అన్వేషించండి

Olympics: 2036 నాటికి భారత్‌లో ఒలింపిక్స్‌! అహ్మదాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు?

Olympics in India: 2036 నాటికి భారత్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

2036 Olympics in India: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎప్పుడూ లేనంతగా దాదాపు 98 నిముషాల సుదీర్ఘ ప్రసంగం ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ స్పీచ్‌లో ఎన్నో కీలక విషయాలు ప్రస్తావించారు. దేశ అభివృద్ధి నుంచి మహిళల భద్రత, ఒలింపిక్స్‌ వరకూ అన్ని అంశాలూ మాట్లాడారు. అయితే...ఒలింపిక్స్ గురించి ప్రస్తావిస్తూ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు ప్రధాని. 2036 నాటికి ఒలింపిక్స్‌ని భారత్‌లో నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అప్పుడు భారత్‌ ఒలింపిక్స్‌కి ఆతిథ్యమిచ్చేలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అయితే..2036 నాటి ఒలింపిక్స్‌ని హోస్ట్ చేసేందుకు భారత్‌తో పాటు సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ పోటీ పడుతున్నాయి. ఈ క్రీడలు ఎక్కడ నిర్వహించాలన్నది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎన్నికలూ జరుగుతాయి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో 2036లో ఒలింపిక్స్‌కి ఆతిథ్యమిచ్చే దేశమేదో తేలిపోతుంది. ప్రధాని మోదీ మాత్రం భారత్‌లోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. 

"2036 లో ఒలింపిక్స్‌కి ఆతిథ్యం అందించాలన్నది భారత్ కల. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం. మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం"

- ప్రధాని నరేంద్ర మోదీ

ఇదే సమయంలో G20 సదస్సు గురించి ప్రస్తావించారు ప్రధాని. భారత్‌ విజయవంతంగా ఈ సదస్సుని నిర్వహించిందని గుర్తు చేశారు. ఈ సమ్మిట్ తరవాతే భారత్‌ ఎలాంటి అంతర్జాతీయ కార్యక్రమాలనైనా నిర్వహించగలదన్న నమ్మకం వచ్చిందని తేల్చి చెప్పారు. ఇదే నమ్మకం ప్రపంచానికీ కలిగింది అన్నారు. అందుకే ఒలింపిక్స్‌ నిర్వహణపైనా మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే International Olympic Committee చీఫ్ థామస్ బచ్ భారత్‌కి మద్దతు పలికారు. 2010లో చివరిసారి కామన్‌వెల్త్ గేమ్స్‌ని నిర్వహించింది భారత్. ఢిల్లీ వేదికగా ఈ క్రీడలు జరిగాయి. ఒకవేళ 2036లో భారత్‌లో ఒలింపిక్స్‌ జరిగితే అహ్మదాబాద్ అందుకు వేదిక అవుతుందని సమాచారం. 

(Also Read: Mpox Cases: డేంజర్ బెల్స్ మోగిస్తున్న మరో ప్యాండెమిక్! గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO)

పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్‌ క్రీడాకారులు కనబరిచిన ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్‌కి ఆరు మెడల్స్ మాత్రమే వచ్చినప్పటికీ వాళ్ల పడ్డ శ్రమను మాత్రం ఎప్పటికీ మరిచిపోలేమని అన్నారు. దేశంలోని 140 కోట్ల మంది పౌరుల తరపున వాళ్లకు అభినందనలు తెలిపారు. ఒక వెండి పతకంతో పాటు ఐదు కాంస్య పతకాలు సాధించుకుంది భారత్. ఈ సందర్భంగా మోదీ మను భాకర్‌తో పాటు గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకూ పారిస్‌లో పారాలింపిక్స్‌ జరగనున్న క్రమంలో ఇండియన్ అథ్లెట్స్‌కి ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. 

Also Read: Kolkata Doctor Murder: ట్రైనీ డాక్టర్‌ డైరీలో చివరి పేజీ, ఈ దారుణానికి కొద్ది గంటల ముందు ఏం రాసుకుందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
Best Playing 11 Of IPL : అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగులు పడతాయని వార్నింగ్
తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగుల వార్నింగ్
Vaibhav Sooryavanshi News: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ రెమ్యునరేషన్ డబుల్: 15 ఏళ్ల వండర్ కిడ్ కోసం బ్రాండ్ల క్యూ..
ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ రెమ్యునరేషన్ డబుల్: 15 ఏళ్ల వండర్ కిడ్ కోసం బ్రాండ్ల క్యూ..

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగులు పడతాయని వార్నింగ్
తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగుల వార్నింగ్
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Embed widget