అన్వేషించండి

Polavaram Stop Work : పోలవరం పనులకు "స్టాప్ వర్క్ ఆర్డర్‌" టెన్షన్..!

పోలవరం పనులపై ఎన్జీటీ ఇచ్చిన"స్టాప్ వర్క్ ఆర్డర్‌" పై స్టే పొడిగించునేందుకు ఏపీ ప్రభుత్వం ఆసక్తి చూపించలేదు. దీంతో పనులు నిలిపివేయాలని ఒరిస్సా అధికారులు కోరుతున్నారు.


పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి "స్టాప్ వర్క్ ఆర్డర్స్‌"పై ఉన్న స్టేను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించుకోలేదు. దీంతో ఈ ఆదేశాలు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అంటే పోలవరం ప్రాజక్టు పనులను ఎక్కడివక్కడ ఆపేయాలన్న మాట. 2015 చివరిలో పోలవరం పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌  "స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌" ఇచ్చింది. దీనిపై కేంద్ర పర్యావరణ శాఖ ప్రత్యేక అనుమతితో ప్రభుత్వం పనులు చేస్తోంది.  తమ రాష్ట్రాల్లోని ముంపు ప్రాంతాల్లో సరిగ్గా ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదంటూ ఒరిస్సాతో పాటు ఛత్తీ‌స్‌గఢ్‌ ప్రభుత్వాలు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ లో పిటిషన్ వేశాయి. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ 2015 చివరిలో స్టాప్ వర్క్ ఆర్డర్ ఆదేశాలిచ్చింది. 

Also Read : మోసం కేసులోవిశాఖ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వడం పనులు ప్రారంభించి ఉండటంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనాటి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిగా ఉన్న ప్రకాశ్‌ జవదేకర్‌తో మాట్లాడారు. ఆ ఆదేశాలపై 2016లో ఆయన స్టే ఉత్తర్వులిచ్చారు. వాటిని ఏడాదికోసారి ప్రభుత్వం పొడిగించుకుంటూ వస్తోంది. ఈ ఆర్డర్‌ నుంచి వెసులుబాటు కల్పిస్తూ పనులు నిరభ్యంతరంగా కొనసాగించుకోవడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన గడువు ఈ ఏడాది జూలైతోనే ముగిసింది. ఈ వెసులుబాటును పునరుద్ధరించుకోవడానికి రాష్ట్ర సర్కారు ప్రయత్నాలు చేయకపోవడంతో.. ఇప్పుడు స్టాప్‌ వర్క్‌ను అమలు చేసేందుకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సిద్ధమైంది. ప్రాజెక్టు పనులపై నిషేధం ఉన్నందున.. వాటిని తక్షణమే నిలిపివేయాల్సిందిగా రాష్ట్రాన్ని ఆదేశించాలని నిర్ణయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. చివరిగా ఇచ్చిన స్టే ఆర్డర్ 2019 జూలైలో ఇచ్చారు. రెండేళ్ల గడువు స్టే ముగిసిపోయింది.  

Also Read : విశాఖలో వంద కోట్ల భూమిపై ఎమ్మెల్యే కుమారుడి కన్ను !

రెండు తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులు నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి వచ్చాయి.  అక్టోబరు 14 నుంచి గెజిట్ అమలు కానుంది. ఈ సందర్భంగా కేంద్ర అధికారులు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఒరిస్సా అధికారులు పోలవరం ప్రాజెక్టు పనులపై స్టాప్‌వర్క్‌ ఆదేశాలు అమల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.  పనుల కొనసాగింపు ఆదేశాలకు కాలం చెల్లినా నిర్మాణ పనులు యథావిధిగా ఎలా కొనసాగిస్తారని అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పనులు నిలిపివేయాలంటూ ఒరిస్సా ప్రభుత్వం చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ కేంద్రంతో సఖ్యతగా వ్యవహరిస్తున్నారు.  

Also Read : వైసీపీ కీలక నేతను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన ఒరిస్సా పోలీసులు

ప్రభుత్వం అధికారికంగా స్టాప్ వర్క్ ఆర్డర్‌పై స్టేను పొడిగించుకోకపోతే పనులు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక వేళ చేపట్టినా అది ఎన్జీటీ ఉత్తర్వుల ఉల్లంఘన అవుతుందన్న అభిప్రాయ ఉంది. వర్షాకాలం ప్రారంభం కావడం.. పోలవరం చుట్టూ పెద్ద ఎత్తున వరద చేరడంతో పనులేమీ పెద్దగా సాగడం లేదు. మళ్లీ పనులు ప్రారంభమయ్యే సరికి ఈ స్టాప్ వర్క్‌ ఆర్డర్‌పై స్టే తెస్తే సరిపోతుందని ఏపీ అధికారుల భావిస్తున్నారు. 

Also Read : పంజరం నుంచి సీబీఐకి విముక్తి ఎప్పుడు ?

టాప్ హెడ్ లైన్స్

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నమన్న వైసీపీ నేత
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నమన్న వైసీపీ నేత
Atchannaidu: జలధార జలహారతితో 79,826 పనులు పూర్తి.. భూగర్భ జలాలు 0.79 మీటర్లు పెరుగుదల: అచ్చెన్నాయుడు
జలధార జలహారతితో 79,826 పనులు పూర్తి.. భూగర్భ జలాలు 0.79 మీటర్లు పెరుగుదల: అచ్చెన్నాయుడు
MLA Danam Nagender Disqualification: ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. హైకోర్టు సంచలన తీర్పు
ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. హైకోర్టు సంచలన తీర్పు
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
TMC New Name And Logo: టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
The India Story OTT : ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
రూ.10 లక్షల లోపు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌.. బలెనో, i20లో మీకు ఏది సరిపోతుందంటే?
బలెనో vs i20.. టాప్‌ వేరియంట్లలో ఏ కారు ఎక్కువ ఫీచర్లు ఇస్తుందో తెలుసా?
Embed widget