అన్వేషించండి

MP Vijaysai Reddy : టీడీపీ అంటే తొడలు, దేహం, పార్టీ, చంద్రబాబు తన కొడుకును కూడా నమ్మటంలేదు- ఎంపీ విజయసాయి రెడ్డి

MP Vijaysai Reddy : వైసీపీ ప్రభుత్వం మాట తప్పని ప్రభుత్వం అని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఇప్పటి వరకూ రూ.1.42 లక్షల కోట్లు లబ్దిదారులకు అందించామన్నారు. టీడీపీకి కొత్త నిర్వచనం చెప్పారు.

MP Vijaysai Reddy  : వైసీపీ అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ నేతలు విజయవాడ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కేక్ కట్ చేశారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, పలువురు మేయర్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఇది ‌మాట తప్పని ప్రభుత్వం అన్నారు. సామాజిక న్యాయం పాటిస్తూ, పరిపాలన సౌలభ్యం కోసం సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం అన్నారు. రూ.1.42 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందించామన్నారు. రైతుభరోసా వంటి పథకాలతో రైతులకు చేరువైన ప్రభుత్వం అన్నారు. 

బూతులు తిట్టడమేనా చంద్రబాబు నైజం 

" మహిళా సాధికారత అనేది చేసి చూపాం. 50% పదవులు మహిళలకే ఇచ్చాం. వైద్య రంగంలో విప్లవాత్మక‌ మార్పులు తెచ్చాం.  విద్యారంగంలో నాడునేడుతో స్కూళ్ల అభివృద్ధి చేశాం. చంద్రబాబు తెచ్చిన పథకం చెప్పుకోవటానికి ఒక్కటీ లేదు. మహానాడులో తొడలు కొట్టిస్తున్నాడు. జనంతో బూతులు తిట్టిస్తున్నారు. టీడీపీ అంటే తొడలు, దేహం, పార్టీ.  తాగుబోతు అయ్యన్నపాత్రుడు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. సీబీఎన్ అంటే చంద్రబాబు నాయుడు కాదు, చంద్రం బూతుల నాయుడు.  ఇలా బూతులు తిట్టడమేనా చంద్రబాబు నైజం. మిగతావారు తిడుతుంటే చంద్రబాబు ఆనందం పొందుతున్నారు.  చంద్రబాబు ఏడ్చినా సింపతీ రాదు.  చంద్రబాబు తన కొడుకును నమ్మటంలేదు కానీ, దత్తపుత్రుడునే నమ్ముకుంటున్నారు.  చంద్రబాబు తనకుతాను అపరచాణక్యుడు అనుకుంటున్నారు. కానీ ఆయన్ను జనం ఇంటికి పంపారన్నది తెలుసుకోవటం లేదు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఆయన మనుషులకు తప్ప మరెవరూ బాగుజరగదు. కానీ జగన్ పాలనలో అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతుంది. "
--విజయసాయిరెడ్డి, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి 

అమలాపురం ఘటన వెనుక టీడీపీ, జనసేన

2019లో ఎలా పనిచేశామో 2024లో కూడా అంతకుమించి పని చేసి మళ్లీ జగన్ ని సీఎం చేసుకోవాలని విజయసాయి రెడ్డి అన్నారు. అమలాపురం ఘటన వెనుక టీడీపీ, జనసేన హస్తం ఉందని ఆరోపించారు. పాత్రదారులు, సూత్రదారులు అందర్నీ అరెస్టు చేస్తామన్నారు.  జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టమని అన్ని పార్టీలూ అడిగాయన్నారు. జనసేన దీక్షలు చేస్తే, అధికారంలోకి వస్తే మేమే పెడతామని టీడీపీ చెప్పిందని గుర్తుచేశారు.  ఇప్పుడు ఆ పేరును వైసీపీ పెడితే కావాలనే గొడవలు చేశారని ఆరోపించారు. అంబేడ్కర్ పేరు పెట్టవద్దని ఆ పార్టీలు చెప్పగలవా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత సీఎం జగన్ దక్కుతుందన్నారు. అమలాపురం ఘటనను చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనీసం ఖండించలేదన్నారు. 
దీనికి కారణం ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. 

2024 ఎన్నికలు టీడీపీకి చివరివి

సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు 96 శాతం పూర్తి చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నేటితో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నివాసం వద్ద పార్టీ జెండా ఎగరవేసి కేక్ కట్ చేశారు. అనంతరం అటవీ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నేరవేర్చిన ముఖ్యమంత్రుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకరని కొనియాడారు. ప్రభుత్వంపై ఎల్లో‌ మీడియా కుట్ర పూరితంగా బురద జల్లుతోందన్నారు. వైసీపీపై పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాలో‌ బస్సు యాత్రకు అపూర్వ స్పందన వచ్చిందని, ప్రతిపక్షాలు నిర్మాణాత్మక విమర్శలు చేయాలని చెప్పారు. వైసీపీ నాయకులను అరేయ్ తురేయ్ అంటూ మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు సంస్కారహీనుడని, రాబోవు ఎన్నికల్లో‌ 175 సీట్లు వైసీపీ కైవసం చేసుకోనున్నట్లు ఆయన ధీమా‌ వ్యక్తం చేశారు. 2024 ఎన్నికలు టీడీపీకి చివరి ఎన్నికలు అని ఆయన జోష్యం చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kuppam Chandrababu: కుప్పానికి పారిశ్రామిక కళ - ఐఫోన్ విడిభాగాల ఫ్యాక్టరీ సహా  ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు
కుప్పానికి పారిశ్రామిక కళ - ఐఫోన్ విడిభాగాల ఫ్యాక్టరీ సహా ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు
Pawan Kalyan Warning: ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే తాటతీస్తా.. త్వరలో ఆ నలుగురు అరెస్ట్: పవన్ కళ్యాణ్
ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే తాటతీస్తా.. త్వరలో ఆ నలుగురు అరెస్ట్: పవన్ కళ్యాణ్
Congress Politics: బీజేపీ కుట్రలు కాంగ్రెస్ బయటపెట్టినా ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: మహేష్ కుమార్ గౌడ్
బీజేపీ కుట్రలు కాంగ్రెస్ బయటపెట్టినా ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: మహేష్ కుమార్ గౌడ్
Gouri Kishan : హీరోను అలాంటి క్వశ్చన్స్ అడుగుతారా? - బాడీ షేమింగ్‌పై తమిళ హీరోయిన్ రియాక్షన్
హీరోను అలాంటి క్వశ్చన్స్ అడుగుతారా? - బాడీ షేమింగ్‌పై తమిళ హీరోయిన్ రియాక్షన్
Advertisement

వీడియోలు

Artificial Rain Failure in Delhi | Cloud Seeding | క్లౌడ్ సీడింగ్ ఫెయిల్యూర్ కి కారణాలు ఇవే ! | ABP Desam
సిరీస్ భారత్‌దే.. వన్డేల పగ టీ20లతో తీర్చుకున్న టీమిండియా
Sanju Samson in IPL 2026 | క్లాసెన్‌ ను విడుదుల చేయనున్న SRH ?
Sachin Advt in Sujeeth Direction | యాడ్స్‌కి దర్శకత్వం వహించిన సుజిత్
India vs Australia T20 Match | నేడు ఆస్ట్రేలియాతో భారత్‌ ఐదవ టీ20
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kuppam Chandrababu: కుప్పానికి పారిశ్రామిక కళ - ఐఫోన్ విడిభాగాల ఫ్యాక్టరీ సహా  ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు
కుప్పానికి పారిశ్రామిక కళ - ఐఫోన్ విడిభాగాల ఫ్యాక్టరీ సహా ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు
Pawan Kalyan Warning: ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే తాటతీస్తా.. త్వరలో ఆ నలుగురు అరెస్ట్: పవన్ కళ్యాణ్
ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే తాటతీస్తా.. త్వరలో ఆ నలుగురు అరెస్ట్: పవన్ కళ్యాణ్
Congress Politics: బీజేపీ కుట్రలు కాంగ్రెస్ బయటపెట్టినా ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: మహేష్ కుమార్ గౌడ్
బీజేపీ కుట్రలు కాంగ్రెస్ బయటపెట్టినా ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: మహేష్ కుమార్ గౌడ్
Gouri Kishan : హీరోను అలాంటి క్వశ్చన్స్ అడుగుతారా? - బాడీ షేమింగ్‌పై తమిళ హీరోయిన్ రియాక్షన్
హీరోను అలాంటి క్వశ్చన్స్ అడుగుతారా? - బాడీ షేమింగ్‌పై తమిళ హీరోయిన్ రియాక్షన్
Nizamabad: రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
Rachita Ram: శారీలో రచితా రామ్... విలన్ అంటే నమ్మగలమా?
శారీలో రచితా రామ్... విలన్ అంటే నమ్మగలమా?
Donga Police: ఇంత తెలివి తక్కువ దొంగ ఉంటాడా - పోలీసులకే సవాల్ చేశాడు - తర్వాత జరిగిందేమిటో చెప్పాల్సినపనిలేదు !
ఇంత తెలివి తక్కువ దొంగ ఉంటాడా - పోలీసులకే సవాల్ చేశాడు - తర్వాత జరిగిందేమిటో చెప్పాల్సినపనిలేదు !
Chicken festival: ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
Embed widget