అన్వేషించండి

పాతికేళ్లలో దేశ రూపురేఖలే మార్చేస్తాం, ఇది భారత్‌కి అమృత కాలం - ప్రధాని మోదీ

Vibrant Gujarat Summit 2024: వచ్చే పాతికేళ్లలో భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Vibrant Gujarat Summit: 

అభివృద్ధి చెందిన దేశం..

మరో 25 ఏళ్లలో భారత్‌ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నదే తమ లక్ష్యం అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. Vibrant Gujarat Global Summit 2024 సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ సదస్సుని ప్రారంభించిన ప్రధాని మోదీ..మౌలిక వసతుల పరంగా భారత్‌ ఎంతో వృద్ధి సాధించిందని వెల్లడించారు. తయారీ రంగంలోనూ గతంతో పోల్చుకుంటే చాలా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. వచ్చే పాతికేళ్లు దేశానికి అమృత్ కాల్‌ అని అన్నారు. 

"ఈ మధ్యే భారత్‌ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంది. ఇప్పుడు పూర్తిగా వచ్చే పాతికేళ్లపైనే దృష్టి పెడుతున్నాం. భారత్‌100వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి. అంటే వచ్చే పాతికేళ్లూ మనకు అమృత్ కాలమే. ఇలాంటి అమృత్ కాలంలో ఇలాంటి సదస్సు జరగడం చాలా సంతోషంగా ఉంది"

- ప్రధాని నరేంద్ర మోదీ

గుజరాత్‌లో అదానీ పెట్టుబడులు..

ఈ సదస్సులో బడా వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వాళ్లంతా ఆసక్తి చూపించారు. 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే అదానీ ప్రకటించారు. అంతే కాదు లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ మరి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కాస్త అటు ఇటుగా అయినప్పటికీ భారత్ మాత్రం స్థిరంగా ఉందని తేల్చి చెప్పారు. గత పదేళ్లలో తాము తీసుకున్న నిర్ణయాలే అందుకు కారణమని అన్నారు. 

"ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి కఠిన సమయంలోనూ భారత్‌ స్థిరంగా నిలబడగలిగింది. పదేళ్లలో మేం చేసిన సంస్కరణలే ఇందుకు కారణం. ఈ సంస్కరణలన్నీ దేశ ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచాయి. ఇంత పోటీని తట్టుకుని నిలబడేలా చేశాయి. స్థిరత్వానికి భారత్ మారుపేరుగా ఉంది. విశ్వమిత్రగా మన దేశం దూసుకుపోతోంది"

- ప్రధాని నరేంద్ర మోదీ

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Sri charani: మహిళల ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
మహిళల ఐపీఎల్‌ వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
Kalvakuntla Kavitha: ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
Advertisement

వీడియోలు

Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
South Africa whitewashed India | రెండో టెస్ట్ ఓడిపోయిన టీమ్ ఇండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Sri charani: మహిళల ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
మహిళల ఐపీఎల్‌ వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
Kalvakuntla Kavitha: ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
Shiva Jyothi : శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
2019 Group 2 Issue: గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
Bruce Lee:  ఒక్క అంగుళంతో ప్రపంచాన్ని గెలిచిన యోధుడు!  బ్రూస్‌ లీ వన్-ఇంచ్ పంచ్ వెనుక రహస్యం ఏంటి..?
ది వన్-ఇంచ్ పంచ్: బ్రూస్‌లీని లెజెండ్‌గా మార్చిన ఒకే ఒక్క కిక్..! 
Fact Check: టాటా కంపెనీ కేవలం రూ.18 వేలకే హైబ్రిడ్ బైక్‌ తెచ్చిందా?, వైరల్ వార్తల వెనుకున్న నిజాలు బయటకు
టాటా హైబ్రిడ్ బైక్ ధర కేవలం రూ.18 వేలే! సోషల్ మీడియాలో ఈ ట్రెండింగ్‌ న్యూస్‌ నిజమేనా?
Embed widget