అన్వేషించండి

Joe Biden: రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్య అతితిగా బైడెన్‌ను ఆహ్వానించిన మోదీ

Joe Biden: రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్య అతితిగా బైడెన్‌ను ఆహ్వానించిన మోదీ

భారత్‌లో వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ బుధవారం ఓ కార్యక్రమంలో వెల్లడించారు. అయితే అధ్యక్షుడు బైడెన్‌కు భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానం పంపినట్లు ప్రభుత్వ వర్గాలు ఇంకా ధృవీకరించలేదు. జీ20 సదస్సు సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల సమయంలో ప్రధాని మోదీ బైడెన్‌తో ఈ విషయంపై మాట్లాడారని గార్సెట్టీ తెలిపారు. ఒకవేళ ప్రధాని మోదీ ఆహ్వానాన్ని బైడెన్‌ అంగీకరించి రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తే మన దేశంలో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన రెండో అమెరికా అధ్యక్షుడు అవుతారు. గతంలో 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మన దేశంలో ప్రతి ఏడాది గణతంత్ర వేడుకలకు ప్రపంచ నేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే.

యునైటెడ్‌ స్టేట్స్‌, భారత్‌ కలిసి మన దేశంలో పది వేల ఎలక్ట్రిక్‌ బస్సులను విస్తరింప చేసేందుకు సులభతరమైన ఒక యంత్రాంగాన్ని ప్రారంభించాయి. ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన ప్రకటన ప్రకారం పీఎం ఈ-బస్‌ సేవా స్కీమ్‌కు ఊతమిచ్చేందుకు అమెరికా సహాయపడనుంది. తగినంత ప్రజా రవాణా లేని నగరాల కోసం పది వేల ఎలక్ట్రిక్‌ బస్సులను కొనుగోలు చేయడం ఈ పథకం లక్ష్యం. అమెరికా రాయబారి గార్సెట్టి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'ప్రతి రోజూ మనం ప్రపంచ స్థాయిలో వాతావరణ సంక్షోభం ప్రభావాన్ని చూస్తున్నాం. మనం ఇప్పుడే స్పందించాలి లేదంటే మన గ్రహం, ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఈ రోజు ప్రకటిస్తున్న అమెరికా, భారత్‌ భాగస్వామ్యం దేశం అంతటా 10,000 ఎలక్ట్రిక్‌ బస్సులను సమకూర్చేందుకు ఫైనాన్సింగ్‌ను సమీకరిస్తుంది. భారత దేశంలో ఎలక్ట్రిక్‌ ప్రజా రవాణాను విస్తరిస్తుంది. పరిశుభ్రమైన నగరాలు, ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరుస్తుంది'   అని తెలిపారు. ఈ ప్రాజెక్టు మేజర్‌ కాంపొనెంట్ నూతన పేమెంట్‌ సెక్యురిటీ మెకానిజమ్‌(పీఎస్‌ఎం) అని ఆయన వెల్లడించారు. దీని ద్వారా మెరుగైన రుణ నిబంధనలను మెరుగుపరుస్తుంది, ఫైనాన్సింగ్‌ ఖర్చులను తగ్గిస్తుంది, ప్రాజెక్టు అమలును సులభతరం చేస్తుందని అన్నారు.

భారత్‌-కెనడా దౌత్య పరమైన వివాదంపైనా గార్సెట్టి స్పందించారు. నేరస్థులకు శిక్ష పడేలా చేయాలని, ఇతర  అనుమానాలు రాకముందే సరైన విచారణ చేపట్టాలని ఆయన అన్నారు. కెనడా తమకు పొరుగున ఉన్న మంచి మిత్ర దేశమని, భారత్‌ పట్ల తాము ఎలాగైతే శ్రద్ధ వహిస్తామో, కెనడా పట్ల కూడా అలాగే శ్రద్ధ వహిస్తామని తెలిపారు. ఇలాంటి ఘటనలు తమ దేశాల మధ్య సంబంధాలను నిర్వచించలేవని భావిస్తున్నానని, దాని వల్ల పురోగతి నెమ్మదిస్తుందని అన్నారు. సరైన విధంగా విచారణ జరిపి నేరస్థులను న్యాయస్థానానికి తీసుకురావాలని పేర్కొన్నారు.

వచ్చే ఏడాది జనవరిలో రిపబ్లిక్‌ డే సమయంలోనే క్వాడ్‌ సదస్సు జరగనుందా అని విలేకరులు గార్సెట్టిని ప్రశ్నించగా తనకు ఆ సమాచారం తెలియదని ఆయన బదులిచ్చారు. భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్‌ సదస్సుకు వచ్చే ఏడాది భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ దేశాల అధినేతలు భారత్‌ వచ్చే అవకాశం ఉంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget