By: Ram Manohar | Updated at : 25 May 2023 05:05 PM (IST)
కునో నేషనల్ పార్క్లో మరో రెండు చిరుత పిల్లలు ప్రాణాలొదిలాయి.
Cheetah Cubs Death:
మొత్తం ఆరు చీతాలు మృతి..
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఇటీవలే ఓ చిరుత పిల్ల చనిపోయింది. ఇప్పుడు మరో రెండు చీతాలూ ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 24వ తేదీన జ్వాలా చీతా నాలుగు చిరుతలకు జన్మనిచ్చింది. వీటిలో మూడు చనిపోయాయి. నాలుగో చీతాను ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉంచారు. ఈ చీతా ఆరోగ్యం కూడా విషమంగానే ఉందని అధికారులు స్పష్టం చేశారు. మొదటి చీతా...వీక్నెస్ కారణంగా చనిపోయిందని వివరించారు. ఇప్పటి వరకూ కునో నేషనల్ పార్క్లో ఆరు చీతాలు ప్రాణాలొదిలాయి. ఇవన్నీ ఆఫ్రికా నుంచి వచ్చినవే. ఈ ఏడాది మార్చి 27వ తేదీన నమీబియా నుంచి వచ్చిన చీతా సాశా కన్నుమూసింది. కిడ్నీ సమస్యతో బాధ పడుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆ తరవాత ఏప్రిల్ 13వ తేదీన ఉదయ్ చీతా చనిపోయింది. మే 9వ తేదీన దక్ష అనే మరో చీతా అనారోగ్యంతో ప్రాణాలొదిలింది. దీనిపై ఆఫ్రికన్ చీతా మెటా పాప్యులేషన్ ఎక్స్పర్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైల్డ్ చీతాల్లో పిల్లలు చనిపోవడం మామూలే అని వివరించారు.
"మరో చీతా చనిపోవడం చాలా బాధాకరం. చీతాలు ఇలా చనిపోవడం అసహజం ఏమీ కాదు. వైల్ట్ చీతాల్లో మరణాల రేటు అధికంగానే ఉంటుంది. మిగతా చీతాలతో పోల్చుకుంటే...వీటికి ఎక్కువ సంఖ్యలో సంతానం కలుగుతుంది. ఎండాకాలం కావడం వల్ల డీహైడ్రేషన్ కారణంగా చీతాలు చనిపోతుంటాయి. పుట్టుకతోనే వీక్గా ఉన్న పిల్లలు త్వరగా ప్రాణాలు కోల్పోతాయి"
- నిపుణులు
Madhya Pradesh | Two cubs of Cheetah Jwala died today during monitoring while being in weak condition at Kuno National Park. Her first cub died on May 23. https://t.co/UdPpvbJ3ed
— ANI (@ANI) May 25, 2023
Madhya Pradesh | Second cub of Cheetah Jwala died during monitoring while being in weak condition amid sweltering heat at Kuno National Park. Cheetah Jwala had three cubs. Her first cub died on May 23. https://t.co/tvo43BIIEf pic.twitter.com/xLbfAuBj0e
— ANI (@ANI) May 25, 2023
దక్షిణాఫ్రికాలోని వాటర్బర్గ్ బయోస్పియర్ నుంచి దక్ష, నిర్వా, వాయు, అగ్ని, గామిని, తేజస్, వీర, సూరజ్, ధీర, ప్రభాస్, పావక్ అనే 11 చిరుతలతో పాటు ఉదయ్ అని మగ చిరుతను భారత్ కు తీసుకొచ్చారు. దేశంలో ఎప్పుడో అంతరించిన చిరుతలను మళ్లీ సంరక్షించడం కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 16న దక్షిణాఫ్రికా నుంచి భారత్కు తీసుకువచ్చి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో ఉంచి సంరక్షిస్తున్నారు. దక్షిణాఫ్రికా నుండి కునో నేషనల్ పార్క్కు తీసుకొచ్చిన 12 చిరుతలలో 7 మగ చిరుతలు ఉన్నాయి. అందులో మగ చిరుత ఉదయ్ కూడా ఉంది. అయితే వాటర్ బర్గ్ బయో స్పియర్ నుంచి తీసుకొచ్చిన చిరుతలలో చనిపోయిన రెండో చిరుత ఉదయ్. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతల్లో మార్చి 23న షాషా అనే ఆడ చనిపోవడం తెలిసిందే. కిడ్నీ ఫెయిల్యూర్, డీహైడ్రేషన్ సమస్యల కారణంగా ఆడ చిరుత షాషా మృతి చెందింది.
Also Read: Tipu Sultan Sword Auction: రూ.140 కోట్లు పలికిన టిప్పు సుల్తాన్ ఖడ్గం, లండన్లో వేలంపాట
Europa Clipper: మీరు కాకపోయినా మీ పేరైనా గురుగ్రహంపైకి వెళ్లాలనుకుంటున్నారా? ఈ నాసా ఆఫర్ మీకోసమే
Delivery Man Letter: ఫ్లవర్ పాట్ పగులగొట్టాడు, ఇంటర్నెట్లో హీరో అయిపోయాడు- ఎలాగంటే!
EFLU: ఇఫ్లూలో 132 నాన్ టీచింగ్ ఉద్యోగాలు, అర్హతలివే!
Railway Apprenticeship: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, రాయ్పూర్లో 1033 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు!
TSLPRB: ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాలు, ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు