అన్వేషించండి

G20 Summit: G20 లో మోదీ లేకుండానే అమెరికా ఎమర్జెన్సీ మీటింగ్, ఎందుకు పక్కన పెట్టారు?

G20 Summit: ప్రధాని మోదీకి ఆహ్వానించకుండానే G20 లో అమెరికా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవటంపై సందేహాలు తలెత్తుతున్నాయి.

G20 Summit: 

మీటింగ్ అందుకేనా..?

తూర్పు పోలండ్ లో జరిగిన క్షిపణి దాడి విధ్వంసం పై చర్చించేందుకు ఇండోనేషియాలోని బాలిలో జరిగిన G20 సదస్సులో అమెరికా ఓ ఎమర్జెన్సీ మీటింగ్ ను నిర్వహించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగానే ఉక్రెయిన్ సరిహద్దుల్లోని పోలాండ్ భూభాగంపై రష్యా క్షిపణి ప్రయోగాలు చేస్తోందని అమెరికా అనుమానిస్తోంది. ఇందుకోసమే జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నాటో దేశాలు మరికొన్ని దేశాల అధినేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రష్యాను నిలువరించాల్సిన అవసరం సహా ఉక్రెయిన్, పోలాండ్ లకు సైన్యం పరంగా ఎలాంటి సహకారం అందించాలి...ఇంకా అక్కడి ప్రజల ప్రాణాలకు పొంచి ముప్పును తప్పించాల్సిన బాధ్యతలు, దౌత్యపరంగా అవలంబించాల్సిన విధానాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశంలో చర్చించినట్లు వైట్ హౌస్ తెలిపింది. ఇంత వరకూ బాగానే ఉన్నా ఈ సమావేశానికి భారత్ కు ఆహ్వానం అందకపోవటంపై పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. జీ20 కూటమి అధ్యక్షుడిగా భారత ప్రధాని నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన టైం లోనే అక్కడే ఇలాంటి ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవటం...పైగా మోడీని పిలవకపోవటంపై వేర్వేరు వార్తలు వచ్చాయి.

ఎన్నో ప్రశ్నలు..

విశ్వగురు అని చెప్పుకునే ప్రధాని మోదీ ని అమెరికా అధ్యక్షుడు పక్కనపెట్టారంటూ ప్రొఫెసర్ అశోక్ శ్వైన్ ట్వీట్ చేశారు. అమెరికా నిజంగానే భారత్ ను పక్కనపెట్టిందా లేదా మరే దైనా కారణం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎమర్జెన్సీ మీటింగ్ తర్వాత ప్రెసిడెంట్ బైడెన్ మీడియా ఇంటరాక్షన్ ను వైట్ హౌస్ పబ్లిష్ చేసింది. అందులో పోలండ్, ఉక్రెయిన్ లకు ఎలా మద్దతుగా నిలబడాలన్న అంశంపై నాటో సభ్య దేశాలు, జీ7 దేశాల అధినేతలతో అమెరికా అధ్యక్షుడు సమావేశమైనట్లు ఉంది. ఇదే విషయాన్ని జో బిడైన్ ట్వీట్ కూడా చేశారు.

కొన్ని అనుమానాలు..

కేవలం నాటో దేశాల మీటింగ్ అయితే జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా ఆ మీటింగ్ లో ఉండటం.. జీ7 దేశాల మీటింగ్ అయితే..జీ20 సదస్సు జరుగుతున్నప్పుడు వేరే కూటమిల సదస్సులు నిర్వహించటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . అయితే వైట్ హౌస్ కానీ, ఇటు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కానీ ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. అంతే కాదు ప్రధాని మోదీ జీ 20 దేశాల అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పక్కనే ఉన్నారు. ప్రధాని మోదీని ఆయన అభినందించారు కూడా. జీ20 అధినేతలంతా కలిసి మాంగ్రూవ్ ప్లాంటేషన్ చేసినప్పుడు మోదీ పక్కనే జో బైడెన్ ఉన్నారు. అంతే కాకుండా జీ20 కూటమి ప్రస్తుత అధ్యక్షుడు మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో తో  జో బైడెన్ ప్రత్యేకంగా కూడా సమావేశమయ్యారు. ఈ భేటీ ఇరు దేశాలకు మేలు చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేశారు.

Also Read: War Politics : రాజకీయ పార్టీల ధర్మయుద్ధాలన్నీ ఓట్ల కోసమేనా? రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయరా ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Big Relief For Fliers: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Karnataka Rains: కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
Kerala Assembly Elections 2026:కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Karnataka Rains: కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
Pithapuram Varma: పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
Fatty Liver : కాలేయ ఆరోగ్యం కోసం రోజూ 5 టిప్స్ ఫాలో అవ్వండి.. ఫ్యాటీ లివర్​ పూర్తిగా దూరమవుతుంది
కాలేయ ఆరోగ్యం కోసం రోజూ 5 టిప్స్ ఫాలో అవ్వండి.. ఫ్యాటీ లివర్​ పూర్తిగా దూరమవుతుంది
YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
Kerala Assembly Elections 2026:కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
Embed widget