అన్వేషించండి

USA: ఐదుగురి కోసం రూ.49 వేల కోట్లు వదులుకున్న అమెరికా! ఎందుకో తెలుసా?

USA: అమెరికా ఐదుగురు పౌరులను రక్షించుకునేందుకు తీసుకున్న నిర్ణయం తెలిస్తే మీ కళ్లు బయర్లు కమ్ముతాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 6 బిలియన్‌ డాలర్లను వదులుకుంది.

USA: అమెరికా ఐదుగురు పౌరులను రక్షించుకునేందుకు తీసుకున్న నిర్ణయం తెలిస్తే మీ కళ్లు బయర్లు కమ్ముతాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 6 బిలియన్‌ డాలర్లను వదులుకుంది. దీంతో ఇరాన్‌ చేతిలో బందీలుగా ఉన్న ఐదుగురు అమెరికన్లు ఎట్టకేలకు విడుదల చేయించుకుని స్వదేశానికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేసుకుంది. మామూలుగా ఇదే బందీలుగా ఉన్న పౌరులను విడిపించుకోవడానికి ఆయా దేశాలు చర్చలు జరుపుకుంటాయి. అలాంటి సమయంలో పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు.

కానీ అమెరికా తన పౌరులను విడుదల చేయించుకోవడానికి 6 బిలియన్‌ డాలర్లను వదులుకోవాల్సి వచ్చింది. అంటే భారత కరెన్సీలో ఆ డాలర్ల విలువ అక్షరాలా రూ.49వేల కోట్లు. అమెరికా, ఇరాన్ బద్ధ శత్రు దేశాలు. ఆ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. సుదీర్ఘకాలం విరోధులుగా కొనసాగుతోన్న దేశాల మధ్య ఈ అరుదైన మార్పిడి ఒప్పందం జరిగింది. నలుగురు పురుషులు, ఒక మహిళ మొత్తం ఐదుగురు అమెరికన్లు ఎనిమిదేళ్లుగా ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు చెందిన అత్యంత క్రూరమైన ఎవిన్‌ జైలులో బందీలుగా ఉన్నారు. దీనిపై అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయంగా లబ్ధి పొందేందుకు నిరాధారమైన అభియోగాలతో ఇరాన్‌ అమెరికన్లను బందీలుగా మార్చిందని ఆరోపించింది.

అయితే తమ పౌరులను రక్షించుకోవడానికి అమెరికా ఒక అడుగు ముందుకు వేసింది. దీంతో శత్రుదేశాలు ఇరాన్, అమెరికా మధ్య ఖతార్‌(Qatar) మధ్యవర్తిత్వం వహించింది. వివాదానికి పరిష్కార మార్గాన్ని చూపించింది. ఒప్పందం చివరి దశకు చేరుకుంటుందన్న సూచనలు రాగానే ఇరాన్‌ ప్రభుత్వం బందీలుగా ఉన్న ఐదుగురు అమెరికన్లను ఎవిన్‌ జైలు నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించడం గమనార్హం. దక్షిణ కొరియాలో నిలిచిపోయిన ఇరాన్‌కు చెందిన నిధులు దోహా బ్యాంకులకు చేరుకోగానే అమెరికన్ పౌరులు టెహ్రాన్‌ నుంచి దోహాకు వచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరారు.

దానితో పాటుగా అమెరికా ఆంక్షలను ఉల్లంఘించారనే ఆరోపణలతో అమెరికా జైళ్లలో మగ్గుతున్న ఐదుగురు ఇరానియన్లకు కూడా ఈ ఒప్పందంలో భాగంగా క్షమాభిక్ష లభించింది. ఈ ఖైదీల మార్పిడి కోసం సైతం ఖతార్‌ మధ్యవర్తిత్వం చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో మొదటి సారి చర్చలు మొదలయ్యాయి. దాదాపు 18 నెలల పాటు తొమ్మిది రౌండ్లలో చర్చలు జరిగాయి. ఇందుకోసం ఖతార్‌ అధికారులు చొరవ తీసుకున్నారు. ఇరాన్, అమెరికా మధ్య సమాచార మార్పిడికి టెహ్రాన్‌, వాషింగ్టన్ మధ్య పలుమార్లు తిరిగారు. ఎట్టకేలకు చర్చలు ఫలప్రదం అవడంతో ఇరు దేశాల మధ్య ఖైదీల మార్పిడి జరిగింది. దీంతో పాటు అమెరికా 6 బిలియన్ డాలర్లను చెల్లించింది.

దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇరాన్‌ జైల్లో బంధించిన ఐదుగురు అమాయకులైన అమెరికన్లు ఎట్టకేలకు స్వదేశానికి వస్తున్నారని, ఆ ఐదుగురు ఏళ్లపాటు అంతులేని వేదనను అనుభవించారని అన్నారు. తమను కాపాడటానికి బైడెన్‌ అత్యంత క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నారని, రాజకీయాలను పక్కనపెట్టి తమ ప్రాణాలకు ప్రాధాన్యం ఇచ్చారని ఇరాన్ నుంచి విడుదలైన ఐదుగురు అమెరికన్లు చెప్పారు. బైడెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్‌కు చెల్లించిన ఆరు బిలియన్ల డాలర్లు అమెరికా ఆంక్షలతో స్తంభించిపోయిన ఇరాన్‌ ఆస్తుల్లో భాగం కాదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే బైడెన్ నిర్ణయాన్ని రిపబ్లికన్లు ఖండిస్తున్నారు. విడుదలకు డబ్బు చెల్లించడంతో పాటు, ఆంక్షల్లో సడలింపుగా చర్య అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దేశాలల్లో ఇరాన్‌ ముందు వరసలో ఉంటుందన్నారు.  అలాంటి ఇరాన్‌కు నిధులు బదిలీ చేయడం దారుణమని మండిపడతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
గుడ్ న్యూస్.. హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
Old Age Viral Love Story: భార్య మెడికల్ బిల్లు కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ - రూ.4 కోట్ల సాయం చేసిన ప్రజలు
భార్య మెడికల్ బిల్లు కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ - రూ.4 కోట్ల సాయం చేసిన ప్రజలు
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Embed widget