అన్వేషించండి

RSS Pracharak: పీఓకే కచ్చితంగా భారత్‌దే, మానససరోవరం కూడా దక్కాల్సిందే - ఆర్‌ఎస్‌ఎస్ నేత వ్యాఖ్యలు

RSS Pracharak: పాక్ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌కు దక్కాల్సిందేనని ఆర్ఎస్‌ఎస్‌ నేత ఇంద్రేష్ కుమార్ అన్నారు.

RSS Pracharak Indresh Kumar:

అవి భారత్‌లో విలీనం కావాలి: ఇంద్రేష్ కుమార్

ఆర్ఎస్‌ఎస్ నేత ఇంద్రేష్ కుమార్ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. జమ్ము పర్యటనకు వెళ్లిన ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌ సిన్హాతో భేటీ అయ్యారు. జమ్ము కశ్మీర్‌లోని హెల్త్ సర్వీసెస్‌ గురించి మాట్లాడిన ఆయన పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో కైలాశ్ మానససరోవరం ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. "కైలాశ్ మానససరోవర్‌ భారత్‌ సొంతం. అది కచ్చితంగా భారత్‌కు చెందాల్సిందే. భారత్ కోరుకునేది కూడా ఇదే" అని వెల్లడించారు. చైనాపై కూడా విమర్శలు చేశారు. "కొవిడ్ అనే వైరస్‌ను చైనా తయారు చేసింది. లక్షలాది మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. భారత్ మాత్రం అందరికీ రక్షణ కవచంలా నిలిచింది. చైనాకు అతి పెద్ద సవాలు ఏదైనా ఉందంటే..అది భారత్ మాత్రమే" అని స్పష్టం చేశారు. చైనాతో పాటు పాకిస్థాన్‌నూ టార్గెట్ చేశారు ఇంద్రేష్ కుమార్. "75 ఏళ్లలో పాకిస్థాన్‌లో కనీసం వారం రోజులు కూడా ప్రశాంతమైన వాతావరణం కనిపించలేదు. ప్రజలందరికీ చెప్పేది ఒకటే. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌, కైలాశ్ మానససరోవరం భారత్‌కు చెందాలని దేవుడిని ప్రార్థించండి. ఇవి భారత్‌లో విలీనం అవ్వాలని కోరుకోండి" అని సూచించారు. ఈ సందర్భంగా...కశ్మీరీ పండిట్‌ల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. కశ్మీరీ నేతలు పండిట్‌ల హత్యపై నోరు మెదపటం లేదెందుకు అని ప్రశ్నించారు. వారికి పునరావాసం కల్పించే విషయాన్నీ ఎప్పుడూ చర్చించరని విమర్శించారు. పాకిస్థాన్‌లో మైనార్టీలపై దాడులు, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. హిందువులు, సిక్కులపైనే కాకుండా ఇతర మతాలకు చెందిన వారికీ ఈ వేధింపులు తప్పడం లేదని అసహనం వ్యక్తం చేశారు. 

రాజ్‌నాథ్ సింగ్ కామెంట్స్..

ఇటీవల కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హిమాచల్‌ప్రదేశ్‌లో ఓ సభలో పాల్గొన్నారు. భాజపా అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా కొంత మంది "మాకు POK కావాలి" అని నినదించారు. ఇది విన్న వెంటనే రాజ్‌నాథ్ సింగ్ నవ్వారు. "కాస్త ఓపిక పట్టండి" అని సమాధానమిచ్చారు. గిల్గిట్, బాల్టిస్థాన్‌లోనూ అభివృద్ధి సాధించిన తరవాతే POKను సొంతం చేసుకోవటంపై ఆలోచన చేస్తామని చెప్పకనే చెప్పారు. కానీ..నేరుగా దీనిపై ఎలాంటి బదులు ఇవ్వలేదు. జమ్ము, కశ్మీర్‌లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి మొదలైందని గుర్తు చేశారు. పీఓకేలోని ప్రజల కష్టాలు చూసి తామూ చలించిపోతున్నామని అన్న రాజ్‌నాథ్ సింగ్...ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యం భారత్ మాత్రమేనని వెల్లడించారు. 

Also Read: Pakistan Army: ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్థాన్‌ ఆర్మీ సీరియస్, కఠిన చర్యలు తప్పవా?

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bollywood Actress: ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bollywood Actress: ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
KCR Vs Revanth: రేవంత్ అసెంబ్లీ సవాల్ - కేసీఆర్‌ వెళ్తారా?
రేవంత్ అసెంబ్లీ సవాల్ - కేసీఆర్‌ వెళ్తారా?
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 మూవీస్... డ్యూడ్, కొన్ని వారాలుగా ట్రెండింగ్ ఫిల్మ్స్‌ లిస్ట్ ఇదుగో
నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 మూవీస్... డ్యూడ్, కొన్ని వారాలుగా ట్రెండింగ్ ఫిల్మ్స్‌ లిస్ట్ ఇదుగో
Telangana Assembly Sessions: ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్
ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
Embed widget