అన్వేషించండి

Andhra News: 'ఏపీలో దొంగ ఓట్లపై చర్యలు తీసుకోండి' - పారదర్శక ఓటర్ల జాబితా కోసం చర్యలు చేపట్టాలన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్

TDP MP Galla Jayadev: ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పార్లమెంటులో ఈ అంశంపై తన గళాన్ని వినిపించారు.

TDP MP Galla Jayadev Voice in Parliament on Irregularities of AP Voters List: ఏపీలో ఓటర్ల జాబితాలో (Voters List) అక్రమాలు, దొంగ ఓట్ల వ్యవహారంపై పార్లమెంటులో (Parliament) టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ (Galla Jayadev) తన వాణి వినిపించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం, విధి విధానాలపై బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఆదేశాలు, నిబంధనలు ఏపీలో ఎక్కడా అమలు కావడం లేదని, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించే పరిస్థితి లేదని పార్లమెంట్ దృష్టికి తెచ్చారు. 'ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించే విషయంలో ఈసీ ఆదేశాలను డీఆర్వోలు, స్థానిక సిబ్బంది ఏమాత్రం పాటించడం లేదు. ఓటర్ల జాబితాను ఒత్తిళ్లకు లొంగి మార్చేస్తున్నారు. ఈసీ ఆదేశాలు ఒకలా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది.' అని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో నేతలు ఈసీని కలిసి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఓటర్ల జాబితా నుంచి టీడీపీ సానుభూతి పరులు, కార్యకర్తల ఓట్లు తొలగిస్తున్నారని ఆధారాలతో సహా వివరించినట్లు గుర్తు చేశారు. ఓటర్ల జాబితాలో లోపాలున్నాయంటే, కింది స్థాయి అధికారులపైకి ఉన్నతాధికారులు నెపం నెట్టేస్తున్నారని అన్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదనే విషయాన్ని పార్లమెంటుకు వివరించారు.

'కేంద్రం జోక్యం చేసుకోవాలి'

తుది ముసాయిదా జాబితా విడుదల చేసిన సందర్భంలో 13 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించినట్లు ఎన్నికల సంఘం అధికారులు చెప్పారని గల్లా జయదేవ్ పేర్కొన్నారు. ఆ అధికారిక ప్రకటన తర్వాత కూడా అందుకు పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.?. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని, పారదర్శక ఓటర్ల జాబితా రూపొందించేలా చర్యలు చేపట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. 'ఏపీలో ఎన్నికల అక్రమాలను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వెంటనే స్థానికులతో సంబంధం లేని అధికారుల పర్యవేక్షణలో ఓటర్ల జాబితా రూపొందించడంపై దృష్టి సారించాలి. ఓటర్ల జాబితాను సరిదిద్దాలి.' అని తెలిపారు. 

పరస్పరం ఫిర్యాదులు

ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని టీడీపీ, జనసేన నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం సీఈసీకి ఈ అంశంపై దృష్టి తెచ్చారు. అధికార వైసీపీ నేతలే ఓటర్ల జాబితాలో టీడీపీ, జనసేన సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. అటు, వైసీపీ నేతలు సైతం డబుల్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, ఓటర్ల జాబితాలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో సీఈవో కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్క్రూటినీ చేసి డబుల్ ఓట్లు ఉంటే తొలగించాలని ఆదేశించారు.

రాష్ట్రానికి ఈసీ బృందం

మరోవైపు, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. గురువారం సీఈసీ బృందం విజయవాడకు రానుంది. ఈ నెల 22, 23 తేదీల్లో కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సన్నద్దతపై భేటీ నిర్వహించనుంది. కాగా, ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావొచ్చనే చర్చ సాగుతోంది. అటు, రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. 

Also Read: Andhra News : పుట్టినరోజు వేడుకల పేరుతో 100 కోట్లు లూఠీ - సీఎం జగన్‌పై టీడీపీ ఆగ్రహం !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Venkatreddy : పవన్‌ను విమర్శించను - జగన్ అసెంబ్లీకి వెళ్లాలి - అమరావతిలో మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
పవన్‌ను ఇప్పుడు విమర్శించను - జగన్ అసెంబ్లీకి వెళ్లాలి - అమరావతిలో మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Hawala money seizure: కారులో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే .. షాక్ అయిన పోలీసులు - ఎవరి డబ్బు ?
కారులో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే .. షాక్ అయిన పోలీసులు - ఎవరి డబ్బు ?
Minister Ponguleti: ఎల్పీనగర్ సీరీస్ భూముల్ని రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది కేటీఆరే - మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
ఎల్పీనగర్ సీరీస్ భూముల్ని రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది కేటీఆరే - మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
Mega PTM: ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా

వీడియోలు

Vintage Virat Kohli | సఫారీలతో రెండో వన్డేలో వింటేజ్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్న విరాట్
Ruturaj Gaikwad Century in India vs South Africa ODI |  అన్నా! నువ్వు సెంచరీ చెయ్యకే ప్లీజ్ | ABP Desam
Harbhajan Singh about Rohit Sharma Virat Kohli | రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌పై హర్బజన్ సింగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Venkatreddy : పవన్‌ను విమర్శించను - జగన్ అసెంబ్లీకి వెళ్లాలి - అమరావతిలో మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
పవన్‌ను ఇప్పుడు విమర్శించను - జగన్ అసెంబ్లీకి వెళ్లాలి - అమరావతిలో మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Hawala money seizure: కారులో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే .. షాక్ అయిన పోలీసులు - ఎవరి డబ్బు ?
కారులో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే .. షాక్ అయిన పోలీసులు - ఎవరి డబ్బు ?
Minister Ponguleti: ఎల్పీనగర్ సీరీస్ భూముల్ని రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది కేటీఆరే - మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
ఎల్పీనగర్ సీరీస్ భూముల్ని రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది కేటీఆరే - మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
Mega PTM: ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
Hydra Ranganath: చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
IndiGo Flights Cancelled: ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
Ram Gopal Varma : హీరోగా RGV... సెన్సేషనల్ 'షో మ్యాన్' - విలన్ ఎవరో తెలుసా?
హీరోగా RGV... సెన్సేషనల్ 'షో మ్యాన్' - విలన్ ఎవరో తెలుసా?
IndiGo Flights Cancelled : ఇండిగో రాకముందు భారతదేశంలో ఏయే విమానయాన సంస్థలు మూతపడ్డాయి? పూర్తి జాబితా ఇక్కడ చూడండి
ఇండిగో రాకముందు భారతదేశంలో ఏయే విమానయాన సంస్థలు మూతపడ్డాయి? పూర్తి జాబితా ఇక్కడ చూడండి
Embed widget