అన్వేషించండి

Tamilnadu Politics : డీఎంకే బీజేపీకి దగ్గరవుతోందా ? తమిళనాట రాజకీయాల్లో మార్పులు దేనికి సంకేతం ?

MK Stalin : బీజేపీ, డీఎంకే మధ్య గతంలో ఉన్నంత ఉద్రిక్తతలు లేవు. పైగా ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. దీంతో డీఎంకే.. మెల్లగా బీజేపీ వైపు జరుగుతోందన్న వాదన ప్రారంభమైంది. కానీ స్టాలిన్ మాత్రం ఖండిస్తున్నారు.

Why a political event in Tamil Nadu took DMK, BJP cadres by surprise : తమిళనాడు  మాజీ సీఎం కరుణానిధి శత జయంతి ఉత్సవాలను అక్కడి ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఏడాది పాటు నిర్వహించిన ఉత్సవాల ముగింపు సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యకరమైన బహుమతిని పంపింది. కరుణానిధి బొమ్మతో వంద రూపాయల నాణెన్ని విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. విడుదల కార్యక్రమాన్ని కరుణానిధి శత జయంతి ఉత్సవాల వేదికపైనే నిర్వహించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ, డీఎంకేల నేతలు పరస్పర పొగడ్తలు కురిపించుకున్నారు. 

నిన్నామొన్నటి వరకూ నిప్పు, ఉప్పులా బీజేపీ, డీఎంకే

నిజానికి డీఎంకే , బీజేపీ మధ్య నిన్నామొన్నటి వరకూ పరిస్థితి ఉప్పూ.. నిప్పులా ఉండేది. ఈడీ దాడులు జరిగేవి. ఈ కారణంగా ఇద్దరు మంత్రులు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. మరో వైపు గవర్నర్ కూడా తమిళనాడు ప్రభుత్వాన్ని చికాకు పెడుతూ ఉండేవారు. పార్లమెంట్ ఎన్నికల్లో స్వీప్ చేసేసిన తర్వాత డీఎంకే మరింత బలోపేతం అయింది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ అన్నాడీఎంకేతో కలసి పోటీ చేయలేదు. ఎన్నికల తర్వాత వ్యూహం మార్చింది. డీఎంకేను తప్పు పట్టడం.. చికాకు పెట్టడం ఆపేసింది. అంతే కాదు కరుణానిధి శతజయంతి వేడుకల విషయంలో పూర్తి స్థాయిలో సహకరించింది.  చివరికి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా కరుణానిధిని ప్రశంసించడం మారిన బీజేపీ విధానానికి సాక్ష్యంగా మారింది. 

డీఎంకే బీజేపీతో కలుస్తుందని ఊహాగానాలు

డీఎంకే, బీజేపీ మధ్య ఇలాంటి రాజకీయ వాతావరణం ఏర్పడటం అనూహ్యమే. ఇక ఆ రెండు పార్టీలు కలవబోతున్నాయని ప్రచారం చేయడానికి..జరగడానికి హద్దేముంటుంది. ఇప్పుడు తమిళనాడులో ఇదే హాట్ టాపిక్ గా మారింది. రెండు పార్టీలు కలుస్తాయా అన్న చర్చోపచర్చలు సాగుతున్నాయి. సిద్ధాంతపరంగా అయితే రెండు పార్టీలు కలవడం అనేది జరగదని.. కానీ రాజకీయంగా ఏదైనా జరగవచ్చన్న అంచనాలు ప్రారంభమయ్యాయి. కానీ అటు బీజేపీ, ఇటు డీఎంకే వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాయి. బీజేపీతో కలవడం అనేది అసాధ్యమని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. కరుణానిధిని వారు గౌరవించారు కాబట్టే తాము గౌరవించామని. .. అంతే కానీ ఇందులో రాజకీయం లేదంటున్నారు. అన్నామలై కూడా.. తాము ప్రత్యర్థులమని.. మిత్రులం కాదని చెబుతున్నారు. 

పరస్పర ప్రయోజనాలను రెండు పార్టీలు ఆశిస్తున్నాయా ? 

కారణం ఏదైనా డీఎంకే మొదటి నుంచి కేంద్రంలో పోరాటబాటలోనే ఉంది. ఈ క్రమంలో అనేక సమస్యలు ఎదుర్కొంది . కానీ ఇప్పుడు అలాంటి సమస్యలు లేవు. కర్ణాటకలో గవర్నర్ ఏకంగా ముఖ్యమంత్రిగా విచారణకు ఆదేశాలు ఇచ్చారు. కానీ గతంలో అలాంటి దూకుడే చూపించిన తమిళనాడు గవర్నర్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు.  బీజేపీ గతంలో తెలంగాణలో బాగా ఎదుగుతోందని ప్రచారం జరిగింది కానీ..  పార్లమెంట్ ఎన్నికల్లో  ఆ ప్రభావం కనిపించలేదు. దాంతో.. వీలైనంత వరకూ మిత్రపక్షాలను పొందడం ముఖ్యం అనుకున్నారేమో కానీ వ్యూహం మార్చుకున్నారు. అన్నాడీఎంకేతో ఇప్పటికే విడిపోయారు. మళ్లీ కలవడం వల్ల ప్రయోజనం ఉండదని.. డీఎంకే అయితే బెటరన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే  డీఎంకే వైపు మెల్లగా జరుగుతోందని భావిస్తున్నారు.  

అయితే డీఎంకే మాత్రం.. ఇప్పటికిప్పుడు బీజేపీతో గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేకపోయినా.. పొత్తులు అనే మాట వచ్చే సరికి దూరం జరిగే అవకాశం ఉంటుందని.. కాంగ్రెస్ పార్టీని వదిలే అవకాశం ఉండదని.. తమిళనాట సెక్యూలర్ వాదులు భావిస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని మరికొంత మంది వాదిస్తున్నారు. మొత్తంగా తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ పాచికలు వేసినట్లు అర్థం చేసుకోవచ్చు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Arjuna Ranatunga: వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Arjuna Ranatunga: వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Axar Patel Ruled Out : భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
Embed widget