అన్వేషించండి

RSS Pracharak: పీఓకే కచ్చితంగా భారత్‌దే, మానససరోవరం కూడా దక్కాల్సిందే - ఆర్‌ఎస్‌ఎస్ నేత వ్యాఖ్యలు

RSS Pracharak: పాక్ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌కు దక్కాల్సిందేనని ఆర్ఎస్‌ఎస్‌ నేత ఇంద్రేష్ కుమార్ అన్నారు.

RSS Pracharak Indresh Kumar:

అవి భారత్‌లో విలీనం కావాలి: ఇంద్రేష్ కుమార్

ఆర్ఎస్‌ఎస్ నేత ఇంద్రేష్ కుమార్ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. జమ్ము పర్యటనకు వెళ్లిన ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌ సిన్హాతో భేటీ అయ్యారు. జమ్ము కశ్మీర్‌లోని హెల్త్ సర్వీసెస్‌ గురించి మాట్లాడిన ఆయన పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో కైలాశ్ మానససరోవరం ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. "కైలాశ్ మానససరోవర్‌ భారత్‌ సొంతం. అది కచ్చితంగా భారత్‌కు చెందాల్సిందే. భారత్ కోరుకునేది కూడా ఇదే" అని వెల్లడించారు. చైనాపై కూడా విమర్శలు చేశారు. "కొవిడ్ అనే వైరస్‌ను చైనా తయారు చేసింది. లక్షలాది మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. భారత్ మాత్రం అందరికీ రక్షణ కవచంలా నిలిచింది. చైనాకు అతి పెద్ద సవాలు ఏదైనా ఉందంటే..అది భారత్ మాత్రమే" అని స్పష్టం చేశారు. చైనాతో పాటు పాకిస్థాన్‌నూ టార్గెట్ చేశారు ఇంద్రేష్ కుమార్. "75 ఏళ్లలో పాకిస్థాన్‌లో కనీసం వారం రోజులు కూడా ప్రశాంతమైన వాతావరణం కనిపించలేదు. ప్రజలందరికీ చెప్పేది ఒకటే. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌, కైలాశ్ మానససరోవరం భారత్‌కు చెందాలని దేవుడిని ప్రార్థించండి. ఇవి భారత్‌లో విలీనం అవ్వాలని కోరుకోండి" అని సూచించారు. ఈ సందర్భంగా...కశ్మీరీ పండిట్‌ల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. కశ్మీరీ నేతలు పండిట్‌ల హత్యపై నోరు మెదపటం లేదెందుకు అని ప్రశ్నించారు. వారికి పునరావాసం కల్పించే విషయాన్నీ ఎప్పుడూ చర్చించరని విమర్శించారు. పాకిస్థాన్‌లో మైనార్టీలపై దాడులు, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. హిందువులు, సిక్కులపైనే కాకుండా ఇతర మతాలకు చెందిన వారికీ ఈ వేధింపులు తప్పడం లేదని అసహనం వ్యక్తం చేశారు. 

రాజ్‌నాథ్ సింగ్ కామెంట్స్..

ఇటీవల కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హిమాచల్‌ప్రదేశ్‌లో ఓ సభలో పాల్గొన్నారు. భాజపా అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా కొంత మంది "మాకు POK కావాలి" అని నినదించారు. ఇది విన్న వెంటనే రాజ్‌నాథ్ సింగ్ నవ్వారు. "కాస్త ఓపిక పట్టండి" అని సమాధానమిచ్చారు. గిల్గిట్, బాల్టిస్థాన్‌లోనూ అభివృద్ధి సాధించిన తరవాతే POKను సొంతం చేసుకోవటంపై ఆలోచన చేస్తామని చెప్పకనే చెప్పారు. కానీ..నేరుగా దీనిపై ఎలాంటి బదులు ఇవ్వలేదు. జమ్ము, కశ్మీర్‌లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి మొదలైందని గుర్తు చేశారు. పీఓకేలోని ప్రజల కష్టాలు చూసి తామూ చలించిపోతున్నామని అన్న రాజ్‌నాథ్ సింగ్...ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యం భారత్ మాత్రమేనని వెల్లడించారు. 

Also Read: Pakistan Army: ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్థాన్‌ ఆర్మీ సీరియస్, కఠిన చర్యలు తప్పవా?

 

టాప్ హెడ్ లైన్స్

Team India T20 World Cup Disaster: హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి ఎండ్ కార్డ్..! టీమిండియా ఘోర పరాజయంపై సెలెక్టర్ల సీరియస్ యాక్షన్, ఉమెన్స్ క్రికెట్ లో మేజర్ రీసెట్ స్టార్ట్!!
హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి ఎండ్ కార్డ్..! టీమిండియా ఘోర పరాజయంపై సెలెక్టర్ల సీరియస్ యాక్షన్, ఉమెన్స్ క్రికెట్ లో మేజర్ రీసెట్ స్టార్ట్!!
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
ABP Desam Top 10, 29 June 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 29 June 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget