అన్వేషించండి

Supreme Court : 31కల్లా ఈడీ డైరక్టర్ రాజీనామా చేయాల్సిందే - పదవి కాలం పొడిగింపును కొట్టేసిన సుప్రీంకోర్టు

ఈడీ డైరక్టర్ విషయంలో సుప్రీంకోర్టు కేంద్రానికి షాకిచ్చింది. పదవకాలం పొడిగింపు అక్రమమని స్పష్టం చేసింది.

Supreme Court  :    ఈడీ డైరెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడోసారి పొడిగించడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) డైరెక్టర్‌ పదవీకాలం పొడిగింపు అక్రమని స్పష్టం చేసిదంి.   ఈ మేరకు జస్టిస్‌ బీఆర్‌ గౌరవ్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సంజయ్‌  ‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం కేంద్ర ప్రభుత్వ  ఉత్తర్వును తోసిపుచ్చింది.  ఈ నెల 31న సంజయ్‌ కుమార్‌ మిశ్రా ఈడీ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేయాలని కోర్టు ఆదేశించింది. ఈలోగా ఈడీ నూతన డైరెక్టర్‌ నియమకాన్ని పూర్తి చేయాలని కేంద్రానికి సూచించింది. 

 ఈ నెల 31 వరకు  మాత్రమే సంజయ్ మిశ్రాకు ఈడీ డైరక్టర్ గా పదవీ కాలం                                    

సుప్రీంకోర్టు ఉత్తర్వుల కారణం సంజయ్‌ మిశ్రా ఈ నెల 31న తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడింది. లేదంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఈ ఏడాది నవంబర్‌ 18 వరకు సంజయ్‌ మిశ్రా ఈడీ డైరెక్టర్‌గా కొనసాగేవారు.   ఈ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మరో విషయాన్ని కూడా స్పష్టం చేసింది. సీబీఐ, ఈడీ డైరెక్టర్‌ల నిర్ణాయక రెండేళ్ల పదవీకాలం పూర్తయ్యాక మరో మూడేళ్లపాటు వారి పదవీకాలాలను పొడిగించేలా కేంద్ర ప్రభుత్వానికి అధికారాలను కట్టబెట్టిన చట్టాలకు సవరణలు జరిగిన విషయాన్ని సుప్రీంకరోర్టు గుర్తు చేసింది.

ఈడీ డైరక్టర్ ను మార్చవద్దని కోరిన కేంద్రం -   నెలాఖరు వరకే చాన్సిచ్చిన సుప్రీంకోర్టు                            

2021లో కోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించ‌డం దారుణ‌మ‌ని అభిప్రాయ‌ప‌డింది ధ‌ర్మాస‌నం. గ‌తంలో ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసినా ఎందుక‌ని కేంద్రం ప‌ట్టించు కోలేదంటూ నిల‌దీసింది. గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ఇక పొడిగించేందుకు ఒప్పుకోమ‌ని , కేవ‌లం జూలై 31 వ‌ర‌కు మాత్ర‌మే ప‌ర్మిష‌న్ ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ - ఎఫ్ఏటీఎఫ్ నిర్వహిస్తున్న పీర్ రివ్యూ మధ్యలో ఉన్నందున ఇలాంటి పరిస్థితుల్లో ఈడీ చీఫ్‌ను మార్చడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఈడీ చీఫ్‌గా సంజయ్ కుమార్ మిశ్రా జూలై 31 వరకు కొనసాగుతారని సుప్రీం కోర్టు తెలిపింది. అప్పటి వరకు ఆ పదవికి మరో వ్యక్తిని ఎంపిక చేయాలని కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం సూచించింది.

వరుస పొడిగిపులతోనే వివాదం 

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్‌గా సంజయ్ కుమార్ మిశ్రాను 2018 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే సంజయ్ కుమార్ మిశ్రా వయస్సు 2020 నవంబర్ నాటికి 60 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో ఆయన అప్పటికి పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈడీ చీఫ్‌గా సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని పొడగించింది. ఒక సారి కాదు మూడు సార్లు పొడిగించింది. దీంతో పలువరు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ola, Uberలకు టెన్షన్ టెన్షన్.. క్యాబ్ సేవల్ని ప్రారంభిస్తున్న VinFast.. కి.మీ.కు ఎంతంటే
Ola, Uberలకు టెన్షన్ టెన్షన్.. క్యాబ్ సేవల్ని ప్రారంభిస్తున్న VinFast.. కి.మీ.కు ఎంతంటే
Kunal Khemu Buys New Luxury Mercedes Benz G Class: బాలీవుడ్ యాక్టర్ కునాల్ ఖేము గ్యారేజ్ లోకి కొత్త లగ్జరీ ఈవీ: మెర్సిడెస్ బెంజ్ జి క్లాస్ ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు..
బాలీవుడ్ యాక్టర్ కునాల్ ఖేము గ్యారేజ్ లోకి కొత్త లగ్జరీ ఈవీ: మెర్సిడెస్ బెంజ్ జి క్లాస్ ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు..
Breaking News: తెలంగాణ ఏర్పాటైతే 11 రోజులు అన్నం తినని వెధవ పవన్ కళ్యాణ్: మంత్రి పొన్నం ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ ఏర్పాటైతే 11 రోజులు అన్నం తినని వెధవ పవన్ కళ్యాణ్: మంత్రి పొన్నం ఘాటు వ్యాఖ్యలు
Kavitha Politics: ఈసారి పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రకు పార్సిల్ చేస్తాం: కవిత వార్నింగ్
ఈసారి పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రకు పార్సిల్ చేస్తాం: కవిత వార్నింగ్

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
Nandus World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
Embed widget