అన్వేషించండి

Myanmar Junta Attack: మయన్మార్ లో సైన్యం బాంబు దాడి - చిన్నారులు, మహిళలు సహా 100 మంది మృతి

మయన్మార్‌లోని సెంట్రల్ ఏరియాలో మంగళవారం సైన్యం జుంటా బాంబు దాడి చేసింది. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు.

Myanmar millitary junta aircraft attack: మయన్మార్‌ పరిస్థితి అదుపు తప్పుతోంది. మయన్మార్‌లోని సెంట్రల్ ఏరియా సాగెయింగ్ లోని కాంట్ బాలు టౌన్ షిప్ లో మంగళవారం సైన్యం జుంటా బాంబు దాడులు చేసింది. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంపై ఆర్మీ ఎయిర్ స్టైక్ చేయగా కనీసం 100 మంది మరణించగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సగయింగ్ ప్రాంతంలోని కాంత్ బాలు టౌన్‌షిప్‌పై మయన్మార్ సైన్యం జుంటా బాంబు దాడి చేయడంతో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

జుంటా ఎయిర్ క్రాఫ్ట్ నుంచి నిరసనకారులపై మయన్మార్ సైన్యం రెండు బాబులు జారవిడిచిందని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. ఆర్మీ జరిపిన ఈ బాంబు దాడిలో ‘చాలా మంది అమాయకులు మరణించారు. వీరిలో ఎంతో మంది చిన్నారులు, మహిళలు అందులోనూ గర్భిణీలు ఉన్నారని నేషనల్ యూనిటీ గవర్నమెంట్ (NUG) యొక్క కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దాడిని హేయమైన చర్యగా అభివర్ణించింది. ఇది దారుణమైన ఘటన అని సైన్యం చేసిన బాంబు దాడిని తీవ్రంగా ఖండించింది. స్థానికంగా కొత్త ఆఫీసు ప్రారంభించనున్న సందర్భంగా ప్రజలు ఒక్కసారిగా గుమిగూడిన సమయంలో వారిపై జుంబా యుద్ధ విమానాల నుంచి బాంబులు వేసి దాడి జరిపారని మరికొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

ఫిబ్రవరి 2021లో మిలటరీ తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి మయన్మార్ లో వేలాదిగా ప్రజలు మరణించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకురాలు ఆంగ్ సాన్ సూకీని ఆర్మీ పదవి నుంచి తొలగించింది. విచారణ పేరుతో ఆమెకు ఏకంగా 33 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. సూకీకి మద్దతు తెలిపిన వారిపై మయన్మార్ సైన్యం దాడులకు పాల్పడుతోంది. ఎంతో మంది జర్నలిస్టులను, రాజకీయ నాయకులను, పౌర హక్కుల కార్యకర్తలను ఖైదు చేసింది సైన్యం. మయన్మార్ లో జరుగుతున్న ఘటనల్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది.

ఆగ్నేయాసియా దేశంరెండేళ్లుగా అస్థిరతతో అల్లాడిపోతోంది. ప్రస్తుతం అక్కడ ఆహారం సరిగా దొరకడం లేదు. ఇంధనం కొరత, ఆహార పదార్థాలు అందుబాటులో ఉండవు. అంగ్ సాన్ సూకీ నుంచి ఆర్మీ చేతుల్లోకి పాలన వెళ్లడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపింది.  పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (PDF) సభ్యుడు రాయిటర్స్‌ మీడియాతో మాట్లాడుతూ.. స్థానికంగా ఓ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న వారిపై యుద్ధ విమానాలు బాంబు దాడులు చేయడంతో పాటు కాల్పులు జరిపాయని తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra 22 A Lands : ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
Cigarette Price: ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Iran Crisis : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra 22 A Lands : ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
Cigarette Price: ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Iran Crisis : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
Haq OTT Release Date: నెట్‌ఫ్లిక్స్‌లో 'హక్' స్ట్రీమింగ్... మహిళల హక్కులపై కోర్ట్ రూమ్ డ్రామా... దీని స్పెషాలిటీ ఏమిటంటే?
నెట్‌ఫ్లిక్స్‌లో 'హక్' స్ట్రీమింగ్... మహిళల హక్కులపై కోర్ట్ రూమ్ డ్రామా... దీని స్పెషాలిటీ ఏమిటంటే?
New Year Celebration Tragedy: తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Embed widget