అన్వేషించండి
Advertisement
Vyooham Movie: వ్యూహం మూవీపై హైకోర్టు కీలక నిర్ణయం - కమిటీ ఏర్పాటు
Vyooham Movie News: గతంలో ఇలాంటి అంశంలోనే బాంబే హైకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది. అలాంటి కమిటీని ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నామని హైకోర్టు తెలిపింది.
Vyooham Movie Latest News: వ్యూహం సినిమాపై హైకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలన్నది పిటిషనర్, ప్రతివాదులు కలిసి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కమిటీ సభ్యులు ఎవరనే నిర్ణయాన్ని తమకు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇలాంటి అంశంలోనే బాంబే హైకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది. అలాంటి కమిటీని ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నామని, సభ్యులను ఎంచుకొనే బాధ్యతను మాత్రం పిటిషనర్, ప్రతివాదులే చూసుకోవాలని హై కోర్టు సూచించింది. అలా ఏర్పాటు చేసిన కమిటీకి వ్యూహం సినిమాను చూపించాలని ధర్మాసనం నిర్దేశించింది. కమిటీ రిపోర్ట్ ను శుక్రవారం లోపు హై కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం వ్యూహం చిత్రంపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తిరుపతి
పర్సనల్ ఫైనాన్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets