అన్వేషించండి

Tamilnadu Politics : డీఎంకే బీజేపీకి దగ్గరవుతోందా ? తమిళనాట రాజకీయాల్లో మార్పులు దేనికి సంకేతం ?

MK Stalin : బీజేపీ, డీఎంకే మధ్య గతంలో ఉన్నంత ఉద్రిక్తతలు లేవు. పైగా ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. దీంతో డీఎంకే.. మెల్లగా బీజేపీ వైపు జరుగుతోందన్న వాదన ప్రారంభమైంది. కానీ స్టాలిన్ మాత్రం ఖండిస్తున్నారు.

Why a political event in Tamil Nadu took DMK, BJP cadres by surprise : తమిళనాడు  మాజీ సీఎం కరుణానిధి శత జయంతి ఉత్సవాలను అక్కడి ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఏడాది పాటు నిర్వహించిన ఉత్సవాల ముగింపు సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యకరమైన బహుమతిని పంపింది. కరుణానిధి బొమ్మతో వంద రూపాయల నాణెన్ని విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. విడుదల కార్యక్రమాన్ని కరుణానిధి శత జయంతి ఉత్సవాల వేదికపైనే నిర్వహించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ, డీఎంకేల నేతలు పరస్పర పొగడ్తలు కురిపించుకున్నారు. 

నిన్నామొన్నటి వరకూ నిప్పు, ఉప్పులా బీజేపీ, డీఎంకే

నిజానికి డీఎంకే , బీజేపీ మధ్య నిన్నామొన్నటి వరకూ పరిస్థితి ఉప్పూ.. నిప్పులా ఉండేది. ఈడీ దాడులు జరిగేవి. ఈ కారణంగా ఇద్దరు మంత్రులు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. మరో వైపు గవర్నర్ కూడా తమిళనాడు ప్రభుత్వాన్ని చికాకు పెడుతూ ఉండేవారు. పార్లమెంట్ ఎన్నికల్లో స్వీప్ చేసేసిన తర్వాత డీఎంకే మరింత బలోపేతం అయింది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ అన్నాడీఎంకేతో కలసి పోటీ చేయలేదు. ఎన్నికల తర్వాత వ్యూహం మార్చింది. డీఎంకేను తప్పు పట్టడం.. చికాకు పెట్టడం ఆపేసింది. అంతే కాదు కరుణానిధి శతజయంతి వేడుకల విషయంలో పూర్తి స్థాయిలో సహకరించింది.  చివరికి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా కరుణానిధిని ప్రశంసించడం మారిన బీజేపీ విధానానికి సాక్ష్యంగా మారింది. 

డీఎంకే బీజేపీతో కలుస్తుందని ఊహాగానాలు

డీఎంకే, బీజేపీ మధ్య ఇలాంటి రాజకీయ వాతావరణం ఏర్పడటం అనూహ్యమే. ఇక ఆ రెండు పార్టీలు కలవబోతున్నాయని ప్రచారం చేయడానికి..జరగడానికి హద్దేముంటుంది. ఇప్పుడు తమిళనాడులో ఇదే హాట్ టాపిక్ గా మారింది. రెండు పార్టీలు కలుస్తాయా అన్న చర్చోపచర్చలు సాగుతున్నాయి. సిద్ధాంతపరంగా అయితే రెండు పార్టీలు కలవడం అనేది జరగదని.. కానీ రాజకీయంగా ఏదైనా జరగవచ్చన్న అంచనాలు ప్రారంభమయ్యాయి. కానీ అటు బీజేపీ, ఇటు డీఎంకే వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాయి. బీజేపీతో కలవడం అనేది అసాధ్యమని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. కరుణానిధిని వారు గౌరవించారు కాబట్టే తాము గౌరవించామని. .. అంతే కానీ ఇందులో రాజకీయం లేదంటున్నారు. అన్నామలై కూడా.. తాము ప్రత్యర్థులమని.. మిత్రులం కాదని చెబుతున్నారు. 

పరస్పర ప్రయోజనాలను రెండు పార్టీలు ఆశిస్తున్నాయా ? 

కారణం ఏదైనా డీఎంకే మొదటి నుంచి కేంద్రంలో పోరాటబాటలోనే ఉంది. ఈ క్రమంలో అనేక సమస్యలు ఎదుర్కొంది . కానీ ఇప్పుడు అలాంటి సమస్యలు లేవు. కర్ణాటకలో గవర్నర్ ఏకంగా ముఖ్యమంత్రిగా విచారణకు ఆదేశాలు ఇచ్చారు. కానీ గతంలో అలాంటి దూకుడే చూపించిన తమిళనాడు గవర్నర్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు.  బీజేపీ గతంలో తెలంగాణలో బాగా ఎదుగుతోందని ప్రచారం జరిగింది కానీ..  పార్లమెంట్ ఎన్నికల్లో  ఆ ప్రభావం కనిపించలేదు. దాంతో.. వీలైనంత వరకూ మిత్రపక్షాలను పొందడం ముఖ్యం అనుకున్నారేమో కానీ వ్యూహం మార్చుకున్నారు. అన్నాడీఎంకేతో ఇప్పటికే విడిపోయారు. మళ్లీ కలవడం వల్ల ప్రయోజనం ఉండదని.. డీఎంకే అయితే బెటరన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే  డీఎంకే వైపు మెల్లగా జరుగుతోందని భావిస్తున్నారు.  

అయితే డీఎంకే మాత్రం.. ఇప్పటికిప్పుడు బీజేపీతో గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేకపోయినా.. పొత్తులు అనే మాట వచ్చే సరికి దూరం జరిగే అవకాశం ఉంటుందని.. కాంగ్రెస్ పార్టీని వదిలే అవకాశం ఉండదని.. తమిళనాట సెక్యూలర్ వాదులు భావిస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని మరికొంత మంది వాదిస్తున్నారు. మొత్తంగా తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ పాచికలు వేసినట్లు అర్థం చేసుకోవచ్చు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget