అన్వేషించండి

Olympics: 2036 నాటికి భారత్‌లో ఒలింపిక్స్‌! అహ్మదాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు?

Olympics in India: 2036 నాటికి భారత్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

2036 Olympics in India: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎప్పుడూ లేనంతగా దాదాపు 98 నిముషాల సుదీర్ఘ ప్రసంగం ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ స్పీచ్‌లో ఎన్నో కీలక విషయాలు ప్రస్తావించారు. దేశ అభివృద్ధి నుంచి మహిళల భద్రత, ఒలింపిక్స్‌ వరకూ అన్ని అంశాలూ మాట్లాడారు. అయితే...ఒలింపిక్స్ గురించి ప్రస్తావిస్తూ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు ప్రధాని. 2036 నాటికి ఒలింపిక్స్‌ని భారత్‌లో నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అప్పుడు భారత్‌ ఒలింపిక్స్‌కి ఆతిథ్యమిచ్చేలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అయితే..2036 నాటి ఒలింపిక్స్‌ని హోస్ట్ చేసేందుకు భారత్‌తో పాటు సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ పోటీ పడుతున్నాయి. ఈ క్రీడలు ఎక్కడ నిర్వహించాలన్నది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎన్నికలూ జరుగుతాయి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో 2036లో ఒలింపిక్స్‌కి ఆతిథ్యమిచ్చే దేశమేదో తేలిపోతుంది. ప్రధాని మోదీ మాత్రం భారత్‌లోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. 

"2036 లో ఒలింపిక్స్‌కి ఆతిథ్యం అందించాలన్నది భారత్ కల. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం. మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం"

- ప్రధాని నరేంద్ర మోదీ

ఇదే సమయంలో G20 సదస్సు గురించి ప్రస్తావించారు ప్రధాని. భారత్‌ విజయవంతంగా ఈ సదస్సుని నిర్వహించిందని గుర్తు చేశారు. ఈ సమ్మిట్ తరవాతే భారత్‌ ఎలాంటి అంతర్జాతీయ కార్యక్రమాలనైనా నిర్వహించగలదన్న నమ్మకం వచ్చిందని తేల్చి చెప్పారు. ఇదే నమ్మకం ప్రపంచానికీ కలిగింది అన్నారు. అందుకే ఒలింపిక్స్‌ నిర్వహణపైనా మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే International Olympic Committee చీఫ్ థామస్ బచ్ భారత్‌కి మద్దతు పలికారు. 2010లో చివరిసారి కామన్‌వెల్త్ గేమ్స్‌ని నిర్వహించింది భారత్. ఢిల్లీ వేదికగా ఈ క్రీడలు జరిగాయి. ఒకవేళ 2036లో భారత్‌లో ఒలింపిక్స్‌ జరిగితే అహ్మదాబాద్ అందుకు వేదిక అవుతుందని సమాచారం. 

(Also Read: Mpox Cases: డేంజర్ బెల్స్ మోగిస్తున్న మరో ప్యాండెమిక్! గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO)

పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్‌ క్రీడాకారులు కనబరిచిన ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్‌కి ఆరు మెడల్స్ మాత్రమే వచ్చినప్పటికీ వాళ్ల పడ్డ శ్రమను మాత్రం ఎప్పటికీ మరిచిపోలేమని అన్నారు. దేశంలోని 140 కోట్ల మంది పౌరుల తరపున వాళ్లకు అభినందనలు తెలిపారు. ఒక వెండి పతకంతో పాటు ఐదు కాంస్య పతకాలు సాధించుకుంది భారత్. ఈ సందర్భంగా మోదీ మను భాకర్‌తో పాటు గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకూ పారిస్‌లో పారాలింపిక్స్‌ జరగనున్న క్రమంలో ఇండియన్ అథ్లెట్స్‌కి ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. 

Also Read: Kolkata Doctor Murder: ట్రైనీ డాక్టర్‌ డైరీలో చివరి పేజీ, ఈ దారుణానికి కొద్ది గంటల ముందు ఏం రాసుకుందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Embed widget