అన్వేషించండి

Afghanistan President: అఫ్గాన్ తదుపరి అధ్యక్షుడు 'బరాదర్' గురించి షాకింగ్ విషయాలు!

అఫ్గానిస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు ముందడుగు వేస్తున్నారు. తదుపరి అఫ్గాన్ అధ్యక్షుడ్ని నేడు ప్రకటించనున్నారు. మరి అతని గురించి ఈ నిజాలు తెలుసా?

అఫ్గానిస్థాన్ లో తాలిబన్ల ధాటికి పౌరులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం దేశం అల్లకల్లోలంగా మారింది. ఎవరైనా తమను రక్షిస్తారేమోనని వేచిచూస్తున్నారు. అయితే చాలా దేశాలు తమ పౌరులను అఫ్గాన్ నుంచి రప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే ఇలాంటి తరుణంలో అఫ్గానిస్థాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాలిబన్లు రెడీ అవుతున్నారు. తదుపరి అధ్యక్షుడిగా ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ ను ఎంపిక చేసింది తాలిబన్ల బృందం. ఆయన ప్రస్తుతం దోహాలో ఉన్నారు.

అయితే దోహా నుంచి రాజధాని కాబూల్ వచ్చి తదుపరి అధ్యక్షుడిపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపైనా ఈ మేరకు తాలిబన్ల నేతలు కీలక ప్రకటన చేయనున్నారు.

ఎవరీ బరాదర్..

తాలిబన్‌ రాజకీయ విభాగానికి ఈయనే అధిపతి. 1970ల్లో అఫ్గాన్‌ను సోవియట్‌ ఆక్రమించుకోవడంతో తిరుగుబాటు బృందంలో చేరాడు. 'అఫ్గాన్‌ ముజాహిదీన్‌' తరఫున పోరాడాడు. సోవియట్‌ దళాలు వెళ్లిపోయిన తర్వాత దేశంలో అవినీతి, అంతర్యుద్ధం చెలరేగాయి. అప్పటికే ఒంటి కన్ను ముల్లా ఒమర్‌తో కలిసి మదర్సాను స్థాపించిన బరాదర్‌... తర్వాత అతడితో కలిసి తాలిబన్‌ ఉద్యమాన్ని ప్రారంభించాడు. పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) మద్దతుతో ఆ సంస్థ ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకుని, 1996లో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అమెరికా ఒత్తిడి కారణంగా 2010లో పాకిస్థాన్‌లోని ఐఎస్‌ఐ, అగ్రరాజ్య సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) బృందాలు బరాదర్‌ను అరెస్టు చేశాయి. అయితే, ట్రంప్‌ ప్రభుత్వ అభ్యర్థన మేరకు 2018 అక్టోబరులో పాకిస్థాన్‌ అతడిని విడిచిపెట్టింది.

ప్రపంచ రాజకీయాలు..

అఫ్గానిస్థాన్ లో అధికార మార్పిడి ప్రపంచస్థాయి రాజకీయాలపైనా ప్రభావం చూపనుంది. ఇప్పటికే చైనా, రష్యా, టర్కీ, పాకిస్థాన్ నూతనంగా ఏర్పాటు కానున్న తాలిబన్ల ప్రభుత్వానికి మద్దతు తెలిపాయి. అయితే ప్రస్తుత పరిస్థితికి అమెరికాయే కారణమని ప్రపంచమంతా వాదిస్తోంది. కాబూల్ లోని తమ దౌత్య కార్యాలయాలను తాము ఖాళీ చేయబోమని చైనా, రష్యా, పాకిస్థాన్ ప్రకటించాయి.

అఫ్గానిస్థాన్ లో శాశ్వతంగా తాలిబన్ల అధికారం నడుస్తుందని చైనా ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా ఓటమి అఫ్గాన్ లో శాంతికి దోహదపడుతుందని ఇరాన్ అభిప్రాయపడింది. మరోవైపు బానిస సంకెళ్లను అక్కడి ప్రజలు తెంచేశారని పాక్ తెలిపింది.

భారత్ ఏమంటోంది?

అఫ్గాన్ ప్రజలు, మహిళలు, పిల్లలు భయాందోళనలో జీవిస్తున్నారని ఐక్యారాజ్యసమితికి భారత్ తెలిపింది.

" అఫ్గానిస్థాన్ పొరుగు దేశంగా అక్కడి ప్రజల పరిస్థితులపై భారత్ ఆందోళన చెందుతోంది. మహిళలు, పిల్లలు భయాందోళనలో ఉన్నారు.               "
-టీఎస్ తిరుమూర్తి, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి

ALSO READ:

US Plane Inside Pics: ఆ విమానంలో 640 మంది తరలింపు... వైరల్ పిక్ పై క్లారిటీ ఇచ్చిన యూఎస్ రక్షణ అధికారులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: 'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
YS Sharmila Bus : మహిళలకు ఉచిత  బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని  వినూత్నంగా  ప్రశ్నించిన షర్మిల
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని వినూత్నంగా ప్రశ్నించిన షర్మిల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణహమాస్ చీఫ్ సిన్వర్ హతం, కీలక ప్రకటన చేసిన ఇజ్రాయేల్సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు, వాట్సాప్‌లో మెసేజ్‌అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: 'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
YS Sharmila Bus : మహిళలకు ఉచిత  బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని  వినూత్నంగా  ప్రశ్నించిన షర్మిల
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని వినూత్నంగా ప్రశ్నించిన షర్మిల
Rotten Chicken: ఆరు బయట చికెన్ తింటున్నారా? - ఇది చూస్తే నిజంగా షాక్!
ఆరు బయట చికెన్ తింటున్నారా? - ఇది చూస్తే నిజంగా షాక్!
Andhra BJP : మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
Embed widget