అన్వేషించండి

VK Singh On Pok: పీఓకే దానంతట అదే భారత్‌లో కలుస్తుంది, కాస్త వేచి ఉండండి

VK Singh On Pok: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ దానంతట అదే త్వరలో భారత్‌లో కలుస్తుంది, కాస్త వేచి ఉండండి అంటూ కేంద్ర మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ దానంతట అదే త్వరలో భారత్‌లో కలుస్తుంది, కాస్త వేచి ఉండండి అంటూ కేంద్ర మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని దౌసాలో ప్రెస్‌ కాన్ఫరెన్సన్‌లో పాల్గొన్న మంత్రిని విలేకరులు ఈ అంశంపై ప్రశ్నించగా ఆయన వై విధంగా సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. బీజేపీ చేపడుతున్న పరివర్తన్‌ సంకల్ప్‌ యాత్రలో భాగంగా వీకే సింగ్‌ దౌసాలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అయితే పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలోని వారు భారత్‌లో కలిసిపోయేందుకు డిమాండ్‌ చేస్తున్నారు దీనిపై స్పందించమని అడగగా ' పీఓకే త్వరలోనే భారత్‌లో దానంతట అదే కలిసిపోతుంది. కాస్త సమయం వేచి ఉండండి' రిటైర్డ్‌ ఆర్మీ చీఫ్ జనరల్‌ వీకే సింగ్‌ బదులిచ్చారు.

ఇటీవల చైనా భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను, ఆక్సాయ్‌చిన్‌ను తమ భూభాగంగా చూపిస్తూ మ్యాప్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే వీకే సింగ్‌ ఈ విధంగా మాట్లాడడం ఆసక్తి కలిగిస్తోంది. 2023 చైనా స్టాండర్డ్‌ మ్యాప్‌ పేరుతో చైనా విడుదల చేసిన మ్యాప్‌పై భారత్‌ తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేసింది. భారత్‌తోపాటు పొరుగున ఉన్న ఇతర దేశాలు కూడా చైనా చర్యలను తీవ్రంగా ఖండించాయి.  అలాగే పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉంటున్న ప్రజలు తాము భారత్‌తో కలిసిపోతామని డిమాండ్లు చేస్తున్నారు. ఇటీవల పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా నిర్వహించారు. అక్కడి షియా ముస్లింల నుంచి డిమాండ్లు ఎక్కువగా వస్తున్నాయి. భారత్‌తో ఉన్న సరిహద్దును తెరవాలని తాము భారత్‌తో కలుస్తామని వారు గట్టిగా చెప్తున్నారు.

భారత అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సు విజయవంతం కావడంపైన మంత్రి వీకే సింగ్  ప్రశంసలు కురిపించారు. ఈ సమ్మిట్‌ విజయం వల్ల ప్రపంచ వేదికపై భారత్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ప్రపంచ దేశాల్లో భారత్‌ సత్తాను చాటుకుందని ఆయన వెల్లడించారు. జీ20 గ్రూప్‌లో ప్రపంచంలోని అన్ని శక్తివంతమైన దేశాలు ఉన్నాయని, భారత్‌ ఈ సమావేశాలను నిర్వహించడం ఇదే తొలిసారి అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ సమావేశాలను అద్భుతంగా నిర్వహించారని కొనియాడారు. ఈ సదస్సుతో భారత తన సత్తా చాటుకుందని అన్నారు. 

అలాగే రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మంత్రి విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందని దుయ్యబట్టారు. దీని వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇందుకే బీజేపీ పరివర్తన్‌ సంకల్ప్‌ యాత్రను నిర్వహిస్తోందని అన్నారు. ప్రజలు పరివర్తన కోరుకుంటున్నారని , ఈ యాత్రకు తరలి రావాలని నిర్ణయించుకుంటున్నారని వీకే సింగ్‌ వెల్లడించారు. ఈ యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా అపారమైన మద్దతు లభిస్తోందని అన్నారు. 

రాబోయే ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని విలేకరులు ప్రశ్నించగా.. ఎన్నికలు వస్తే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే పోటీ చేస్తుందని, కేవలం ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతోనే తాము పోటీలో దిగుతామని వీకే సింగ్‌ స్పష్టంచేశారు. పార్టీ ప్రజలకు ఉపయోగపడే నాయకులకు, ప్రజల నమ్మకం సాధించిన నాయకులకు, మంచి వారికి తప్పకుండా అవకాశం ఇస్తుందని ఆయన తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Premante OTT : ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు

వీడియోలు

Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Premante OTT : ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
Shocking News: పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోన‌సీమ జిల్లా రామ‌చంద్ర‌పురంలో విషాదం
పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోన‌సీమ జిల్లా రామ‌చంద్ర‌పురంలో విషాదం
Masaka Masaka Song : ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
Census India 2027: జనగణన సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష విధిస్తారా, రూల్స్ ఏంటి?
జనగణన సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష విధిస్తారా, రూల్స్ ఏంటి?
Embed widget