అన్వేషించండి

Panjshir Taliban: తాలిబన్లకు పంజ్ షీర్ భయం.. 300 మంది తాలిబన్లు హతం ... బాగ్లాన్‌, అంద్రాబ్ ప్రాంతాలు తిరిగి కైవసం!

అఫ్గానిస్థాన్ ఆక్రమించుకున్న తాలిబన్లకు గట్టి దెబ్బ తగిలింది. 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్లు పంజ్ షీర్ సైన్యం ప్రకటించింది.

అఫ్గానిస్థాన్ వశం చేసుకున్న తాలిబన్లు తమకు తిరుగులేదనుకున్నారు. దేశాన్ని ఆక్రమించుకున్నప్పటి నుంచి ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారు. అఫ్గాన్‌ సైన్యం కూడా ఏమాత్రం ప్రతిఘటించకుండా తాలిబన్లకు లొంగిపోయింది. దీంతో ఇంకా పేట్రేగిన తాలిబన్లు పంజ్ షీర్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు తాలిబన్లకు పంజ్ షీర్ భయం పట్టుకుంది. అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించిన తాలిబన్లు తమను సవాలు చేస్తున్న పంజ్‌షీర్ లోయ ఆక్రమణకు ప్రయత్నించారు.

Also Read: Kabul Evacuation: అఫ్గాన్ నుంచి ఇండియాకు చేరుకున్న 392 మంది.. వైరల్ అవుతోన్న చిన్నారి వీడియో

పంజ్ షీర్ సైన్యం ఆధీనంలో తాలిబన్ కమాండర్లు 

పంజ్ షీర్ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు యత్నించిన తాలిబన్లలో 300 మందిని స్థానిక సైన్యం మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. పంజ్‌షీర్‌ సైన్యం ప్రకటించినట్లుగా 300 మంది తాలిబన్లు మృతి చెందారని, వందల మంది తాలిబన్లు గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి. బాగ్లాన్‌, అంద్రాబ్ ప్రాంతాలు తిరిగి కైవసం చేసుకున్నట్లు పంజ్ షీర్ సైన్యం తెలిపింది. మరికొందరు తాలిబన్లు భారీ ఆయుధాలతో పంజ్‌షీర్ వైపు కదులుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పలువురు తాలిబన్ కమాండర్లు తమ ఆధీనంలో ఉన్నట్లు పంజ్ షీర్ సైన్యం చెబుతోంది. 

 

Also Read: Afghanistan Crisis News: తాలిబన్ల నెక్ట్స్ టార్గెట్ అదే.. పంజ్‌షిర్ వైపు వందలాదిగా తరలుతోన్న వైనం..

తాలిబన్లను ఢీకొట్టి...

తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదని పంజ్‌షీర్‌ ప్రజలు బలంగానే చెబుతున్నారు. పంజ్‌షీర్‌ లోయలోకి వెళ్లే అన్ని మార్గాల్లో ఎక్కడికక్కడ గట్టి భద్రత ఏర్పాటు చేసుకున్నారు. తాలిబన్లను ఢీకొట్టి ఎదురునిలిచిన పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తాలిబన్ల చెర నుంచి అఫ్గాన్‌ను విముక్తి చేసేది అహ్మద్‌ షా మసూద్‌‌ నాయకత్వంలోని పంజ్‌షీర్‌ సైన్యమే అని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు.

ఐదు సింహాల దేశం 

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందుకుష్​ పర్వత శ్రేణుల్లో ఉన్న ప్రాంతం పంజ్ షీర్. జనాభా లక్షన్నర వరకు ఉంటుంది. ఈ ప్రావిన్స్ తాలిబన్ల అరాచకానికి ఎదురొడ్డి నిలుస్తోంది. పంజ్ షీర్ సైన్యాన్ని ముందుండి నడిపిస్తుంది మిలటరీ కమాండర్​అహ్మద్​ షా మసూద్. ఆయన తనయుడు అహ్మద్​ మసూద్. పంజ్ షీర్ అంటే ఐదు సింహాలు అని అర్థం. నాలుగు గంటల్లో లొంగిపోవాలని తాలిబన్లు పంజ్ షీర్ ప్రజలకు అల్టిమేటం జారీ చేశారు. పంజ్​షీర్ ప్రజలు ఈ హెచ్చరికలు లెక్కచేయలేదు. తిరిగి యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. తాలిబన్లు దాడి చేయాలని చూస్తే వారికి భారీ నష్టం తప్పదని ముందుగానే హెచ్చరించారు.

Also Read: Afghanistan News: కాబుల్ నుంచి భారత్‌కు చేరిన మరో 146 మంది.. 8 రోజుల ఎదురుచూపులు.. ఓ బాధితుడు ఏమన్నాడంటే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
WhatsApp New Features: ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
WhatsApp New Features: ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
OG Update: 'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
World War III : మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Best Budget Cars: రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
Embed widget