By: ABP Desam | Updated at : 22 Apr 2022 09:00 PM (IST)
Edited By: Murali Krishna
'చైనాతో దోస్తీనే నా కొంప ముంచింది- కానీ భారత్ అలా కాదు'
చైనాతో దోస్తీ కారణంగానే తన పదవి పోయిందని పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తాను ప్రధానిగా ఉన్నప్పుడు చైనాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవాలని చూశానని, అయితే స్వదేశ ప్రయోజనాలు గిట్టని ప్రతిపక్షాలు తనను పదవి నుంచి దింపేందుకు కుట్ర పన్నాయని ఇమ్రాన్ అన్నారు.
ఇదేంటి ఇలా
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి చైనాతో సన్నిహితంగా ఉన్న ఇమ్రాన్ ఒక్కసారిగా తన పదవి కోల్పోవడానికి డ్రాగన్ దేశమే కారణమని చెప్పడం ఆసక్తికరంగా ఉంది. ఇదే సమయంలో భారత విదేశాంగ విధానాలపై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు కురిపించారు.
పాక్ అలా కాదు
అయితే పాక్ విదేశాంగ విధానం ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలని కొందరు కోరుకుంటున్నారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. చైనాతో స్నేహాన్ని తన రాజకీయ ప్రత్యర్థులు ఇష్టపడ లేదన్నారు. అప్పుడే కుట్ర మొదలైందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు.
రష్యా పర్యటన
ఇక ప్రధాని హోదాలో తాను రష్యా పర్యటన చేయడం విదేశీ శక్తులకు నచ్చలేదన్న ఇమ్రాన్ ఖాన్.. ఆ పర్యటనను సమర్థించుకున్నారు. తాను రష్యాకు వెళ్లింది 30 శాతం డిస్కౌంట్తో చమురు కొనుగోలుకేనని, పాక్ ద్రవ్యోల్బణం నియంత్రణకే తాను ప్రయత్నించానన్నారు.
Also Read: Karnataka: యువకుడ్ని చెంప దెబ్బ కొట్టిన ఎమ్మెల్యే- ఎందుకో తెలుసా?
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా
Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్పై హత్యాయత్నం- త్రుటిలో తప్పిన ప్రమాదం!
Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి మూడు నెలలు- పుతిన్ సాధించిందేంటి?
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు