By: ABP Desam | Updated at : 21 Apr 2022 06:40 PM (IST)
Edited By: Murali Krishna
అఫ్గానిస్థాన్లో పేలుడు
అఫ్గానిస్థాన్లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. కాబూల్తో సహా ఐదు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ప్రార్థనా మందిరాల్లో జరిగిన ఈ పేలుళ్లలో 10 మంది వరకు మృతి చెందగా, 50 మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలిస్తున్నారు.
#BREAKING Dozens of casualties from blast at Shiite mosque in Afghanistan: Taliban official pic.twitter.com/IxGZ6zN4Mx
— AFP News Agency (@AFP) April 21, 2022
పాఠశాలలో
పశ్చిమ కాబూల్లో ఏప్రిల్ 19న పేలుళ్ళు జరిగాయి. ఓ హైస్కూలులో జరిగిన ఈ పేలుళ్ళలో దాదాపు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ పాఠశాల పరిసరాల్లో కొందరు షియా హజరా తెగకు చెందినవారు ఉన్నారు. వీరు మతపరమైన అల్ప సంఖ్యాకులు. వీరిపై సున్నీ ఉగ్రవాద సంస్థలు తరచూ దాడులు చేస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా ఓ హైస్కూలులో రెండు పేలుళ్ళు జరిగినట్లు సమాచారం. షియా ప్రజలు కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ సంస్థా ప్రకటించలేదు.
తాలిబన్ల పాలన
అఫ్గానిస్థాన్ను ఆక్రమించుకుని సర్కార్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ దేశ పరిస్థితి దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాలిబన్లు తీసుకుంటోన్న నిర్ణయాలు అఫ్గాన్ను మరింత దిగజారేలా చేస్తున్నాయి. బాలికలు హైస్కూల్ విద్యను అభ్యసించేందుకు అనుమతించట్లేదని ప్రకటించారు.
ప్రపంచ దేశాలు తమ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు వీలుగా పలు సంస్కరణలు చేపడుతున్నట్లు తాలిబ్లను గతంలో ప్రకటించారు. ఇందులో భాగంగానే బాలికలకు ఉన్నత చదువులు అందించేందుకు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. కానీ మళ్లీ మాట మార్చుతూ బాలికలను చదువుకు దూరం చేశారు. బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించట్లేదన్నారు. ఆరవ తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు చెప్పారు.
20 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి తెరదించుతూ అఫ్గానిస్థాన్కు బైబై చెప్పి అమెరికా సైన్యం వెనుదిరిగింది. అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ విధించిన ఆగస్టు 31 గడువు కంటే ఒక రోజు ముందే యూఎస్ దళాలు అఫ్గాన్ను వదిలి వెళ్లాయి. అప్గాన్లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్న సమయంలో అమెరికా చేతులు దులుపుకొని వెళ్లిపోవడంపై ప్రపంచదేశాలు ఆందోళన చెందాయి.
Also Read: UK PM Boris Johnson India Visit: తొలిసారి భారత్ వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్- చరఖా తిప్పిన జాన్సన్
Also Read: NASA Perseverance Rover: మార్స్ డెల్టాలో వింత రంగుల్లో రాళ్లు- ఆ గ్రహంపై నిజంగా నీరు ఉండేదా?
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా
Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్పై హత్యాయత్నం- త్రుటిలో తప్పిన ప్రమాదం!
Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి మూడు నెలలు- పుతిన్ సాధించిందేంటి?
Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!
MK Stalin With PM : తమిళాన్ని అధికార భాషగా గుర్తించాలి - మోదీని స్టేజ్పైనే అడిగిన స్టాలిన్ !
PM Modi Hyderabad Tour: కేసీఆర్పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
May 26 Records in Cricket: మే 26తో భారత క్రికెట్కు ప్రత్యేక కనెక్షన్ - రెండు మర్చిపోలేని రికార్డులు - ద్రవిడ్కు కూడా!