అన్వేషించండి

Joe Biden: రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్య అతితిగా బైడెన్‌ను ఆహ్వానించిన మోదీ

Joe Biden: రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్య అతితిగా బైడెన్‌ను ఆహ్వానించిన మోదీ

భారత్‌లో వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ బుధవారం ఓ కార్యక్రమంలో వెల్లడించారు. అయితే అధ్యక్షుడు బైడెన్‌కు భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానం పంపినట్లు ప్రభుత్వ వర్గాలు ఇంకా ధృవీకరించలేదు. జీ20 సదస్సు సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల సమయంలో ప్రధాని మోదీ బైడెన్‌తో ఈ విషయంపై మాట్లాడారని గార్సెట్టీ తెలిపారు. ఒకవేళ ప్రధాని మోదీ ఆహ్వానాన్ని బైడెన్‌ అంగీకరించి రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తే మన దేశంలో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన రెండో అమెరికా అధ్యక్షుడు అవుతారు. గతంలో 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మన దేశంలో ప్రతి ఏడాది గణతంత్ర వేడుకలకు ప్రపంచ నేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే.

యునైటెడ్‌ స్టేట్స్‌, భారత్‌ కలిసి మన దేశంలో పది వేల ఎలక్ట్రిక్‌ బస్సులను విస్తరింప చేసేందుకు సులభతరమైన ఒక యంత్రాంగాన్ని ప్రారంభించాయి. ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన ప్రకటన ప్రకారం పీఎం ఈ-బస్‌ సేవా స్కీమ్‌కు ఊతమిచ్చేందుకు అమెరికా సహాయపడనుంది. తగినంత ప్రజా రవాణా లేని నగరాల కోసం పది వేల ఎలక్ట్రిక్‌ బస్సులను కొనుగోలు చేయడం ఈ పథకం లక్ష్యం. అమెరికా రాయబారి గార్సెట్టి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'ప్రతి రోజూ మనం ప్రపంచ స్థాయిలో వాతావరణ సంక్షోభం ప్రభావాన్ని చూస్తున్నాం. మనం ఇప్పుడే స్పందించాలి లేదంటే మన గ్రహం, ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఈ రోజు ప్రకటిస్తున్న అమెరికా, భారత్‌ భాగస్వామ్యం దేశం అంతటా 10,000 ఎలక్ట్రిక్‌ బస్సులను సమకూర్చేందుకు ఫైనాన్సింగ్‌ను సమీకరిస్తుంది. భారత దేశంలో ఎలక్ట్రిక్‌ ప్రజా రవాణాను విస్తరిస్తుంది. పరిశుభ్రమైన నగరాలు, ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరుస్తుంది'   అని తెలిపారు. ఈ ప్రాజెక్టు మేజర్‌ కాంపొనెంట్ నూతన పేమెంట్‌ సెక్యురిటీ మెకానిజమ్‌(పీఎస్‌ఎం) అని ఆయన వెల్లడించారు. దీని ద్వారా మెరుగైన రుణ నిబంధనలను మెరుగుపరుస్తుంది, ఫైనాన్సింగ్‌ ఖర్చులను తగ్గిస్తుంది, ప్రాజెక్టు అమలును సులభతరం చేస్తుందని అన్నారు.

భారత్‌-కెనడా దౌత్య పరమైన వివాదంపైనా గార్సెట్టి స్పందించారు. నేరస్థులకు శిక్ష పడేలా చేయాలని, ఇతర  అనుమానాలు రాకముందే సరైన విచారణ చేపట్టాలని ఆయన అన్నారు. కెనడా తమకు పొరుగున ఉన్న మంచి మిత్ర దేశమని, భారత్‌ పట్ల తాము ఎలాగైతే శ్రద్ధ వహిస్తామో, కెనడా పట్ల కూడా అలాగే శ్రద్ధ వహిస్తామని తెలిపారు. ఇలాంటి ఘటనలు తమ దేశాల మధ్య సంబంధాలను నిర్వచించలేవని భావిస్తున్నానని, దాని వల్ల పురోగతి నెమ్మదిస్తుందని అన్నారు. సరైన విధంగా విచారణ జరిపి నేరస్థులను న్యాయస్థానానికి తీసుకురావాలని పేర్కొన్నారు.

వచ్చే ఏడాది జనవరిలో రిపబ్లిక్‌ డే సమయంలోనే క్వాడ్‌ సదస్సు జరగనుందా అని విలేకరులు గార్సెట్టిని ప్రశ్నించగా తనకు ఆ సమాచారం తెలియదని ఆయన బదులిచ్చారు. భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్‌ సదస్సుకు వచ్చే ఏడాది భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ దేశాల అధినేతలు భారత్‌ వచ్చే అవకాశం ఉంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget