అన్వేషించండి

Top Headlines Today: ఏపీలో అధికారం కావాలంటే సీమలో బలమే కీలకం- తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్

AP Telangana Latest News 19 May 2024: నేటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. ఒక్క క్లిక్ చేసి 5 ప్రధాన వార్తలు చదవండి.

రాష్ట్రంలో అల్లర్ల టైంలో జగన్ లండన్ పర్యటనా? లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు
ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల నడుమ సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రి రెండు రోజుల క్రితం యూకే పర్యటనకు వెళ్లడంపై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ఆదివారం (మే 19) లక్ష్మీ నారాయణ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వివిధ చోట్ల జరుగుతున్న హింసాత్మక ఘటనలు, ఘర్షణలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

అమెరికాకు వెళ్లిన చంద్రబాబు, ఐదారు రోజుల పాటు అక్కడే
ఎన్నికల హడావుడి, పోలింగ్ కూడా ముగియడంతో రాజకీయ పార్టీల అధినేతలు విశ్రాంతి పొందుతున్నారు. కొంత మంది విదేశాలకు వెళ్లి సేద తీరుతుండగా.. మరికొంత మంది దేశీయంగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్తున్నారు. నిన్న సీఎం  జగన్ లండన్ పర్యటనకు వెళ్లగా.. నేటి నుంచి చంద్రబాబు అమెరికా పర్యటన కొనసాగనుంది. చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 

తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఆ షరతు విధింపు
తెలంగాణ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, కొన్ని షరతులు విధించింది. జూన్ 4 లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని షరతు విధించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని పేర్కొంది. అలాగే, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులెవరూ ఈ భేటీకి వెళ్లకూడదని ఆదేశించింది. కాగా, ఎన్నికల కోడ్ కారణంగా శనివారం జరగాల్సిన కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వలేదు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

తెలంగాణలో మరో ఎయిర్ పోర్టుకు ముందడుగు - రేవంత్ రెడ్డి రివ్యూ
దశాబ్దాలుగా వరంగల్ వాసులు ఆశగా ఎదురు చూస్తున్న కల నెరవేరనుంది. వరంగల్‌ విమానాశ్రయం (Warangal Airport) నిర్మాణానికి ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన తరవాత వరంగల్‌ విమానాశ్రయం వ్యవహారాలపై సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్షించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక వరంగల్ ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ సైలెంట్‌గా ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

అధికారం నిలబడాలంటే సీమలో నిలబెట్టుకునే బలమే కీలకం - వైసీపీ ఆశలు నెరవేరతాయా ?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాలు ఉన్నాయి. మెజార్టీ మార్క్  సాధించడానికి 88 స్థానాల్లో విజయం సాధించారు. రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో వైసీపీ గత ఎన్నికల్లో 49  స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి మూడు అంటే మూడు దక్కాయి. అది అసలైన స్వీప్. గతంలో ఉత్తరాంధ్ర, కోస్తాల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. కానీ.. ఈ సారి మాత్రం భిన్నమైన రాజకీయం కనిపిస్తోంది. విపక్షాలు కూటమిగా ఏర్పడటం, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తున్న సమయంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ వైఎస్ఆర్‌సీపీకి భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget