అన్వేషించండి

Israel Iran War: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం: ఇరాన్ ఆర్మీ చీఫ్ మృతి- అణు స్థావరాలపై దాడులు, తీవ్ర హెచ్చరికలు!

కొంతకాలంగా ఇరాన్, ఇజ్రాయేల్‌ను నాశనం చేస్తామని ప్రకటనలు చేస్తుండటం వంటి కారణాలతో, పాశ్చాత్య దేశాలు నివారిస్తున్నప్పటికీ, ఇజ్రాయేల్ ఇవాళ తెల్లవారుజామున 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో దాడులకు తెగబడింది.

ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలపై ఇజ్రాయేల్ ఇవాళ తెల్లవారుజామున (జూన్ 13, 2025) విరుచుకుపడింది. 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇజ్రాయేల్ జరిపిన ఈ దాడిలో ఇరాన్ ఆర్మీ చీఫ్, రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ మరణించారు. ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరీ, మరికొందరు కీలక సైనిక నేతలు, అలాగే మొహమ్మద్ మెహ్ది టెహ్రాంచి, ఫెరెడౌన్ అబ్బాసి అనే ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా ఈ దాడిలో మరణించినట్లు ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) తెలిపింది.

దాడులకు కారణాలు:

గత కొద్దికాలంగా ఇరాన్ అణు ఆయుధాలను అభివృద్ధి చేస్తుందని ఇజ్రాయేల్ నమ్ముతోంది. ఈ అణు కార్యక్రమం తమ దేశానికి ముప్పుగా భావిస్తుంది. అంతేకాకుండా, గత కొంతకాలంగా ఇరాన్, ఇజ్రాయేల్‌ను నాశనం చేస్తామని బహిరంగ ప్రకటనలు చేస్తుండటం వంటి కారణాలతో, పాశ్చాత్య దేశాలు నివారిస్తున్నప్పటికీ, ఇజ్రాయేల్ ఇవాళ తెల్లవారుజామున 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో దాడులకు తెగబడింది.

దాడుల లక్ష్యాలు:

ఇరాన్‌లోని అణు మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. నటాంజ్‌లోని యురేనియం సుసంపన్నత కేంద్రం (uranium enrichment facility), తబ్రిజ్‌లోని అణు పరిశోధనా కేంద్రాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం జరిగిందని ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. దీంతో పాటు, సైనిక స్థావరాలైన ఇస్ఫహాన్, అరాక్, కెర్మాన్‌షా వంటి నగరాల్లో దాడులు చేసినట్లు తెలుస్తోంది. బాలిస్టిక్ మిస్సైల్ ఫ్యాక్టరీలను కూడా ఈ దాడిలో ధ్వంసం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అణు నాయకత్వాన్ని నిర్మూలించడం మరో లక్ష్యం:

గతంలోనూ కోవర్టు దాడులు జరిపి ఇరాన్ అణు కార్యక్రమం చేపట్టకుండా చాలాసార్లు ఇజ్రాయేల్, ఇరాన్‌ను నిలువరించింది. అయినా తిరిగి ఈ కార్యక్రమాన్ని ఇరాన్ పునరుద్ధరిస్తోంది. తాజాగా ఇజ్రాయేల్ మరోసారి అణు కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్న నాయకులను మట్టుబెట్టింది. అందులో భాగంగానే మిలిటరీ కార్యాలయాలపై, రివల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయంపైన, అణు కేంద్రాలపైన దాడులు చేసింది. ఈ దాడుల్లోనే ఇరాన్ ఆర్మీ చీఫ్, రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ మరణించారు. ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరీ, మరికొందరు కీలక సైనిక నేతలు, అణు శాస్త్రవేత్తలు మొహమ్మద్ మెహ్ది టెహ్రాంచి, ఫెరెడౌన్ అబ్బాసి మరణించారు. ఇలా అణు కార్యక్రమానికి నేతృత్వం వహించే నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది.

ఇజ్రాయేల్‌కు ఇరాన్ సుప్రీం హెచ్చరిక, ఇరాన్ ప్రతి డ్రోన్ దాడులు:

ఇజ్రాయేల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఘాటుగా హెచ్చరించారు. ఈ దాడులకు ఇజ్రాయేల్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. తమ ప్రతిఘటన తీవ్ర బాధాకరంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ దాడి తమ దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. ఇరాన్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. చనిపోయిన ఆర్మీ నాయకుల స్థానాల్లో కొత్త వారిని నియమించినట్లు ప్రకటించారు. ఇజ్రాయేల్ దాడి అనంతరం ఇరాన్ వందలాది డ్రోన్‌లను ఇజ్రాయేల్‌పైకి ప్రయోగించింది. వాటిని తమ ఐరన్ డోమ్‌తో అడ్డుకున్నట్లు ఇజ్రాయేల్ ప్రకటించింది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
Embed widget