US Indo Pacific Command Name Change: ట్రంప్ సర్కార్ షాకింగ్ డెసిషన్ - ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు మార్పు - మ్యాప్లో పీఓకే పాకిస్థాన్దా? భారత్ తీవ్ర ఆగ్రహం!
US Pacific Command Trump: అమెరికా రక్షణ శాఖ సంచలన నిర్ణయం. యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరు మార్చింది. అంతే కాదు మ్యాప్లో PoK ని పాకిస్థాన్ భూభాగంగా చూపించింది. భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

PoK Shown in Pakistan Map US: అమెరికా రక్షణ విభాగం తీసుకున్న కొన్ని తాజా వ్యూహాత్మక నిర్ణయాలు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో, ముఖ్యంగా భారత రక్షణ, విదేశాంగ శాఖల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తమ అత్యంత ప్రతిష్టాత్మకమైన సైనిక విభాగం యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు నుండి ఇండో పదాన్ని తొలగిస్తూ, దానిని తిరిగి పాత పేరు అయిన యూఎస్ పసిఫిక్ కమాం గా మారుస్తూ అమెరికా రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు, అమెరికా అధికారికంగా విడుదల చేసిన ఒక అంతర్గత మ్యాప్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ భూభాగంగా చూపించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య జరగబోయే కీలక ద్వైపాక్షిక భేటీకి ముందే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతృప్తి చేసుకుంది.
పేరు మార్పు వెనుక ట్రంప్ వ్యూహం ఏంటి?
గతంలో డోనాల్డ్ ట్రంప్ తన మొదటి విడత పదవీ కాలంలో చైనాను కట్టడి చేయడంలో భారత్ ప్రాధాన్యతను గుర్తిస్తూ, అప్పటివరకు ఉన్న 'పసిఫిక్ కమాండ్' పేరును 'ఇండో-పసిఫిక్ కమాండ్'గా మార్చారు. అయితే, ఇప్పుడు మళ్లీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ పేరును మార్చడం వెనుక భిన్నమైన వ్యూహాలు ఉన్నట్లు జాతీయ మీడియా విశ్లేషిస్తోంది. అమెరికా తన సైనిక ప్రాధాన్యతలను కేవలం పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ చైనా సముద్రం వంటి తూర్పు ఆసియా ప్రాంతాలకే పరిమితం చేయాలని చూస్తోందా? లేదా హిందూ మహాసముద్రం బాధ్యతలను పూర్తిగా భారత్కే వదిలేయాలని భావిస్తోందా? అనే కోణంలో చర్చ నడుస్తోంది. ఏదేమైనా, పేరులోంచి ఇండో అనే పదాన్ని తొలగించడం దౌత్యపరంగా భారత్కు ఒక గట్టి సంకేతమేనని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మ్యాప్ వివాదం
పేరు మార్పు వివాదం నడుస్తుండగానే, అమెరికా రక్షణ వర్గాలు వాడిన ఒక మ్యాప్ భారత రక్షణ వర్గాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. జమ్మూ కశ్మీర్లోని అంతర్భాగమైన, ప్రస్తుతం పాక్ అక్రమ ఆధీనంలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని అమెరికా తన మ్యాప్లో అధికారికంగా పాకిస్థాన్ సరిహద్దుల్లో చూపించింది. భారతదేశ సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సమగ్రతను దెబ్బతీసే విధంగా సూపర్ పవర్ అమెరికా ఇలాంటి తప్పు చేయడం ప్రమాదకరమైన పరిణామమని, ఇది దశాబ్దాలుగా కశ్మీర్ విషయంలో అమెరికా పాటిస్తున్న తటస్థ విదేశాంగ విధానానికి పూర్తి విరుద్ధమని భారత్ భావిస్తోంది.
భారత్ తీవ్ర స్పందన
ఈ రెండు పరిణామాలపై భారత విదేశాంగ శాఖ అత్యంత ఘాటుగా స్పందించింది. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ అధికారులను పిలిపించి భారత్ తన తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తూ అధికారిక అభ్యంతర పత్రం జారీ చేసింది. కశ్మీర్ భౌగోళిక సరిహద్దుల విషయంలో ఎలాంటి తప్పుడు మ్యాప్లను ఆమోదించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. భౌగోళికంగా, చట్టబద్ధంగా పీఓకే భారతదేశంలో అంతర్భాగమని పునరుద్ఘాటించింది. అలాగే, కమాండ్ పేరు మార్పుపై వాషింగ్టన్లోని పెంటగాన్ ఉన్నతాధికారులతో భారత రక్షణ శాఖ సంప్రదింపులు జరుపుతోందని, దీనిపై అమెరికా నుంచి స్పష్టమైన వివరణ కోరినట్లు విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి.
Department of War Restores U.S. Pacific Command Designation.
— U.S. Pacific Command (@INDOPACOM) June 16, 2026
CAMP H.M. SMITH, Hawaii — The Department of War announced today that the U.S. Indo-Pacific Command (USINDOPACOM) will officially restore its name to the U.S. Pacific Command (USPACOM).
Originally established on… pic.twitter.com/ZL0EL3q6Ph
మోదీ-ట్రంప్ భేటీకి ముందే ఎందుకు?
ప్రధాని నరేంద్ర మోదీ, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ల మధ్య త్వరలోనే కీలక భేటీ జరగాల్సి ఉంది. వాణిజ్యం, హెచ్-1బీ వీసాలు, రక్షణ ఒప్పందాలపై చర్చించాల్సిన ఈ తరుణంలోనే ఈ వివాదాలు తెరపైకి రావడం దౌత్యపరమైన ఒత్తిడి పెంచే వ్యూహమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ రంగంలో భారత్, రష్యాల మధ్య ఉన్న మైత్రిని లేదా చైనా విషయంలో భారత్ పాటిస్తున్న స్వతంత్ర విధానాన్ని తప్పుబడుతూ అమెరికా ఈ విధమైన సైలెంట్ వార్నింగ్ ఇస్తోందా అనే విశ్లేషణలు కూడా సాగుతున్నాయి. ఈ వివాదాలు రాబోయే ద్వైపాక్షిక చర్చలపై ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















