అన్వేషించండి

Prashant Kishor Congress: 2024 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు.. పార్టీలోకి ప్రశాంత్ కిషోర్!

2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా దేశంలోని ప్రధాన పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. ప్రధాన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

ఢిల్లీ రాజకీయాలు కొన్ని రోజుల నుంచి వేగంగా మారుతున్నాయి. వచ్చే ఏడాది నిర్వహించనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ఇప్పటికే ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. ఈ క్రమంలో రాజకీయ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ నేతలతో సమావేశం కావడంతో హస్తిన రాజకీయాలు మరింత వేడెక్కాయి. పీకే కాంగ్రెస్‌లోకి చేరుతున్నట్లు ఊహగానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో ప్రశాంత్ కిషోర్ భేటీ అనంతరం కాంగ్రెస్‌లో చేరికపై ఇంతవరకూ స్పష్టమైన ప్రకటన చేయలేదు. కానీ కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు మార్గం సుగమం అయినట్లు పేర్కొంటున్నాయి.

సీనియర్లతో సమావేశం..

ప్రశాంత్ కిషోర్ తమ పార్టీలో చేరిక అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేతల బృందం వారం క్రితం రాహుల్ గాంధీ అధ్యక్షతన ఒక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కమల్‌నాథ్, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ, అజయ్ మాకెన్, ఆనంద్ శర్మ, హరీష్ రావత్, అంబికా సోని, కేసీ వేణుగోపాల్ వంటి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గురించి చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లోకి చేరితేనే పార్టీకి లాభిస్తుందని సీనియర్ నేతలు రాహుల్ గాంధీతో చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

పీకేకు కీలక పదవి..

కాంగ్రెస్‌ పార్టీలో పీకేకు ఎలాంటి స్థానం కల్పించాలనే విషయమై అధిష్టానం, నేతల మధ్య అంతర్గతంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఆయన వస్తే కలిగే లాభనష్టాలపై బేరీజు వేసుకుంటున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌కు పార్టీలో కీలక పదవి ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనను పార్టీలోకి తీసుకునే ముందు సీనియర్లతో చర్చించాలని రాహుల్‌కు తొలుత పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారు. బీజేపీని ఓడించేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన కొన్ని సూచనలపై కాంగ్రెస్ సీనియర్లు కూడా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా కనీసం 136 సీట్లను గెలవాల్సి ఉంటుందని, ఇతర పార్టీలతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆయన సూచించారు. విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరన్నది తమకు ముఖ్యం కాదని, అన్ని పార్టీలు ఏకం కావడం అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన శరద్‌ పవార్‌, లాలూ ప్రసాద్‌, సమాజ్‌వాదీ పార్టీ నేత రాంగోపాల్‌ యాదవ్‌ తదితరులతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా 2024 లోక్‌సభ ఎన్నికల గురించి, కాంగ్రెస్ ప్రణాళికలపై వారు చర్చించినట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రపతి రేసులో శరద్ పవార్ ఉన్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో పవార్ భేటీ కావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Orissa Fire Accident: ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం
ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం
Mahindra XEV 9S నిజంగానే 679 కి.మీ రేంజ్‌ ఇస్తుందా? రియల్ టైంలో ఎంత దూరం వెళ్లింది
Mahindra XEV 9S నిజంగానే 679 కి.మీ రేంజ్‌ ఇస్తుందా? రియల్ టైంలో ఎంత దూరం వెళ్లింది
Moinabad Farmhouse Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Embed widget