అన్వేషించండి

USA: ఐదుగురి కోసం రూ.49 వేల కోట్లు వదులుకున్న అమెరికా! ఎందుకో తెలుసా?

USA: అమెరికా ఐదుగురు పౌరులను రక్షించుకునేందుకు తీసుకున్న నిర్ణయం తెలిస్తే మీ కళ్లు బయర్లు కమ్ముతాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 6 బిలియన్‌ డాలర్లను వదులుకుంది.

USA: అమెరికా ఐదుగురు పౌరులను రక్షించుకునేందుకు తీసుకున్న నిర్ణయం తెలిస్తే మీ కళ్లు బయర్లు కమ్ముతాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 6 బిలియన్‌ డాలర్లను వదులుకుంది. దీంతో ఇరాన్‌ చేతిలో బందీలుగా ఉన్న ఐదుగురు అమెరికన్లు ఎట్టకేలకు విడుదల చేయించుకుని స్వదేశానికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేసుకుంది. మామూలుగా ఇదే బందీలుగా ఉన్న పౌరులను విడిపించుకోవడానికి ఆయా దేశాలు చర్చలు జరుపుకుంటాయి. అలాంటి సమయంలో పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు.

కానీ అమెరికా తన పౌరులను విడుదల చేయించుకోవడానికి 6 బిలియన్‌ డాలర్లను వదులుకోవాల్సి వచ్చింది. అంటే భారత కరెన్సీలో ఆ డాలర్ల విలువ అక్షరాలా రూ.49వేల కోట్లు. అమెరికా, ఇరాన్ బద్ధ శత్రు దేశాలు. ఆ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. సుదీర్ఘకాలం విరోధులుగా కొనసాగుతోన్న దేశాల మధ్య ఈ అరుదైన మార్పిడి ఒప్పందం జరిగింది. నలుగురు పురుషులు, ఒక మహిళ మొత్తం ఐదుగురు అమెరికన్లు ఎనిమిదేళ్లుగా ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు చెందిన అత్యంత క్రూరమైన ఎవిన్‌ జైలులో బందీలుగా ఉన్నారు. దీనిపై అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయంగా లబ్ధి పొందేందుకు నిరాధారమైన అభియోగాలతో ఇరాన్‌ అమెరికన్లను బందీలుగా మార్చిందని ఆరోపించింది.

అయితే తమ పౌరులను రక్షించుకోవడానికి అమెరికా ఒక అడుగు ముందుకు వేసింది. దీంతో శత్రుదేశాలు ఇరాన్, అమెరికా మధ్య ఖతార్‌(Qatar) మధ్యవర్తిత్వం వహించింది. వివాదానికి పరిష్కార మార్గాన్ని చూపించింది. ఒప్పందం చివరి దశకు చేరుకుంటుందన్న సూచనలు రాగానే ఇరాన్‌ ప్రభుత్వం బందీలుగా ఉన్న ఐదుగురు అమెరికన్లను ఎవిన్‌ జైలు నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించడం గమనార్హం. దక్షిణ కొరియాలో నిలిచిపోయిన ఇరాన్‌కు చెందిన నిధులు దోహా బ్యాంకులకు చేరుకోగానే అమెరికన్ పౌరులు టెహ్రాన్‌ నుంచి దోహాకు వచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరారు.

దానితో పాటుగా అమెరికా ఆంక్షలను ఉల్లంఘించారనే ఆరోపణలతో అమెరికా జైళ్లలో మగ్గుతున్న ఐదుగురు ఇరానియన్లకు కూడా ఈ ఒప్పందంలో భాగంగా క్షమాభిక్ష లభించింది. ఈ ఖైదీల మార్పిడి కోసం సైతం ఖతార్‌ మధ్యవర్తిత్వం చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో మొదటి సారి చర్చలు మొదలయ్యాయి. దాదాపు 18 నెలల పాటు తొమ్మిది రౌండ్లలో చర్చలు జరిగాయి. ఇందుకోసం ఖతార్‌ అధికారులు చొరవ తీసుకున్నారు. ఇరాన్, అమెరికా మధ్య సమాచార మార్పిడికి టెహ్రాన్‌, వాషింగ్టన్ మధ్య పలుమార్లు తిరిగారు. ఎట్టకేలకు చర్చలు ఫలప్రదం అవడంతో ఇరు దేశాల మధ్య ఖైదీల మార్పిడి జరిగింది. దీంతో పాటు అమెరికా 6 బిలియన్ డాలర్లను చెల్లించింది.

దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇరాన్‌ జైల్లో బంధించిన ఐదుగురు అమాయకులైన అమెరికన్లు ఎట్టకేలకు స్వదేశానికి వస్తున్నారని, ఆ ఐదుగురు ఏళ్లపాటు అంతులేని వేదనను అనుభవించారని అన్నారు. తమను కాపాడటానికి బైడెన్‌ అత్యంత క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నారని, రాజకీయాలను పక్కనపెట్టి తమ ప్రాణాలకు ప్రాధాన్యం ఇచ్చారని ఇరాన్ నుంచి విడుదలైన ఐదుగురు అమెరికన్లు చెప్పారు. బైడెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్‌కు చెల్లించిన ఆరు బిలియన్ల డాలర్లు అమెరికా ఆంక్షలతో స్తంభించిపోయిన ఇరాన్‌ ఆస్తుల్లో భాగం కాదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే బైడెన్ నిర్ణయాన్ని రిపబ్లికన్లు ఖండిస్తున్నారు. విడుదలకు డబ్బు చెల్లించడంతో పాటు, ఆంక్షల్లో సడలింపుగా చర్య అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దేశాలల్లో ఇరాన్‌ ముందు వరసలో ఉంటుందన్నారు.  అలాంటి ఇరాన్‌కు నిధులు బదిలీ చేయడం దారుణమని మండిపడతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. సీఐ క్రాంతి రెడ్డి సస్పెన్షన్, నిందితుడి ఆచూకీ చెబితే రూ.2 లక్షలు
షాబాద్ ఆరుగురి హత్య కేసు.. సీఐ క్రాంతి రెడ్డి సస్పెన్షన్, నిందితుడి ఆచూకీ చెబితే రూ.2 లక్షలు
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Indian Tourists Boat Capsized Vietnam: వియత్నం మృతుల్లో కడప శ్రీధర్, మచిలీపట్నం జయశ్రీ - లావా మొబైల్స్ తెలుగు డీలర్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం !
వియత్నం మృతుల్లో కడప శ్రీధర్, మచిలీపట్నం జయశ్రీ - లావా మొబైల్స్ తెలుగు డీలర్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం !
Indian Tourists Boat Capsize: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Embed widget