అన్వేషించండి

C-295 MW: భారత వాయుసేనలోకి సీ-295 ఎండబ్ల్యూ తొలి విమానం

C-295 MW:భారత వాయుసేనలోకి సీ-295 ఎండబ్ల్యూ రవాణా విమానాన్ని సోమవారం భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధికారికంగా ప్రవేశపెట్టారు.

భారత వాయుసేనలోకి సీ-295 ఎండబ్ల్యూ రవాణా విమానాన్ని సోమవారం భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధికారికంగా ప్రవేశపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో హిండన్‌ ఎయిర్‌బేస్‌లో జరుగుతున్న భారత్‌ డ్రోన్‌ శక్తి-2023 కార్యక్రమంలో  పాల్గొన్న రాజ్‌నాథ్‌ ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను వాయుసేనలో చేర్చారు. ఐఏఎఫ్‌ చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరితో కలిసి రాజ్‌నాథ్‌ సింగ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఈవెంట్‌లో భాగంగా వీరు 5కేజీల నుంచి 100 కేజీల పేలోడ్‌ను తీసుకెళ్లగలిగే డ్రోన్ల ప్రదర్శనను తిలకించారు. ప్రపంచవ్యాప్తంగా సీ-295కు మంచి పేరు ఉంది. ఇది బరువు, మిషన్‌ క్లాస్‌లో సాటిలేని విమానం. దీని కోసం 39 ఆపరేటర్ల నుంచి 280 దాకా ఆర్డర్లు వచ్చాయని తయారీ సంస్థ వెల్లడించింది. 

కొత్తగా వాయుసేనలో ప్రవేశపెట్టిన సీ-295 ఎండబ్ల్యూ రవాణా విమానం భారత వాయుసేనకు ఎయిర్‌లిఫ్ట్‌ సామర్థ్యాన్ని ఎంతగానో పెంచుతుంది. ఇది ప్రస్తుతం ఉన్న హెచ్‌ఎస్‌-748 అవ్రో ఎయిర్‌ క్రాఫ్ట్‌ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది కఠినమైన ప్రదేశాలు, రన్‌వేలు సరిగ్గా లేని చోట కూడా ల్యాండింగ్‌ కాలగదు. డ్రోన్‌ శక్తి కార్యక్రమంలో పాల్గొన్న స్పెయిన్‌ రాయబారి రిడావో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో స్పెయిన్‌ నుంచి వచ్చిన తొలి విమానం ఇదే అని, తాము చాలా సంతోషంగా ఉన్నామని, భారత్‌కు ముఖ్యమైన భాగస్వామిగా మారేందుకు తమకు ఇది మంచి అవకాశమని ఆయన తెలిపారు.  

సీ-295 విమానాలను స్పానిష్‌ ఎయిరోస్పేస్‌ కంపెనీ సీఏఎస్‌ఏ ఎయిర్‌ బస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ సంస్థ నుంచి భారత్‌ తెప్పించుకుంటోంది. ఇలాంటివి మొత్తం 56 విమానాలు కొనుగోలు చేసేందుకు ఈ సంస్థతో సుమారు రూ.22వేల కోట్లతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 16 విమానాలను 2025 నాటికి భారత్‌కు సరఫరా చేస్తుంది.  మొదటి విమానం ఈ సెప్టెంబరు 20న భారత్‌కు చేరుకోగా సోమవారం అధికారికంగా వాయుసేనకు అప్పగించారు. మిగిలిన విమానాలను టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌తో కలిసి దేశీయంగా తయారు చేయనున్నారు. దీనికి సంబంధించి విడిభాగాలను హైదరాబాద్‌లోని ఎంసీఏ కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే గత ఏడాది అక్టోబరులో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాల తయారీ కేంద్రానికి వడోదరలో శంకుస్థాపన చేశారు. సీ-295 విమానం 5 నుంచి 10 టన్నుల బరువును మోసుకెళ్ల గలదు. అలాగే 71 మంది సైనికులు లేదా 50 మంది పారాట్రూపర్లను కావాల్సిన ప్రాంతాలకు తరలించగలదు. 

డ్రోన్‌ శక్తి కార్యక్రమంలో వివిధ రకాల డ్రోన్లను ప్రదర్శించారు. సర్వే డ్రోన్లు, అగ్రికల్చర్‌ డ్రోన్స్‌, అగ్నిమాపక డ్రోన్లు, టాక్టికల్‌ సర్వైలెన్స్‌ డ్రోన్లు, ఎక్కువ బరువు ఎత్తగలిగే లాజిస్టిక్‌ డ్రోన్లను ఇంకా ఎన్నో రకాలైన డ్రోన్లను ప్రదర్శించారు. ఐఏఎఫ్‌ ఇప్పడు స్వదేశీ డ్రోన్‌ రూపకల్పన, అభివృద్ధి సామర్థ్యాన్ని గుర్తిస్తోంది. ఇటీవల కాలంలో డ్రోన్‌ టెక్నాలజీ కారణంగా పౌర రక్షణను వేగంగా మార్పు తీసుకురావడం సాధ్యమైంది. వీటి వల్ల మెరుగైన సామర్థ్యం ఉండడంతో పాటు రిస్క్‌ ఎక్స్‌పోజర్‌ను చాలా తగ్గించింది. ఇంటలిజెన్స్‌, నిఘా కార్యకలాపాల కోసం రిమోట్‌లీ పైలెటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ప్రయోగించడంలో భారత వాయుసేనకు మంచి అనుభవం ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget