అన్వేషించండి

Liquor prices: మందుబాబులకు షాక్! పెరిగిన మద్యం ధరలు - దేశంలోనే అక్కడ కాస్ట్ లీ లిక్కర్ సేల్

కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మందుబాబులకు గట్టి షాక్ ఇచ్చింది. ఎక్పైజ్ సుంకాన్ని 20 శాతం పెంచింది. దీంతో ఎక్కువ ధరకు మందు దొరికే రాష్ట్రంగా కర్ణాటక నంబర్.1 గా నిలిచింది.

Liquor prices: మందుబాబులకు కర్ణాటక సర్కార్ తేరుకోలేని షాక్ ఇచ్చింది. సీఎం సిద్ధరామయ్య గత శుక్రవారం కర్ణాటక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో మద్యంపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (AED) 20% పెంచాలని ప్రతిపాదించారు. దీంతో తాజాగా పెరిగిన మద్యం ధరలు జులై 19 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. అయితే తాజాగా అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 20 శాతం పెరగడంతో దేశంలోనే మద్యం ఎక్కువ ధరకు విక్రయించే రాష్ట్రాల్లో కర్ణాటక మొదటి స్థానంలోకి వచ్చింది. బీర్ల అమ్మకాల్లో మూడో స్థానంలో నిలిచింది.

దేశీయ లిక్కర్(క్రూడ్ కంట్రీ లిక్కర్ వేరియంట్) అయిన అరక్ అమ్మకాలను చాలా కాలంగా కర్ణాటకలో నిషేధించినందున..దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ధర కలిగిన మద్యం బ్రాండ్‌లు కర్ణాటకలో ఇప్పటికీ తక్కువ ధర ఉన్నాయని ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు, స్థానిక మద్యం బ్రాండ్ల ధరలను తగ్గించాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను టిప్పలర్లు కోరారు. పేద కార్మికులు వినియోగించే మద్యం బ్రాండ్‌ల ధరలను తగ్గించాలని టిప్పర్ల ఫోరమ్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరింది.

తక్కువ ధర మద్యం బ్రాండ్లు కూడా ఖరీదే..

పెరిగిన మద్యం ధరల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తక్కువ ధర కలిగిన మద్యం బ్రాండ్లు కూడా కర్ణాటకలో అధిక ధర ఉన్నట్లు తెలుస్తోంది. అతి తక్కువ స్లాబ్‌లో ఉన్న మద్యం ( బల్క్‌లో లీటర్ మద్యం ధర రూ. 449 ) ధర మినహా మిగిలిన బ్రాండ్లు అన్ని కర్ణాటకలోనే అధికంగా ఉన్నట్లు కర్ణాటక బ్రేవరీస్ అండ్ డిస్టిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ పార్సా వెల్లడించారు. ఇది నిజంగా అన్ని రకాల మద్యం వినియోగదారులకు ఇబ్బంది కలిగించే అంశమని ఆయన తెలిపారు. కర్ణాటకలో మద్యం వినియోగదారుల్లో 78 శాతం కన్నా ఎక్కువ మంది తక్కువ మరియు మధ్యస్థ స్లాబ్‌లలో ఉన్న మద్యాన్నే తీసుకుంటారని.. కేవలం 5 శాతం మంది మాత్రమే పెద్ద బ్రాండ్ల మద్యాన్ని సేవిస్తారని..ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ధరల పెంపు అనేది కొంత మంది మద్యం ప్రియులపై మాత్రమే ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అయితే ఈ అదనపు ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై కొన్ని రోజుల తర్వాత సీఎం సిద్ధరామయ్య నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. 

బీర్ల ధరల్లో మూడవ స్థానం..

బీర్ల విషయానికి వస్తే దేశంలోనే అత్యధిక రేటులో అమ్మకాలు జరుపుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక మూడవ స్థానంలో నిలిచింది. బీర్‌పై ఏఈడీని రూ.175 నుంచి 185కి పెంచాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదించారు. ఫలితంగా జూలై19 నుంచి  650 ఎంఎల్ బీర్‌ బాటిల్‌ ధర రూ.170 నుంచి రూ.187కి పెరగనుంది. ప్రస్తుతం కర్ణాటకలో బీరు ధర రూ. 187 ఉంది. మొదటి రెండు స్థానాల్లో తమిళనాడులో అత్యధికంగా రూ. 210, ఢిల్లీలో రూ. 190 ఉన్నాయి. పెరుగిన మద్యం ధరలపై ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ISWAI) సుంకాన్ని తగ్గించాలని, ప్రీమియం బ్రాండ్‌ల ఎంఆర్పీని పొరుగు రాష్ట్రాలకు అనుగుణంగా తగ్గించాలని రాష్ట్రాన్ని కోరింది.

 

టాప్ హెడ్ లైన్స్

Indian Tourists Boat Tragedy: వియత్నాంలో బోటు విషాదం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Indian Tourists Boat Tragedy: వియత్నాంలో బోటు విషాదం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Indian Tourists Boat Capsized Vietnam: వియత్నం మృతుల్లో కడప శ్రీధర్, మచిలీపట్నం జయశ్రీ - లావా మొబైల్స్ తెలుగు డీలర్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం !
వియత్నం మృతుల్లో కడప శ్రీధర్, మచిలీపట్నం జయశ్రీ - లావా మొబైల్స్ తెలుగు డీలర్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం !
Bankipur By Election: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ మైండ్ గేమ్ - బీజేపీ అభ్యర్థి అభిషేక్ సిన్హా నామినేషన్ ఉపసంహరణ !
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ మైండ్ గేమ్ - బీజేపీ అభ్యర్థి అభిషేక్ సిన్హా నామినేషన్ ఉపసంహరణ !
Indian Tourists Boat Capsize: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల టూరిస్టులు సహా 18 మంది మృతి!
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల టూరిస్టులు సహా 18 మంది మృతి!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Tourists Boat Tragedy: వియత్నాంలో బోటు విషాదం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Indian Tourists Boat Tragedy: వియత్నాంలో బోటు విషాదం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Breaking News: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 18 మంది మృతి
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 18 మంది మృతి
Embed widget