అన్వేషించండి

Myanmar Junta Attack: మయన్మార్ లో సైన్యం బాంబు దాడి - చిన్నారులు, మహిళలు సహా 100 మంది మృతి

మయన్మార్‌లోని సెంట్రల్ ఏరియాలో మంగళవారం సైన్యం జుంటా బాంబు దాడి చేసింది. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు.

Myanmar millitary junta aircraft attack: మయన్మార్‌ పరిస్థితి అదుపు తప్పుతోంది. మయన్మార్‌లోని సెంట్రల్ ఏరియా సాగెయింగ్ లోని కాంట్ బాలు టౌన్ షిప్ లో మంగళవారం సైన్యం జుంటా బాంబు దాడులు చేసింది. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంపై ఆర్మీ ఎయిర్ స్టైక్ చేయగా కనీసం 100 మంది మరణించగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సగయింగ్ ప్రాంతంలోని కాంత్ బాలు టౌన్‌షిప్‌పై మయన్మార్ సైన్యం జుంటా బాంబు దాడి చేయడంతో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

జుంటా ఎయిర్ క్రాఫ్ట్ నుంచి నిరసనకారులపై మయన్మార్ సైన్యం రెండు బాబులు జారవిడిచిందని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. ఆర్మీ జరిపిన ఈ బాంబు దాడిలో ‘చాలా మంది అమాయకులు మరణించారు. వీరిలో ఎంతో మంది చిన్నారులు, మహిళలు అందులోనూ గర్భిణీలు ఉన్నారని నేషనల్ యూనిటీ గవర్నమెంట్ (NUG) యొక్క కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దాడిని హేయమైన చర్యగా అభివర్ణించింది. ఇది దారుణమైన ఘటన అని సైన్యం చేసిన బాంబు దాడిని తీవ్రంగా ఖండించింది. స్థానికంగా కొత్త ఆఫీసు ప్రారంభించనున్న సందర్భంగా ప్రజలు ఒక్కసారిగా గుమిగూడిన సమయంలో వారిపై జుంబా యుద్ధ విమానాల నుంచి బాంబులు వేసి దాడి జరిపారని మరికొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

ఫిబ్రవరి 2021లో మిలటరీ తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి మయన్మార్ లో వేలాదిగా ప్రజలు మరణించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకురాలు ఆంగ్ సాన్ సూకీని ఆర్మీ పదవి నుంచి తొలగించింది. విచారణ పేరుతో ఆమెకు ఏకంగా 33 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. సూకీకి మద్దతు తెలిపిన వారిపై మయన్మార్ సైన్యం దాడులకు పాల్పడుతోంది. ఎంతో మంది జర్నలిస్టులను, రాజకీయ నాయకులను, పౌర హక్కుల కార్యకర్తలను ఖైదు చేసింది సైన్యం. మయన్మార్ లో జరుగుతున్న ఘటనల్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది.

ఆగ్నేయాసియా దేశంరెండేళ్లుగా అస్థిరతతో అల్లాడిపోతోంది. ప్రస్తుతం అక్కడ ఆహారం సరిగా దొరకడం లేదు. ఇంధనం కొరత, ఆహార పదార్థాలు అందుబాటులో ఉండవు. అంగ్ సాన్ సూకీ నుంచి ఆర్మీ చేతుల్లోకి పాలన వెళ్లడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపింది.  పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (PDF) సభ్యుడు రాయిటర్స్‌ మీడియాతో మాట్లాడుతూ.. స్థానికంగా ఓ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న వారిపై యుద్ధ విమానాలు బాంబు దాడులు చేయడంతో పాటు కాల్పులు జరిపాయని తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget