అన్వేషించండి

దేశం కోసం ఇందిరా గాంధీ నగలు విరాళంగా ఇచ్చారా! అసలేంటీ గోల్డ్ గొడవ?

PM Modis Mangalsutra Remark: ఇందిరా గాంధీ తన నగల్ని దేశం కోసం త్యాగం చేశారని ఇటీవల ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Indira Gandhi Donate Gold: కాంగ్రెస్‌ దేశ సంపదని, ఆడవాళ్ల నగల్ని కొల్లగొట్టి ముస్లింలకు పంచిపెడుతుందని ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దాదాపు రెండు రోజులుగా దీనిపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. అయితే...ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలూ మరింత కీలకంగా మారాయి. ఇందిరా గాంధీ తన మంగళసూత్రాన్ని దేశం కోసం త్యాగం చేసిందంటూ రాజీవ్‌ గాంధీ హత్యకు గురైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించింది. రాజీవ్ గాంధీ దేశం కోసమే ప్రాణాలొదిలారని, అలా ఇందిరా గాంధీ తన మంగళసూత్రాన్ని దేశానికి త్యాగం చేశారని అన్నారు ప్రియాంక గాంధీ. అంతే కాదు. అంతకు ముందు తన నానమ్మ భారత్‌ యుద్ధ కాలంలో ఉన్నప్పుడు తన బంగారు ఆభరణాలన్నింటనీ దేశం కోసం ఇచ్చేసిందని వెల్లడించారు. గాంధీ కుటుంబ త్యాగాల్ని ప్రధాని మోదీ మర్చిపోవద్దంటూ మండి పడ్డారు. ఈ క్రమంలోనే అసలు ప్రధాని కాంగ్రెస్‌ గురించి ఎందుకిలా మాట్లాడారు..? బంగారం ప్రస్తావన ఎందుకు వచ్చిందనేదే కీలకంగా మారింది. 

ఈ బంగారం కథేంటి..? 

1962లో భారత్‌, చైనా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. Chinese People's Liberation Army భారత్‌పై యుద్ధానికి సిద్ధమైంది. లద్దాఖ్‌లోని చుషూల్ ప్రాంతంలో ఆ సైన్యం మొహరించింది. ఆ సైనికులతో పోరాడేందుకు భారత్ కూడా సన్నద్ధమైంది. అప్పటి నెహ్రూ ప్రభుత్వం కొన్ని ప్రకటనలు చేసింది. దేశంలోని మహిళలంతా తమ బంగారు ఆభరణాల్ని దేశం కోసం త్యాగం చేయాలని కోరింది. డబ్బులతో పాటు ఉలెన్ దుస్తులూ డొనేట్ చేయాలని అడిగింది. ఆ సమయంలోనే నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ కూడా తన బంగారు ఆభరణాల్ని విరాళంగా ఇచ్చింది. అదే విషయాన్ని ఇప్పుడు ప్రియాంక గాంధీ ప్రస్తావించారు.

 

చైనాతో యుద్ధం జరుగుతున్న సమయంలో ఇందిరా గాంధీ ముందుగా చొరవ చూపించి తన ఆభరణాల్ని విరాళంగా ఇచ్చినట్టు అప్పటి వార్తా కథనాలు వెల్లడించాయి. కొంతకాలం వరకూ భారత్-చైనా మధ్య యుద్ధం జరిగినప్పటికీ ఆ తరవాత బీజింగ్‌ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది. కానీ...అప్పట్లో ఇచ్చిన ఈ బంగారు నగల లెక్కలు మాత్రం ఇప్పటికీ తేలలేదు. అవి RBI రికార్డులలోనూ లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ కాంగ్రెస్ మంగళసూత్రాలతో సహా దోచుకుని ముస్లింలకు ఇచ్చేస్తుందని మండి పడ్డారు. 

Also Read: సుప్రీంకోర్టు దెబ్బకి దిగొచ్చిన పతంజలి, క్షమాపణలు కోరుతూ న్యూస్‌పేపర్‌లలో భారీ ప్రకటనలు

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget