By: Ram Manohar | Updated at : 16 Mar 2023 04:49 PM (IST)
మాట్లాడే హక్కుని ప్రజాస్వామ్యం కల్పించిందని, అదానీ అంశం ప్రధానిని భయపెడుతోందని రాహుల్ అన్నారు. (Image Credits: Twitter)
Rahul Gandhi on Modi:
అదాని, ప్రధాని మధ్య రిలేషన్ ఏంటి: రాహుల్ గాంధీ
బ్రిటన్ పర్యటనలో రాహుల్ గాంధీ భారత్పై, మోదీ సర్కార్పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. భారత్ను కించపరిచారంటూ బీజేపీ తీవ్రంగా మండి పడుతోంది. ఇటీవలే ఆ పర్యటన ముగించి వచ్చిన రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. తనపై బీజేపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. మోదీ హయాంలో నిజంగా ప్రజాస్వామ్యమనేదే ఉంటే...కచ్చితంగా తనకు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం వచ్చి ఉండేదని సెటైర్లు వేశారు. ఇదే సమయంలో గౌతమ్ అదాని, ప్రధాని మధ్య రిలేషన్ ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తాను పార్లమెంట్లోకి వచ్చిన మరు నిముషమే సభను వాయిదా వేస్తారని విమర్శించారు.
"నాకు మాట్లాడే హక్కు ఉంది. ఆ హక్కుని ప్రజాస్వామ్యం కల్పించింది. నిజంగా దేశంలో డెమొక్రసీ ఉంటే నేను పార్లమెంట్లో మాట్లాడగలిగే వాడిని. ఇది నిజంగా మన దేశ ప్రజాస్వామ్యానికి పరీక్ష. అదానీ అంశంపై మేం పదేపదే ప్రశ్నిస్తున్నాం. అందుకే మోదీ సర్కార్ భయపడుతోంది. ఇకపై నాకు పార్లమెంట్లో మాట్లాడేందుకు అనుమతి దొరకకపోవచ్చు. మోదీ, అదానీ మధ్య సంబంధం ఏంటి అనేదే నా ప్రశ్న. అదానీ అంశంపై నేను చేసిన వ్యాఖ్యల్ని తప్పుదోవ పట్టించారు. ప్రజలకు తెలియాల్సిన సమాచారాన్ని దాచేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. నేను ఇవాళ ఉదయం పార్లమెంట్లో మాట్లాడేందుకు ప్రయత్నించాను. నలుగురు మంత్రులు నా ప్రసంగాన్ని అడ్డుకున్నారు. నాపై ఆరోపణలు చేశారు. కొద్ది రోజుల క్రితం నేను పార్లమెంట్లో అదానీ అంశం గురించి మాట్లాడాను. దాన్ని రికార్డుల నుంచి తొలగించారు. "
- రాహుల్ గాంధీ
I'm hopeful that I will be allowed to Speak in Parliament tomorrow.
— Congress (@INCIndia) March 16, 2023
The main question is: what is the relation between Modi and Adani?
The Modi government is scared of the Adani issue, & all this exercise is to distract from this fundamental question.
: @RahulGandhi ji pic.twitter.com/hQew59F0M2
As the allegations have been made in Parliament, it is my democratic right to have the opportunity to speak. If Indian democracy was functioning I would be able to speak in Parliament. So, actually what you are seeing is a test of Indian democracy: Congress MP Rahul Gandhi pic.twitter.com/ymMYiXh97h
— ANI (@ANI) March 16, 2023
భారత్కు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదని తేల్చి చెప్పారు రాహుల్ గాంధీ. తనకు మాట్లాడే అవకాశమిస్తే పార్లమెంట్లోనూ సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. భారత ప్రజాస్వామ్యంపై మోదీ ప్రభుత్వం దాడి చేస్తోందని, ప్రతిపక్ష నేతల్ని మాట్లాడనివ్వడం లేదని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ ఆరోపించారు. అంతే కాదు. కొందరు నేతలపై కేంద్రం నిఘా పెడుతోందనీ అన్నారు. మీడియాను, చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని, దర్యాప్తు సంస్థల్ని అనుకూలంగా వాడుకుటున్నారనీ ఆరోపించారు రాహుల్. దీనిపైనే బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Also Read: Board Paper Leak: పరీక్ష ముందు రోజే లీక్ అయిన ఎగ్జామ్ పేపర్, తప్పు మాదే అని ఒప్పుకున్న సీఎం
SSC CHSLE 2022 Key: ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో ఖాళీలు, అర్హతలివే!
నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్
Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?