అన్వేషించండి

COVID-19 Testing: చైనా నుంచి వచ్చినా కరోనా టెస్ట్‌లు చేయరట, రూల్ తీసేయనున్న అమెరికా!

COVID-19 Testing: చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా టెస్ట్‌లు చేయాలన్న నిబంధనను అమెరికా ఎత్తివేయనుంది.

COVID-19 Testing:

నిబంధన ఎత్తివేత..

చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ టెస్ట్‌లు చేయాలన్న నిబంధనను ఎత్తివేయాలని చూస్తోంది అమెరికా. చైనాలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, మరణాలు పెద్దగా నమోదు కాకపోవడం లాంటి పరిణామాలను గమనించిన బైడెన్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు Associated Press రిపోర్ట్ వెల్లడించింది. గతేడాది డిసెంబర్ 28న అమెరికా చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 5వ తేదీ నుంచి ఇది అమల్లోకి తెచ్చింది. అప్పటికి చైనాలో కొవిడ్ కేసులు తీవ్రంగా పెరిగాయి. హాస్పిటల్స్‌లో చోటు లేక బాధితులు పాట్లు పడ్డారు. మృతుల సంఖ్య కూడా దారుణంగా పెరిగింది. శవాలను దహనం చేసేందుకూ అవకాశం లేక రోజుల తరబడి వాటిని అలాగే ఉంచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంత జరుగుతున్నా...చైనా మాత్రం కొవిడ్ బాధితుల లెక్కలు ప్రపంచానికి వెల్లడించలేదు. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సమయంలోనే అమెరికా చైనా ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. అమెరికాలోని విమానాశ్రయాల్లో నిఘా పెట్టారు. చైనా నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడికీ కరోనా టెస్ట్ చేశారు. ఫ్లైట్‌లలోని మల మూత్రాలనూ పరీక్షించారు. Genomic Surveillance Programలో భాగంగా...చైనాతో సహా 30 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించింది అమెరికా యంత్రాంగం. 

జనవరిలో అమలు చేసిన నిబంధనల ప్రకారం చైనా నుంచి నేరుగా వచ్చినా, వయా చైనా నుంచి వచ్చినా టెస్ట్‌లు తప్పనిసరి చేశారు. 
అయితే...ఇప్పటికీ అమెరికా..చైనాపై విమర్శలు చేస్తూనే ఉంది. కొవిడ్ లెక్కల విషయంలో పారదర్శకంగా ఉండడం లేదంటూ మండి పడుతోంది. వేరియంట్‌లకు సంబంధించిన సమాచారాన్నీ అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

మనిషికి బర్డ్‌ఫ్లూ..

చైనా పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది వింత వింత రోగాలే. ఎన్నో వైరస్‌లు అక్కడి నుంచే పుట్టాయన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. కరోనా కూడా చైనా ల్యాబ్‌ నుంచే విస్తరించిందన్న వాదన ఉంది. అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు ఇలాంటి కొత్త వైరస్‌లు వ్యాప్తి చెందేందుకు ఆస్కారమిస్తుంటాయి. ఇప్పుడు అదే తరహాలో అక్కడ బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి చెందుతోంది. అయితే బర్డ్ ఫ్లూ అంటే కేవలం కోళ్లకే వస్తుందనుకుంటాం. కానీ చైనాలో తొలిసారి ఓ మనిషికి H5N1 Bird Flu సోకింది. ఇదే విషయాన్ని చైనా అధికారికంగా వెల్లడించింది. తూర్పు చైనాలోని ఓ మహిళకు ఈ ఫ్లూ సోకినట్టు ప్రకటించింది. ఆ మహిళ ఓ పౌల్ట్రీకి వెళ్లిందని అప్పటి నుంచి తాను అస్వస్థకు గురైందని వివరించింది. జనవరి 31న ఫ్లూ లక్షణాలు కనిపించిన కారణంగా టెస్ట్ చేశారు. చివరకు ఫ్లూ సోకినట్టు నిర్ధరణైంది. అంతకు ముందు కంబోడియాలోనూ 11 ఏళ్ల బాలికకు ఈ ఫ్లూ సోకి ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికే ఆ దేశంలో రెండు కేసులు నమోదయ్యాయి. 49 ఏళ్ల మహిళకూ  H5N1 Bird Flu సోకినట్టు కంబోడియా ఆరోగ్య శాఖ వెల్లడించింది. దాదాపు 9 ఏళ్లుగా ఈ వైరస్‌ అప్పుడప్పుడూ ఆందోళనకు గురి చేస్తున్నా మనుషులకు సోకింది లేదు. కానీ ఈసారి మాత్రం వైరస్ తీవ్రత పెరిగినట్టు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. 

Also Read: Manish Sisodia: సిసోడియాను క్రిమినల్స్‌తో కలిపి ఉంచారు! కోర్టు చెప్పినా వినడం లేదు - ఆప్ ఆరోపణలు

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
FIFA Shootout Drama: ఫిఫా వరల్డ్ కప్‌లో పెనాల్టీల ఊచకోత.. పరాగ్వే చేతిలో జర్మనీ ఔట్, నెదర్లాండ్స్ ను దెబ్బకొట్టిన మొరాకో!
ఫిఫా వరల్డ్ కప్‌లో ఒకేరోజు రెండు బిగ్గెస్ట్ అప్సెట్స్.. పరాగ్వే చేతిలో జర్మనీ ఔట్, నెదర్లాండ్స్ ను దెబ్బకొట్టిన మొరాకో!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Kajal Aggarwal: కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
Embed widget