By: Ram Manohar | Updated at : 28 Jul 2023 12:55 PM (IST)
అమెరికాలో బియ్యానికి ఫుల్ డిమాండ్ పెరగడం వల్ల వ్యాపారుల గల్లాపెట్టె నిండిపోతోంది. (Image Credits: Twitter)
Rice Shortage in US:
బ్యాన్ ఎఫెక్ట్..
నాన్ బాస్మతీ రైస్ ఎగుమతిపై ఇండియా బ్యాన్ విధించిన వెంటనే ఆ ఎఫెక్ట్ అమెరికాలో గట్టిగా కనిపిస్తోంది. రేషన్ షాప్లలో సరుకుల కోసం క్యూలు కట్టినట్టు అన్ని సూపర్ మార్కెట్ల బయట పెద్ద పెద్ద లైన్లు కనిపిస్తున్నాయి. కొన్ని స్టోర్లలో అయితే ఎగబడి మరీ బియ్యం బస్తాలు లాగేసుకుంటున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండియా బ్యాన్ విధించడం ఏమో కానీ...ప్రస్తుతం అమెరికాలో బియ్యం వ్యాపారం మాత్రం కళకళలాడిపోతోంది. ఆ బిజినెస్ చేసే వాళ్ల గల్లా పెట్టె నిండిపోతోంది. వారం రోజుల క్రితం భారత్ ఈ నిర్ణయం తీసుకోగా...అప్పటి నుంచి డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఒక్క అమెరికాలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ మార్కెట్ని కుదిపేసింది ఈ నిర్ణయం. వాషింగ్టన్లో అయితే...సూపర్ మార్కెట్లలో ఇసకేస్తే రాలనంత జనం ఉంటున్నారు. "ఒక రైస్ బ్యాగ్ దొరికినా చాలు" అని గంటల తరబడి అక్కడే నిలబడుతున్నారు. "ఉదయం 10 గంటల నుంచి అన్ని వీధులు తిరుగుతున్నాం. సాయంత్రం 4 గంటలకు ఓ చోట ఒకే ఒక్క రైస్ బ్యాగ్ దొరికింది" అని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. అక్కడ ఉండే NRIలకూ తిప్పలు తప్పడం లేదు.
This is not a third world country!
These pics are from #USA !
India has declared a total ban on #Rice exports due to #RussiaUkraineWar !
Resulting in severe shortage and food scares in #US resulting in huge queues & people fighting over rice bags!!
India is the largest… pic.twitter.com/GOmUfknWJn— AadhiraSpeaks 📍Bharat (@AadhiRaSpeaks) July 28, 2023
ముందు గోధుమలు..ఇప్పుడు బియ్యం..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గోధుమల ఎగుమతులు తగ్గిపోయాయి. ఇప్పటికే అమెరికాలో వీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయంతో బియ్యానికీ దిక్కు లేకుండా పోయింది. దేశీయంగా ధరలు తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడి పౌరులకు అందుబాటు ధరలోనే బియ్యం అందాలన్న ఉద్దేశంతో ఉన్నట్టుండి ఎగుమతులను ఆపేసింది. ప్రీమియం గ్రేడ్ బాస్మతీ రైస్ ఎగుమతులపై ఎలాంటి బ్యాన్ లేకపోయినా...ముందుగానే వాటినీ పెద్ద మొత్తంలో కొనుక్కుంటున్నారు అమెరికన్లు. ఇప్పటికే ధరలు రెట్టింపయ్యాయి. మరి కొన్ని రోజులు గడిస్తే ఇవి మూడింతలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే...ఎక్కువ మొత్తంలో స్టాక్ పెట్టుకునేందుకు స్టోర్లలో ఇలా పడిగాపులు కాస్తున్నారు అక్కడి ప్రజలు. చాలా దేశాల్లో బియ్యం కొరత వల్ల బియ్యం ఎగుమతులపై విధించిన నిషేధాన్ని తొలగించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారత్ ను కోరింది. ఈ కొరత వల్ల ప్రపంచ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని, ఈ నేపథ్యంలో నిర్దిష్ట రకం బియ్యం ఎగుమతిపై పరిమితిని తొలగించాలని విజ్ఞప్తి చేసింది.
Rice bag NRIs standing in line to collect rice in the US,just like how they stand in front of a ration shop.pic.twitter.com/L0YqEwqrsa
— Брат (@B5001001101) July 25, 2023
Also Read: కుతకుత ఉడికిపోతున్న భూమి, జులైలో పాత రికార్డులన్నీ బద్దలు - గ్లోబల్ బాయిలింగ్ మొదలైందా?
ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్ - సరిహద్దుల్లో భారీ భద్రత
YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి, కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్
బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు
SSC Exams: పదోతరగతి పరీక్షల్లో 'కాంపోజిట్' పేపర్ కొనసాగింపు, రద్దుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం
Breaking News Live Telugu Updates: హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్లు వేసిన లోకేష్- ఫైబర్ గ్రిడ్, స్కిల్డెవలప్మెంట్ కేసుల్లో బెయిల్కు ప్రయత్నాలు
Skanda Day 1 Collection: బాక్సాఫీస్ దగ్గర ‘స్కంద‘ ధూంధాం, రామ్ పోతినేని కెరీర్లో అత్యధిక ఓపెనింగ్!
Vivek Ramaswamy: అక్రమ వలసదారుల పిల్లల పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తున్నా:వివేక్ రామస్వామి
పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన
Ritika Singh: ఆ ఘటన చూసి గుండె మండింది, ఇబ్బంది అనిపించినా అమ్మాయిలకు వాటిని నేర్పించాల్సిందే
/body>