అన్వేషించండి

మాల్దీవ్స్ ఎన్నికల్లో ముయిజూ పార్టీ ఘన విజయం, భారత్‌పై ఈ ఫలితాల ఎఫెక్ట్!

Maldives Elections 2024: మాల్దీవ్స్ పార్లమెంట్ ఎన్నికల్లో ముయిజూ పార్టీ PNC ఘన విజయం సాధించింది.

Maldives Parliamentary Elections: మాల్దీవ్స్ ఎన్నికల్లో అధ్యక్షుడు (Maldives Presidential Elections 2024) మహమ్మద్ ముయిజూ (Mohamed Muizzu) పార్టీ మరోసారి విజయం సాధించింది. ఏప్రిల్ 21న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ముయిజూ పార్టీ People's National Congress (PNC) ఘన విజయం సాధించింది. 93 స్థానాలున్న పార్లమెంట్ ఎన్నికల్లో 90 చోట్ల పోటీ చేసింది పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్. ఇప్పటి వరకూ 86 స్థానాల ఫలితాలు వెల్లడించగా అందులో 66 చోట్లు PNC పార్టీ గెలుపొందింది. సభలో మూడింట రెండొంతుల మెజార్టీని సొంతం చేసుకుంది. భారత్‌కి దూరంగా ఉంటున్న ముయిజూ చైనాకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి ఆయన పార్టీ అక్కడ ఈ స్థాయిలో గెలుపొందడం కీలకంగా మారింది. ఇకపై భారత్‌కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేందుకు దీన్నే మంచి అవకాశంగా భావిస్తోంది ఆ పార్టీ. నిజానికి ఈ ఎన్నికల ఫలితాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ముయిజూ చైనాకి దగ్గరవడం ఇబ్బందికరంగా మారింది. పైగా మాల్దీవ్స్‌లోని భారత సైనికులు వెనక్కి వెళ్లిపోవాలంటూ ముయిజూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఆ మధ్య చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చైనాలో రెండు రోజుల పాటు పర్యటించారు. తమది చిన్న ద్వీప దేశమే అని చులకనగా చూడొద్దని భారత్‌ని ఉద్దేశిస్తూ పరోక్షంగా హెచ్చరించారు. గతేడాదే ఆయన మాల్దీవ్స్‌కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

భారత్‌ వ్యతిరేక విధానం..

ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎన్నికలు జరగక ముందు వరకూ ముయిజూ పార్టీ మరో పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఇప్పుడు సొంతగా భారీ మెజార్టీ సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అంతకు ముందు ముయిజూ అధ్యక్షుడు అయినప్పటికీ మెజార్టీ లేకపోవడం వల్ల కొన్ని విధానాలకు ఆమోదం లభించలేదు. ఇప్పుడా సమస్య లేకుండా పోయింది. పైగా ఈ సారి అధికారంలోకి రావడానికి సంచలన హామీ ఇచ్చారు మహమ్మద్ ముయిజూ. భారత సైనికులను మాల్దీవ్స్‌ నుంచి వెనక్కి పంపేస్తానని భరోసా ఇచ్చారు. పరోక్షంగా భారత్ విషయంలో తన పాలసీ ఏంటో చెప్పకనే చెప్పారు. ఆయన పార్టీ విజయం సాధించడానికి ఇది కూడా ఓ కారణమని భావిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే ముయిజూ పార్టీకే మెజార్టీ ఉండాలన్న భావన ప్రజల్లో వచ్చేలా చూసుకున్నారు. చైనా పెద్ద ఎత్తున మాల్దీవ్స్‌కి సాయం అందించాలంటే ఆ దేశంతో సన్నిహితంగా ఉంటున్న ముయిజూ వల్లే సాధ్యం అవుతుందన్న అభిప్రాయమూ బలపడిపోయింది. గతేడాది ఎన్నికలు ముగిసి అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే బీజింగ్‌కి వెళ్లారు ముయిజూ. మాల్దీవ్స్‌లోని 80 మంది భారతీయ సైనికులను వెనక్కి పంపే వరకూ ఊరుకోమని తేల్చి చెప్పారు. అయితే..ఆర్థిక సాయం విషయానికి వచ్చినప్పుడు మాత్రం భారత్‌పై సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. మాల్దీవ్స్‌తో భారత్‌కి మైత్రి అవసరమే అని అంటున్నారు ముయిజూ. ఇలా తమ అవసరానికి తగ్గట్టుగా మాట్లాడేస్తున్నారు. అయితే...ఈ వైఖరిని భారత్‌ గమనిస్తోంది. 

Also Read: అమ్మ చనిపోయినా కడుపులో బిడ్డ మాత్రం సేఫ్‌, డెలివరీ చేసిన వైద్యులు - గాజాలో అద్భుతం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP BJP Congress: నేడు లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక - ఎంపీలకు విప్‌లు జారీ చేసిన పార్టీలు
నేడు లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక - ఎంపీలకు విప్‌లు జారీ చేసిన పార్టీలు
KCR Met BRS Leaders: వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

Jagan Letter to AP Assembly Speaker | ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్Raja Singh Counter to Asaduddin | అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలకు రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్KA Paul Advice To Chandrababu Naidu | సీఎం చంద్రబాబుకు కేఏ పాల్ సలహాలుBJP MLA Comments on YSRCP | బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP BJP Congress: నేడు లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక - ఎంపీలకు విప్‌లు జారీ చేసిన పార్టీలు
నేడు లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక - ఎంపీలకు విప్‌లు జారీ చేసిన పార్టీలు
KCR Met BRS Leaders: వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Raja Singh: దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని
Bharateeyudu 2 Trailer: ‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!
‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!
Nandyal: నంద్యాలలో బీరు బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్, అవాక్కైన యువకుడు
నంద్యాలలో బీరు బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్, అవాక్కైన యువకుడు
Embed widget