అన్వేషించండి

Salman Rushdie: ఎవరీ సల్మాన్ రష్దీ? ఆయన రాసిన బుక్‌ ఎందుకు వివాదాస్పదమైంది?

Salman Rushdie Profile: ముంబయిలో పుట్టి పెరిగిన సల్మాన్ రష్దీ ఇంగ్లాడ్‌కు వెళ్లి స్థిరపడ్డారు. 5 దశాబ్దాలుగా రచనా ప్రయాణం కొనసాగిస్తున్నారు.

 Who is Salman Rushdie: 

బుకర్ ప్రైజ్‌ పొందిన రచయిత

భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి జరగటం భారత్‌నే కాదు. అమెరికానూ షాక్‌కు గురి చేసింది. మెడకు తీవ్ర గాయాలయ్యాయని, ఆయన మాట్లాడలేకపోతున్నారని ఇప్పటికే వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయనను వెంటిలేటర్‌పై ఉంచారు. దాదాపు 5 దశాబ్దాలుగా సాహిత్య రంగంలో ప్రయాణం చేస్తున్న సల్మాన్ రష్దీకి ఎన్నో సార్లు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఆయన రచనా శైలే అందుకు కారణం. ఆయన తీసుకునే సబ్జెక్ట్‌లూ అంత వివాదాస్పదంగా ఉంటాయి. భారత సంతతికి చెందిన ఈ బ్రిటీష్ రచయిత రాసిన రెండో నవల సంచలనం సృష్టించింది. "Midnight's Children"నవలకు 1981లో బుకర్ ప్రైజ్‌ కూడా లభించింది. అయితే..ఆయన రచించిన నాలుగో నవల...పూర్తిగా వివాదాల్లోకి లాగింది. అప్పటి నుంచి ఆయనకు శత్రువులు తయారయ్యారు. అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ నవల పేరు "The Satanic Verses".ఈ బుక్‌ను పబ్లిష్ చేసినప్పటి నుంచి ముస్లింల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు సల్మాన్ రష్దీ. ఈ పుస్తకం ముస్లింల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందని తీవ్రంగా మాటల దాడికి దిగారు కొందరు. ఈ నవలలో మహమ్మద్ ప్రవక్తను అవమానించారంటూ పెద్ద దుమారమే రేగింది. చాలా చోట్ల రక్తపాతం జరిగింది. చంపేస్తామంటూ కొందరు ఆయనను బెదిరించారు. చాన్నాళ్ల పాటు ఎవరి కంట కనబడకుండా కాలం గడిపిన సల్మాన్ రష్దీకి బ్రిటీష్ ప్రభుత్వం రక్షణ కల్పించింది. ముస్లిం దేశమైన ఇరాన్... యూకేతో సంబంధాలు తెంచుకుంది. 1989లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా రుహొల్లా కోమినేని..సల్మాన్‌పై ఫత్వా జారీ చేశారు. అయితే పశ్చిమ దేశాల్లోని రచయితలు..సల్మాన్‌కు అండగా నిలిచాయి. ఆయనకు భావప్రకటనా స్వేచ్ఛ లేదా..? అని ప్రశ్నించాయి. 

ఇస్లాం చరిత్రను వక్రీకరించారనే..?

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చే రెండు రోజుల ముందు ముంబయిలో జన్మించారు సల్మాన్ రష్దీ. 14 ఏళ్ల వయసులోనే ఇంగ్లాండ్‌కు వెళ్లారు. బ్రిటీష్ పౌరసత్వం పొందారు. క్రమక్రమంగా ఇస్లాం మతంపై నమ్మకం కోల్పోయారు. రచయితగానే కాకుండా నటనలోనూ ప్రతిభ కనబరిచారు. తరవాత పూర్తి స్థాయిలో రచయితగానే స్థిరపడ్డారు. ఆయన రాసిన సానాటిక్ వెర్సెస్ నవల వివాదాస్పదం అవటం వల్ల వెంటనే భారత్‌ ఆ పుస్తకాన్ని నిషేధించింది. ఈ బుక్‌ను బ్యాన్‌ చేసిన మొట్టమొదటి దేశం భారత్. ఆ తరవాత పాకిస్థాన్ సహా మరి కొన్ని ముస్లిం దేశాలు ఇదే నిర్ణయం తీసుకున్నాయి. నిజానికి ఈ నవలకు "విట్‌బ్రెడ్" పురస్కారం లభించింది. అయితే ముస్లింలు ఈ పుస్తకంలోని కొన్ని అంశాలపై ముస్లింలు తీవ్రంగా స్పందించారు. ఇస్లాం చరిత్రలో "వ్యభిచారం" చేసే ఇద్దరు మహిళలను...మహమ్మద్ ప్రవక్త భార్యలుగా ఈ నవలలో ప్రస్తావించటం పట్ల ఆ వర్గం భగ్గుమంది. అంతే కాదు. టైటిల్‌లో "వెర్సెస్" అనే పదంపైనా దుమారం రేగింది. ఖురాన్‌ నుంచి మహమ్మద్ ప్రవక్త ఈ పదాన్ని తొలగించారని, అది చెడుకు సంకేతమని ముస్లింలు వాదించారు. అయితే సల్మాన్ రష్దీ మాత్రం ఇది "దైవదూషణ" కాదు అని తేల్చి చెప్పారు. అయినా...అగ్ని చల్లారలేదు. సల్మాన్ సొంత ఊరైన ముంబయిలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. 12 మంది మృతి చెందారు. సల్మాన్ రష్దీ తలపై 3 మిలియన్ డాలర్ల నజరానా ప్రకటించారు. అమెరికా, ఫ్రాన్స్ సహా పలు పశ్చిమ దేశాలు దీన్ని తీవ్రంగా ఖండించాయి. యూకేలో కొందరు ముస్లిం లీడర్లను సపోర్ట్ చేయగా..మరికొందరు సల్మాన్‌కి మద్దతుగా నిలబడ్డారు. 

డెత్ వారెంట్ వాపస్..

సల్మాన్‌ రష్దీకి మాత్రమే కాదు. ఈ నవలను అనువదించిన ఇతర భాషల్లోని రచయితలూ ఇలాంచి దాడులే ఎదుర్కొన్నారు. జపనీస్ ట్రాన్స్‌లేటర్‌ను 1991లో టోక్యోలో అతి దారుణంగా హత్య చేశారు. ఇటలీలో ట్రాన్స్‌లేట్ చేసిన రచయితపైనా కత్తులతో దాడి చేయగా..బతికి బయటపడ్డారు. ఇప్పుడు సల్మాన్‌ రష్దీ టార్గెట్ అయ్యారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న సల్మాన్‌కు..ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతానికి ఆయన అమెరికాలో ఉంటున్నారు. 1998లో ఇరాన్ ప్రభుత్వం డెత్ వారెంట్‌ను వెనక్కి తీసుకుంది. ఈ మధ్య కాలంలో కాస్త బయటకు వస్తూ యాక్టివ్‌గా కనిపిస్తున్న ఆయనపై ఉన్నట్టుండి ఈ దాడి జరగటం...సంచలనమైంది. 

Also Read: Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Also Read: Independence Day 2022: ఆగస్టు 15, జనవరి 26న జెండా ఆవిష్కరణలో ఇంత తేడా ఉందా!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Suriya 46 Movie : ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
Cheapest Automatic Cars India: ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం

వీడియోలు

World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్
India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Suriya 46 Movie : ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
Cheapest Automatic Cars India: ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Cinnamon Water : 2026లో బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే దాల్చినచెక్క నీరు తాగేయండి
2026లో బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే దాల్చినచెక్క నీరు తాగేయండి
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Embed widget