అన్వేషించండి

Budget 2025 : వికసిత్‌ భారత్‌కు, ఆ వర్గాల అభివృద్ధికి ఊతమిచ్చేలా కేంద్ర బడ్జెట్ - నేటి సమావేశాలకు ముందు మోదీ

Budget 2025 : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పురస్కరించి ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. చారిత్రాత్మక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నామని వెల్లడించారు.

Budget 2025 : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం తప్పక నింపుతుందని భరోసా ఇచ్చారు. ఈ సెషన్‌లో చారిత్రక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నామని ప్రధాని మోదీ చెప్పారు. ఈ బడ్జెట్ దేశానికి కొత్త శక్తిని, ఆశను పెంపొందిస్తుందన్నారు.

అభివృద్ధి లక్ష్యంతో మిషన్ మోడ్ లో ముందుకెళ్తున్నాం మోదీ

"పేదలు, సామాన్యులపై మహాలక్ష్మి కరుణ ఎప్పుడూ ఉండాలి.  దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలను లక్ష్మీ ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. మూడోసారి ఎన్డీయేకు ప్రజలు పట్టం కట్టారు. పార్లమెంట్ లో మూడోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నాం. ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుంది. భారత్ అభివృద్ధి లక్ష్యంలో మిషన్ మోడ్ లో దూసుకెళ్తున్నాం. ఈ సారి పార్లమెంటులో చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెట్టనున్నాం. కొత్త విధానాలపైనే ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇన్నోవేషన్, ఇన్ క్లూజన్, ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంలో ముందుకెళ్తున్నాం. ఈ బడ్జెట్ వృద్ధికి ఊతమిస్తుంది. ఈ సెషన్ యువతకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ బడ్జెట్‌ వికసిత్‌ భారత్‌కు ఊతం ఇస్తుంది. ప్రతి సెషన్‌కి ముందు కొన్ని విదేశీ శక్తుల జోక్యం ఉండేది. పదేళ్ల కాలంలో ఈ సారే అది కనిపించలేదు. పార్లమెంటులో ప్రతి అంశంపైనా సమగ్ర చర్చ జరగాలి. ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నాను" అని ప్రధాని మోదీ చెప్పారు. ఇకపోతే నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంపీలతా పార్లమెంట్ కు చేరుకున్నారు.

పన్ను స్లాబ్‌ల పెంపుపై ఆశాభావం

చాలా మంది వేతన తరగతికి పన్ను స్లాబ్‌ల పెంపుపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ, దానికి సంబంధించి సమాచారంపై ఇంకా ఎటువంటి నిర్ధారణ రాలేదు. నిజానికి, భారతదేశంలోని ఆదాయపు పన్నుతో పాటు జీఎస్టీ వసూళ్లలో సింహభాగం మధ్యతరగతి ప్రజలదే కావడం గమనార్హం. మోదీ హయాంలో దాఖలైన ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ఐటీఆర్‌లు) సంఖ్య 2013-14లో 3.35 కోట్ల నుంచి 2023-24 నాటికి 7.54 కోట్లకు పెరిగింది. అయితే జీరో ఐటీఆర్‌ల సంఖ్య 1.69 కోట్ల నుంచి 4.73 కోట్లకు రెండింతలు పెరిగింది. 

బడ్జెట్ సమావేశాలు 2024 -25

ఈ సారి బడ్జెట్ సమావేశాలు 2024 -25కు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న ఆమె కేంద్ర బడ్జెట్ ను సభకు సమర్పిస్తారు. బడ్జెట్ సమావేశాలను రెండు విడతలుగా శుక్రవారి నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. అందులో తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13వ తేదీ వరకు, రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనుండడం వరుసగా ఇది 8వ సారి కావడం చెప్పుకోదగ్గ విషయం.

Also Read : Delhi Weather : 6 ఏళ్ల రికార్డ్ బద్దలు - ఢిల్లీలో చలి తట్టుకోలేక 56 రోజుల్లోనే 474 మంది మృతి - సర్కారుకు నోటీసులు

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP Leaders Suspension: కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలపై పార్టీ వేటు
కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలపై పార్టీ వేటు
Minors Drugs Party: మొయినాబాద్ ఫాంహౌస్‌లో మైనర్ల మత్తు పార్టీ కలకలం, ఎస్ఓటీ పోలీసుల ఆకస్మిక దాడి
మొయినాబాద్ ఫాంహౌస్‌లో మైనర్ల మత్తు పార్టీ కలకలం, ఎస్ఓటీ పోలీసుల ఆకస్మిక దాడి
Ind vs Pak Womens World Cup: అదరగొట్టిన అమ్మాయిలు.. పాక్ మీద 88 పరుగుల తేడాతో ఘన విజయం, క్రాంతి గౌడ్ అదుర్స్
అదరగొట్టిన అమ్మాయిలు.. పాక్ మీద 88 పరుగుల తేడాతో ఘన విజయం, క్రాంతి గౌడ్ అదుర్స్
Multibagger Stock: రూ.50 విలువ ఉన్న మల్టీబ్యాగర్ స్టాక్.. 6 నెలల్లో మీ పెట్టుబడిని రెట్టింపు చేసింది
రూ.50 విలువ ఉన్న మల్టీబ్యాగర్ స్టాక్.. 6 నెలల్లో మీ పెట్టుబడిని రెట్టింపు చేసింది
Advertisement

వీడియోలు

దుర్గా నిమజ్జనంలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లదాడి, వాహనాలకు నిప్పు.. ఇంటర్నెట్ నిషేధం
కాంతార భూతగణాల కథ.. ఊహకందని ఈ శక్తి ఈ గణాల సొంతం
Surya Kumar Yadav as T20 Captain | టీ20 కెప్టెన్ గా కొనసాగనున్న సూర్య కుమార్ యాదవ్
Rohit Sharma Virat Kohli 2027 ODI World Cup | చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కీలక ప్రకటన
India vs West Indies Test Match Day 3 | విండీస్‌పై ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో భారత్ విజయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Leaders Suspension: కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలపై పార్టీ వేటు
కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలపై పార్టీ వేటు
Minors Drugs Party: మొయినాబాద్ ఫాంహౌస్‌లో మైనర్ల మత్తు పార్టీ కలకలం, ఎస్ఓటీ పోలీసుల ఆకస్మిక దాడి
మొయినాబాద్ ఫాంహౌస్‌లో మైనర్ల మత్తు పార్టీ కలకలం, ఎస్ఓటీ పోలీసుల ఆకస్మిక దాడి
Ind vs Pak Womens World Cup: అదరగొట్టిన అమ్మాయిలు.. పాక్ మీద 88 పరుగుల తేడాతో ఘన విజయం, క్రాంతి గౌడ్ అదుర్స్
అదరగొట్టిన అమ్మాయిలు.. పాక్ మీద 88 పరుగుల తేడాతో ఘన విజయం, క్రాంతి గౌడ్ అదుర్స్
Multibagger Stock: రూ.50 విలువ ఉన్న మల్టీబ్యాగర్ స్టాక్.. 6 నెలల్లో మీ పెట్టుబడిని రెట్టింపు చేసింది
రూ.50 విలువ ఉన్న మల్టీబ్యాగర్ స్టాక్.. 6 నెలల్లో మీ పెట్టుబడిని రెట్టింపు చేసింది
Medaram Jatara 2026: మేడారంలో గద్దెల చుట్టూ ఉన్న నిర్మాణాల కూల్చివేత ప్రారంభించిన అధికారులు
మేడారంలో గద్దెల చుట్టూ ఉన్న నిర్మాణాల కూల్చివేత ప్రారంభించిన అధికారులు
Tirumala Darshan Update: తిరుమలలో వృద్ధుల దర్శనంపై వదంతులు నమ్మొద్దు.. శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
తిరుమలలో వృద్ధుల దర్శనంపై వదంతులు నమ్మొద్దు.. శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
KTR Fires on RTC Charges Hike: కాంగ్రెస్‌ను ఓడించారనే కక్షతో హైదరాబాద్‌లో ఆర్టీసీ ఛార్జీలు పెంపు, పండుగ పూట దుర్మార్గం: కేటీఆర్
కాంగ్రెస్‌ను ఓడించారనే కక్షతో హైదరాబాద్‌లో ఆర్టీసీ ఛార్జీలు పెంపు: కేటీఆర్
Jubilee Hills By Election: బీసీలకే జూబ్లీహిల్స్ టికెట్.. కాంగ్రెస్ టికెట్ రేసులో నలుగురిలో ముందున్నది ఎవరు?
బీసీలకే జూబ్లీహిల్స్ టికెట్.. కాంగ్రెస్ టికెట్ రేసులో నలుగురిలో ముందున్నది ఎవరు?
Embed widget