Iran War Updates: హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
Hormuz: అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హెర్మూజ్ జలసంధి పై పట్టు సాధించేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి అమెరికా తన వ్యూహాలకు పదును పెడుతోంది. భారీగా రక్షణ చర్యలు చేపడుతోంది.

America attempt to free the Strait of Hormuz: హెర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు పెరగడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే అమెరికా నావికాదళం నేరుగా వాణిజ్య నౌకలకు ఎస్కార్ట్ ఇస్తుందని ప్రకటించారు. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ప్స్ ఈ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించినందున, ప్రపంచ ఇంధన సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అమెరికా తన నౌకాదళాన్ని యుద్ధ ప్రాతిపదికన మోహరించింది.
మల్టీ-నేషనల్ టాస్క్ ఫోర్స్ విస్తరణ
గతంలో ఎర్ర సముద్రంలో నౌకల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఆపరేషన్ ప్రోస్పెరిటీ గార్డియన్ తరహాలోనే, ఇప్పుడు హెర్మూజ్ జలసంధి కోసం ఒక బహుళ పక్ష కూటమిని అమెరికా సిద్ధం చేస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ వంటి దేశాలు ఈ ప్రయత్నాలకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ దేశాల నాయకులు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేస్తూ, ఇరాన్ చేస్తున్న డ్రోన్ దాడులను తీవ్రంగా ఖండించారు.
గగనతలం నుండి నిఘా.. సముద్రంలో దాడులు
పెంటగాన్ వర్గాల సమాచారం ప్రకారం, అమెరికా ఇప్పటికే A-10 వార్ప్లేన్లు , *అపాచీ హెలికాప్టర్లను ఈ ప్రాంతంలో రంగంలోకి దించింది. ఇరాన్ ప్రయోగిస్తున్న ఆత్మాహుతి డ్రోన్లు, స్పీడ్ బోట్లను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగుతోంది. ఇటీవల జరిగిన దాడుల్లో సుమారు 120కి పైగా ఇరాన్ నౌకలను, 44 బోట్లను అమెరికా దళాలు ధ్వంసం చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. సముద్ర మార్గంలో స్వేచ్ఛాయుత రవాణా తమ ప్రాధాన్యతని వాషింగ్టన్ స్పష్టం చేస్తోంది.
ఆర్థిక ఆంక్షల సడలింపు వ్యూహం
యుద్ధ విమానాలే కాకుండా, అమెరికా మరో ఆర్థిక వ్యూహాన్ని కూడా అమలు చేస్తోంది. ఇరాన్కు ఉన్న పట్టును తగ్గించేందుకు, ప్రస్తుతం సముద్రంలో నిలిచిపోయిన సుమారు 140 మిలియన్ బారెళ్ల ఇరాన్ ముడిచమురుపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా తొలగించాలని అమెరికా ట్రెజరీ యోచిస్తోంది. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగకుండా నియంత్రించి, ఇరాన్ తన చమురు బ్లాక్ మెయిలింగ్ పవర్ను కోల్పోయేలా చేయడమే దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం.
🚨🇺🇸 A second Marine amphibious group is now heading to the Middle East.
— Mario Nawfal (@MarioNawfal) March 19, 2026
The USS Boxer, USS Comstock, and USS Portland carrying the 11th Marine Expeditionary Unit just departed the west coast.
That's 4,400+ Marines on two amphibious groups converging on the Gulf… https://t.co/H2DvjhIfpA pic.twitter.com/NmxKBKgLFT
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో సుమారు 20-25 శాతం ఈ హెర్మూజ్ జలసంధి గుండానే ప్రయాణిస్తుంది. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని పూర్తిగా అడ్డుకుంటే, ముడిచమురు ధరలు లీటరుకు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే బ్యారెల్ ధర 100 మార్కును దాటడంతో, భారత్ వంటి దేశాలపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే భారత్ కూడా తన నౌకల భద్రత కోసం ఈ ప్రాంతంలో యుద్ధ నౌకలను నిరంతరం నిఘాలో ఉంచుతోంది.
Before You Go
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
ట్రెండింగ్ వార్తలు






















