అన్వేషించండి

US Iran War: అమెరికన్లను సముద్రంలో ముంచేస్తాం! అంత సీన్ లేదన్న డొనాల్డ్ ట్రంప్ !

US President Trump: ఇరాన్ నేవీతో పాటు సైనిక శక్తిని నిర్వీర్యం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ యుద్ధం తనవల్లే ఆగిందన్నారు.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా మోజ్తబా ఖమేనీ (Mojtaba khamenei ) హర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతుందని, అందుకోసం కొత్త రూల్స్ తీసుకొస్తామని తెలిపారు. తమ అణు, క్షిపణి సామర్థ్యాలను రక్షించుకుంటామని పేర్కొన్న ఆయన.. పర్షియన్ గల్ఫ్‌కు వచ్చే అమెరికన్లను సముద్రంలో ముంచేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఒప్పందం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని భావిస్తున్న సమయంలో ఇరాన్ అధినేత ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్ అత్యున్నత పదవిని చేపట్టిన తర్వాత తొలిసారి మోజ్తబా ఖమేనీ ఒక లిఖితపూర్వక ప్రకటనను విడుదల చేయగా ప్రభుత్వ టీవీ యాంకర్ చదివి వినిపించారు. పర్షియన్ గల్ఫ్‌లో అమెరికన్లకు ఉన్న ఏకైక స్థలం ఆ సముద్రపు అగాధాలేనని తన లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాంత చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోందని అన్నారు. దేవుని సహాయం, తమ శక్తితో పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి అమెరికా లేని ఒక ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని లేఖలో తెలిపారు. ఇక్కడి ప్రజల పురోగతి, శ్రేయస్సుకు కృషి చేస్తానన్నారు. 

మేం, పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్‌కు అవతల ఉన్న మా పొరుగువారు ఒకే పనిని పంచుకుంటున్నామని అన్నారు. వేల కిలోమీటర్ల దూరం నుండి దురాశ, ద్వేషంతో ఇక్కడికి వచ్చే విదేశీయులకు ఈ ప్రాంతంలో చోటు లేదు. వారిని సముద్రంలో ముంచేస్తామని అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సుప్రీం లీడర్ ప్రకటన
అమెరికా నేవీ దిగ్బంధనం చేసి ఇరాన్ ఓడలను సముద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్న సమయంలోనే మొజ్తబా ఖమేనీ లేఖ వచ్చింది. ఇరాన్ చమురు వ్యాపారంపై గత కొన్ని రోజులుగా ఒత్తిడి పెరిగింది. గురువారం ట్రేడింగ్‌లో జూన్ డెలివరీ కోసం బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 126 డాలర్లకు చేరుకుంది. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణే దీనికి కారణం. దీనికి ఎలా సమాధానం చెప్పాలని డొనాల్డ్ ట్రంప్ నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు.

హర్మూజ్‌లో అమెరికా దిగ్బంధనం ఉద్దేశం ఏమిటి?
హర్మూజ్ జలసంధిలో అమెరికా నేవీ దిగ్బంధనం ఉద్దేశం ఇరాన్ తన చమురును విక్రయించకుండా అడ్డుకోవడం, వారి ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడం. తద్వారా ఆ దేశానికి కీలకమైన రాబడి వనరు లేకుండా చేయాలనేది ట్రంప్ ప్లాన్. అలాగే, ఇరాన్ చమురు ఉత్పత్తిని నిలిపివేయాల్సిన పరిస్థితిని తీసుకురావాలని చూస్తున్నారు. ఎందుకంటే చమురును నిల్వ చేయడానికి వారికి చోటు ఉండదు. 

ఇరాన్‌తో ఉద్రిక్తత.. యుద్ధంగా భావించడం లేదన్న డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం నాడు ఇరాన్‌కు సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు. అమెరికా చేపట్టిన సైనిక చర్యలను తాను యుద్ధంగా పరిగణించడం లేదని పేర్కొన్నారు. ఈ చర్యలో ఇరాన్ నేవీ, వాయు సేన భారీగా నష్టపోయాయని, ఇప్పుడు ఆ దేశం ఒప్పందం కోసం ఆత్రుతగా ఉందని పేర్కొన్నారు. వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా.. ఇరాన్ సైనిక సామర్థ్యం చాలా వరకు తుడిచిపెట్టుకుపోయిందని క్లెయిమ్ చేశారు. ఇరాన్ డ్రోన్ తయారీ సామర్థ్యం సుమారు 82 శాతం తగ్గిందని, వారి అణు కార్యక్రమం కూడా పూర్తిగా నిర్వీర్యం అవుతుందన్నారు. 

భారత-పాకిస్తాన్ సంబంధాల ప్రస్తావన
ప్రపంచంలోని పలు వివాదాలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించానని ట్రంప్ ప్రస్తావించారు. ఇప్పటివరకు 8 ప్రధాన యుద్ధాలను తాను సద్దుమణిగేలా చేశానని, ఇందుకుగానూ పలు దేశాలు తనకు కృతజ్ఞతా లేఖలు పంపాయని తెలిపారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి తాను టారిఫ్ లను ఆయుధంగా ఉపయోగించానని ట్రంప్ చెప్పారు. యుద్ధం కొనసాగితే కఠినమైన ఆర్థిక చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిపారు. తన జోక్యం వల్లే సంభవించబోయే భారీ నష్టాన్ని నివారించానని పేర్కొన్నారు.

ఇరాన్ ఆర్థిక పరిస్థితి బలహీనం 
ఇరాన్ పట్ల అమెరికా తన కఠిన వ్యూహాన్ని కొనసాగిస్తుందని అధ్యక్షుడు సంకేతాలిచ్చారు. ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకాదళ దిగ్బంధనం సమర్థవంతంగా కొనసాగుతోందని, దీని ప్రభావం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తోందని అన్నారు. ఇరాన్ ఆర్థిక స్థితి నిరంతరం బలహీనపడుతోంది, వారి నేవీ, సైనిక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget