అన్వేషించండి

Election Commissioners: కేంద్ర ఎన్నికల కమిషనర్లు నియామకం, ఇద్దరిని ఎంపిక చేసిన కమిటీ

Election Commissioners: ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ ఇద్దరు కేంద్ర ఎన్నికల కమిషనర్లను నియమించింది.

Election Commissioners: కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌భీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్‌లను నియమించారు. హైపవర్డ్ కమిటీ ఈ ఇద్దరినీ కమిషనర్లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కేరళకు చెందిన జ్ఞానేశ్ కుమార్‌, పంజాబ్‌కి చెందిన సుఖ్‌భీర్ సింగ్ సంధుని ఎంపిక చేసినట్టు అధిర్ రంజన్ చౌదరి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అరుణ్ గోయల్‌, అనూప్ చంద్ర పాండే రాజీనామాతో కమిషనర్ల పోస్ట్‌లు ఖాళీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషనర్ల నియామకానికి కేంద్రం ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ని నియమించింది. ఈ ప్యానెల్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధురి కూడా ఉన్నారు. ఆయనే అధికారికంగా ఈ కమిషనర్ల పేర్లని ప్రకటించారు. "కేరళకి చెందిన జ్ఞానేశ్ కుమార్‌, పంజాబ్‌కి చెందిన సుఖ్‌భీర్ సింగ్ సంధుని ఎన్నికల కమిషనర్లుగా నియమించాం" వెల్లడించారు. నిజానికి మార్చి 15వ తేదీన సాయంత్రం 6 గంటలకు సెలెక్షన్ కమిటీ సమావేశమవ్వాల్సి ఉంది. కానీ...ఈ భేటీని రీషెడ్యూల్ చేశారు. ఇవాళ (మార్చి 14) ప్రధాని నేతృత్వంలో సమావేశం జరిగింది. కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ఐదుగురి పేర్లని ప్రతిపాదించింది.  వీళ్లలో ఇద్దరి పేర్లని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. 

మరి కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకుచీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కి ఈ ఇద్దరు కమిషనర్లు పూర్తి స్థాయిలో సహకరించనున్నారు. అయితే...ఈ ప్రకటన చేసిన తరవాత అధిర్ రంజన్ చౌధురి మోదీ సర్కార్‌పై మండి పడ్డారు. సెలెక్షన్ కమిటీ నుంచి చీఫ్ జస్టిస్‌ని తొలగించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆయన స్థానంలో కేంద్రమంత్రిని తీసుకోవడంపై విమర్శలు గుప్పించారు. సెలక్షన్ కమిటీ CJI ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. కమిటీలో ఎక్కువగా అధికార పార్టీకి చెందిన వాళ్లే ఉన్నారని, వాళ్లు అనుకున్నదే చెల్లుతుందని అన్నారు. సుఖ్‌భీర్ సింగ్ సంధు గతంలో ఉత్తరాఖండ్ చీఫ్‌సెక్రటరీగా పని చేశారు. NHAIకి ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. జ్ఞానేశ్ కుమార్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సెక్రటరీగా పని చేశారు. 

"ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం మా  పార్టీ తరపున 212 పేర్లను ప్రతిపాదించాం. ఈ లిస్ట్‌ని షార్ట్‌లిస్ట్‌ చేయాలని అడిగారు. కానీ ఆ అవకాశం ఇవ్వనేలేదు. నిన్న రాత్రికి ఢిల్లీకి వచ్చాను. ఇవాళ మధ్యాహ్నం మీటింగ్ పెట్టారు. ఒక్కరోజులో అంత మంది పేర్లని పరిశీలించి ఎలా ఎంపిక చేయగలను. మీటింగ్‌కి సరిగ్గా పది నిముషాల ముందు ఆరుగురు పేర్లని ఇచ్చారు. అందులో ఇద్దరిని ఎంపిక చేయమన్నారు. అది ఎలా కుదురుతుంది"

- అధిర్ రంజన్ చౌధురి, కాంగ్రెస్ సీనియర్ నేత 

Also Read: 23 జాతుల కుక్కలపై నిషేధం, వీటిని అమ్మడం పెంచడం కుదరదు - కేంద్రం కీలక ప్రకటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Jio Monthly Prepaid Plans: జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Jio Monthly Prepaid Plans: జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Embed widget