అన్వేషించండి

MP Vijaysai Reddy : టీడీపీ అంటే తొడలు, దేహం, పార్టీ, చంద్రబాబు తన కొడుకును కూడా నమ్మటంలేదు- ఎంపీ విజయసాయి రెడ్డి

MP Vijaysai Reddy : వైసీపీ ప్రభుత్వం మాట తప్పని ప్రభుత్వం అని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఇప్పటి వరకూ రూ.1.42 లక్షల కోట్లు లబ్దిదారులకు అందించామన్నారు. టీడీపీకి కొత్త నిర్వచనం చెప్పారు.

MP Vijaysai Reddy  : వైసీపీ అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ నేతలు విజయవాడ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కేక్ కట్ చేశారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, పలువురు మేయర్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఇది ‌మాట తప్పని ప్రభుత్వం అన్నారు. సామాజిక న్యాయం పాటిస్తూ, పరిపాలన సౌలభ్యం కోసం సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం అన్నారు. రూ.1.42 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందించామన్నారు. రైతుభరోసా వంటి పథకాలతో రైతులకు చేరువైన ప్రభుత్వం అన్నారు. 

బూతులు తిట్టడమేనా చంద్రబాబు నైజం 

" మహిళా సాధికారత అనేది చేసి చూపాం. 50% పదవులు మహిళలకే ఇచ్చాం. వైద్య రంగంలో విప్లవాత్మక‌ మార్పులు తెచ్చాం.  విద్యారంగంలో నాడునేడుతో స్కూళ్ల అభివృద్ధి చేశాం. చంద్రబాబు తెచ్చిన పథకం చెప్పుకోవటానికి ఒక్కటీ లేదు. మహానాడులో తొడలు కొట్టిస్తున్నాడు. జనంతో బూతులు తిట్టిస్తున్నారు. టీడీపీ అంటే తొడలు, దేహం, పార్టీ.  తాగుబోతు అయ్యన్నపాత్రుడు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. సీబీఎన్ అంటే చంద్రబాబు నాయుడు కాదు, చంద్రం బూతుల నాయుడు.  ఇలా బూతులు తిట్టడమేనా చంద్రబాబు నైజం. మిగతావారు తిడుతుంటే చంద్రబాబు ఆనందం పొందుతున్నారు.  చంద్రబాబు ఏడ్చినా సింపతీ రాదు.  చంద్రబాబు తన కొడుకును నమ్మటంలేదు కానీ, దత్తపుత్రుడునే నమ్ముకుంటున్నారు.  చంద్రబాబు తనకుతాను అపరచాణక్యుడు అనుకుంటున్నారు. కానీ ఆయన్ను జనం ఇంటికి పంపారన్నది తెలుసుకోవటం లేదు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఆయన మనుషులకు తప్ప మరెవరూ బాగుజరగదు. కానీ జగన్ పాలనలో అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతుంది. "
--విజయసాయిరెడ్డి, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి 

అమలాపురం ఘటన వెనుక టీడీపీ, జనసేన

2019లో ఎలా పనిచేశామో 2024లో కూడా అంతకుమించి పని చేసి మళ్లీ జగన్ ని సీఎం చేసుకోవాలని విజయసాయి రెడ్డి అన్నారు. అమలాపురం ఘటన వెనుక టీడీపీ, జనసేన హస్తం ఉందని ఆరోపించారు. పాత్రదారులు, సూత్రదారులు అందర్నీ అరెస్టు చేస్తామన్నారు.  జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టమని అన్ని పార్టీలూ అడిగాయన్నారు. జనసేన దీక్షలు చేస్తే, అధికారంలోకి వస్తే మేమే పెడతామని టీడీపీ చెప్పిందని గుర్తుచేశారు.  ఇప్పుడు ఆ పేరును వైసీపీ పెడితే కావాలనే గొడవలు చేశారని ఆరోపించారు. అంబేడ్కర్ పేరు పెట్టవద్దని ఆ పార్టీలు చెప్పగలవా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత సీఎం జగన్ దక్కుతుందన్నారు. అమలాపురం ఘటనను చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనీసం ఖండించలేదన్నారు. 
దీనికి కారణం ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. 

2024 ఎన్నికలు టీడీపీకి చివరివి

సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు 96 శాతం పూర్తి చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నేటితో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నివాసం వద్ద పార్టీ జెండా ఎగరవేసి కేక్ కట్ చేశారు. అనంతరం అటవీ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నేరవేర్చిన ముఖ్యమంత్రుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకరని కొనియాడారు. ప్రభుత్వంపై ఎల్లో‌ మీడియా కుట్ర పూరితంగా బురద జల్లుతోందన్నారు. వైసీపీపై పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాలో‌ బస్సు యాత్రకు అపూర్వ స్పందన వచ్చిందని, ప్రతిపక్షాలు నిర్మాణాత్మక విమర్శలు చేయాలని చెప్పారు. వైసీపీ నాయకులను అరేయ్ తురేయ్ అంటూ మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు సంస్కారహీనుడని, రాబోవు ఎన్నికల్లో‌ 175 సీట్లు వైసీపీ కైవసం చేసుకోనున్నట్లు ఆయన ధీమా‌ వ్యక్తం చేశారు. 2024 ఎన్నికలు టీడీపీకి చివరి ఎన్నికలు అని ఆయన జోష్యం చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nellore Mayor Resignation: నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్

వీడియోలు

Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nellore Mayor Resignation: నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
Mowgli First Day Collection : రోషన్ కనకాల 'మోగ్లీ' - సుమ కొడుకు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
రోషన్ కనకాల 'మోగ్లీ' - సుమ కొడుకు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Embed widget