత్స

రన్‌వేపై స్కిడ్ అయిన విమానం

బ్రెజిల్‌లో ఓ విమానం రన్‌వేపై స్కిడ్ అయ్యి ప్రయాణికులను తెగ టెన్షన్ పెట్టింది. ఈ ప్రమాదకర ఘటన బ్రెజిల్‌లో జరిగింది. LATAM  ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం...ఫ్లోరియానోపోలిస్ హెర్సీలియో లుజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన సమయంలో ఒక్కసారిగా స్కిడ్ అయింది. ఓ ప్యాసింజర్ ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విమానం స్కిడ్ అయిన వెంటనే అందరూ గట్టిగా అరిచారు. ఆ సమయంలో అక్కడ భారీ వర్షం పడుతోంది. ఈ కారణంగానే ఫ్లైట్ స్కిడ్ అయిందని అధికారులు వెల్లడించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget