అన్వేషించండి

Online Gambling Games: ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌పై నిషేధం, ఆ కంపెనీలు ప్రభుత్వం కంట్రోల్‌లోనే

Online Gambling Games: ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ గేమ్స్‌పై నిషేధం విధిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Online Gambling Games: 

తమిళనాడులో బ్యాన్..

తమిళనాడు ప్రభుత్వం ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌పై నిషేధం విధించింది. వాటిని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు వీలుగా అసెంబ్లీలో ఓ బిల్లు పాస్ చేసింది. గతంలో ఆన్‌లైన్ గేమ్స్‌పై నిషేధం విధించిన స్టాలిన్ ప్రభుత్వం...ఇప్పుడు గ్యాంబ్లింగ్ గేమ్స్‌పైనా వేటు వేసింది. తమిళనాడు న్యాయశాఖమంత్రి ఎస్‌ రెగుపతి ఈ బిల్‌ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కొందరు ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌కి అలవాటు పడి, మోసపోయి ఆత్మహత్యలకు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ తరహా ఘటనలు పెరిగాయి. అందుకే...తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి కూడా ఈ నిర్ణయానికి పూర్తి మద్దతు తెలిపారు. అక్టోబర్ 7వ తేదీనే ఈ ప్రకటన చేశారు. సెప్టెంబర్‌లో తమిళనాడు కేబినెట్ ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. జస్టిస్ చంద్రు ప్యానెల్ ఇచ్చిన నివేదిక ప్రకారం...ఆన్‌లైన్ రమ్మీని పూర్తిగా నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది ప్రభుత్వం. గతంలో రెండు సార్లు ఈ బిల్ పాస్ చేయాలని చూసినా...మద్రాస్ హైకోర్ట్ తీర్పుతో అది సాధ్యపడలేదు. గతేడాది ఆగస్టులోనూ ప్రయత్నం జరగగా...అప్పట్లో మద్రాస్ న్యాయస్థానం "ఇది రాజ్యాంగబద్ధం కాదు" అని స్పష్టం చేసింది. 
అయితే...గడిచిన మూడేళ్లలో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌ కారణంగా...తమిళనాడులో 20 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటి నుంచి ఈ గేమ్స్‌పై పూర్తి స్థాయి నిఘా ఉంటుంది. ఆన్‌లైన్ గేమ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రతి కంపెనీని తమిళనాడు ప్రభుత్వం నియంత్రించనుంది. 

ఆన్‌లైన్ బెట్టింగ్‌పైనా వేటు..

దేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ జాడ్యంలా విస్తరిస్తూండటంతో అనేక దుష్ఫరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు కూడా ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ మాయలో పడి లక్షలు పోగొట్టుకుని నిరాశా నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీంతో కేంద్రం ఈ ఆన్ లైన్ బెట్టింగ్ వ్యవస్థను నియంత్రించాలని నిర్ణయించుకుంది. అలాంటి సంస్థల ప్రకటనలపై కొత్త నియామవళి జారీ చేసింది. అలాంటి ప్రకటనలను పూర్తిగా నిషేధించింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ప్రోత్స‌హించే ప్ర‌క‌ట‌న‌ల‌పై నిషేధం విధిస్తూ సమాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. వినియోగ‌దారుల‌కు ఇవి సామాజికార్ధిక ముప్పుగా ప‌రిణ‌మిస్తు న్నందున ఈ త‌ర‌హా ప్ర‌క‌ట‌న‌ల‌ను నిలిపివేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ వేదిక‌లకు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌లకు దూరంగా ఉండాల‌ని ప్రింట్, ఎల‌క్ట్రానిక్, డిజిట‌ల్ మీడియాల‌ను కేంద్రం కోరింది.  నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. ప‌లు ప్రింట్, ఎల‌క్ట్రానిక్‌, సోషల్‌, ఆన్‌లైన్ మీడియాలో పెద్ద‌సంఖ్య‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్స్, ప్లాట్‌ఫాంల గురించిన ప్ర‌క‌ట‌న‌లు వెల్లువెత్తిన క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ను దేశంలోని ప‌లు ప్రాంతాల్లో చ‌ట్ట‌విరుద్ధ‌మైన‌విగా ప‌రిగ‌ణిస్తార‌ని, వీటిపై ప్ర‌క‌ట‌న‌లు ముఖ్యంగా చిన్నారులు, యువ‌త‌కు సామాజికార్ధిక ముప్పుగా ప‌రిణ‌మించాయ‌ని ప్ర‌భుత్వం జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల్లో స్ప‌ష్టం చేసింది.

Also Read: Congress President Kharge: లేబర్ యూనియన్ లీడర్‌ నుంచి ఓటమి ఎరగని స్థాయికి, ఖర్గే రాజకీయ ప్రస్థానమిదే

టాప్ హెడ్ లైన్స్

Simon Wall Broken: సీమోన్ అజేయమైన కోటకు బెల్జియం బీటలు.. 650 నిమిషాల రికార్డ్ క్లీన్ షీట్ బ్రేక్, అయినా సెమీస్ లోకి దూసుకెళ్లిన స్పెయిన్!
సీమోన్ అజేయమైన కోటకు బెల్జియం బీటలు.. 650 నిమిషాల రికార్డ్ క్లీన్ షీట్ బ్రేక్, అయినా సెమీస్ లోకి దూసుకెళ్లిన స్పెయిన్!
Jofra Archer Vs Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
IND VS ENG 5th T20i Preview: శ్రేయస్  కెప్టెన్సీకి పొంచి ఉన్న గండం.. ఇంగ్లాండ్‌తో లాస్ట్ పోరుకు టీమిండియా సై, సంజూ శాంసన్ కంబ్యాక్ పై ఊహాగానాలు!
శ్రేయస్  కెప్టెన్సీకి పొంచి ఉన్న ముప్పు.. ఇంగ్లాండ్‌తో లాస్ట్ పోరుకు టీమిండియా సై, సంజూ శాంసన్ కంబ్యాక్ పై ఊహాగానాలు!
Smriti Mandhana Historic Milestone:  స్మృతి మంధాన సరికొత్త హిస్టారికల్ రికార్డ్..ఆ మైలురాయిని అందుకున్న యంగెస్ట్ ప్లేయర్ గా ఘ‌న‌త‌
స్మృతి మంధాన సరికొత్త హిస్టారికల్ రికార్డ్..ఆ మైలురాయిని అందుకున్న యంగెస్ట్ ప్లేయర్ గా ఘ‌న‌త‌

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
E20తో మైలేజ్‌ 5 శాతం వరకు తగ్గొచ్చని ఒప్పుకున్న కేంద్రం, కానీ ప్రయోజనాలే ఎక్కువని స్పష్టీకరణ
E20తో మైలేజ్ 5 శాతం వరకు తగ్గొచ్చు - అంగీకరించిన కేంద్రం, కానీ..!
Jofra Archer Vs Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
Telangana Mass Killing:షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
Embed widget