అన్వేషించండి

పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన 10 బోగీలు - 15 మందికిపైగా మృతి!

Pakistan Train Accident: పాకిస్థాన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

Pakistan Train Accident: 

హజారా ఎక్స్‌ప్రెస్‌కి ప్రమాదం..

పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. షాహ్‌జాద్‌పూర్‌, నవాబ్‌షా మార్గంలో హజారా ఎక్స్‌ప్రెస్ (Hazara Express Accident) పట్టాలు తప్పి పడిపోయింది. దాదాపు 10 బోగీలు అదుపు తప్పాయి. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా...50 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం...హజారా ఎక్స్‌ప్రెస్‌ కరాచీ నుంచి పంజాబ్‌కి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సర్హారీ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నట్టుంది పట్టాలు తప్పింది. ప్రస్తుతానికి మృతుల సంఖ్య 15గా తేలినా...ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పాక్‌ రైల్వే మంత్రి ఖ్వాజా సాద్ రఫిక్ ఈ ఘటనపై స్పందించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం తరపు అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రకటించారు. ప్రస్తుతానికి ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆ తరవాతే ప్రమాదానికి కారణాలేంటో విచారిస్తామని తెలిపారు. సింధ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మురాద్ అలీ షా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అవసరమైన వైద్య సాయం అందిస్తున్నట్టు వెల్లడించారు. 

తరచూ ప్రమాదాలు..

గత దశాబ్ద కాలంగా పాకిస్థాన్‌లో ఇలాంటి ఘోర రైలు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. 2021 జూన్‌లో సింధ్‌లోని దహర్‌కీ వద్ద రెండు రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 65 మంది ప్రాణాలు కోల్పోగా 150 మంది గాయపడ్డారు. ఓ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి పక్క ట్రాక్‌పై ఉన్న రైల్‌ని ఢీకొట్టడం వల్ల ప్రాణనష్టం భారీగా వాటిల్లింది. అంతకు ముందు 2019లో తేజ్‌గామ్ ఎక్స్‌ప్రెస్ (Tezgam Express Accident)లో అగ్నిప్రమాదం సంభవించడం వల్ల 75 మంది ప్రాణాలు కోల్పోయారు. 2005లో ఘోట్కిలో రెండు ట్రైన్‌లు ఢీకొట్టుకున్న ఘటనలో 100 మంది మృతి చెందారు. 

Also Read: ఫ్రెండ్‌షిప్‌ డే సర్‌ప్రైజ్ ఇచ్చిన జొమాటో సీఈవో, కస్టమర్స్‌కి స్వయంగా ఫుడ్‌ డెలివరీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget