By: Ram Manohar | Updated at : 20 May 2023 05:49 PM (IST)
ఉక్రెయిన్కి అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్ ముందుంటుందని ప్రధాని మోదీ జెలెన్స్కీకి హామీ ఇచ్చారు. (Image Credits: ANI)
Modi Meets Zelensky:
జెలెన్స్కీతో మోదీ భేటీ
జీ 7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలు పెట్టిన తరవాత ఈ ఇద్దరు నేతలు కలవడం ఇదే తొలిసారి. గతంలో చాలా సందర్భాల్లో ఉక్రెయిన్కి మద్దతుగా నిలిచిన భారత్..అటు రష్యాతోనూ మైత్రి కొనసాగించింది. ఈ రెండు దేశాలతో చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరించింది. అయితే...తామెప్పుడూ శాంతికే కట్టుబడి ఉంటామని ప్రధాని చాలా సార్లు చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ ఇదే విషయమై ప్రస్తావించారు. కొన్నిసార్లు ఫోన్ చేసి మరీ మాట్లాడారు. ఇప్పుడు జెలెన్స్కీతో నేరుగా భేటీ అయిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. ఇది అంతర్జాతీయ సమస్య అని వెల్లడించిన మోదీ...ఈ సమస్యని రాజకీయ కోణంలో చూడకూడదని తేల్చి చెప్పారు. ఇది కేవలం మానవతా దృష్టితో చూడాల్సిన విషయం అని స్పష్టం చేశారు.
"ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం కేవలం ఆ దేశానికే పరిమితం కాదు. ఇది ప్రపంచ సమస్య. పలు విధాల్లో ప్రపంచాన్ని ఇది ప్రభావితం చేసింది. అలా అని ఈ సమస్యని ఆర్థిక, రాజకీయ కోణంలో చూడడం సరికాదు. నా వరకూ ఇది కచ్చితంగా మానవతా దృష్టిలో ఆలోచించాల్సిన విషయం. మానవ విలువలు కాపాడడం కోసం ప్రయత్నించాల్సిన సందర్భమిది. యుద్ధం వల్ల ఎంత నష్టం జరుగుతుందో, ఆ బాధ ఎలా ఉంటుందో మా అందరి కన్నా మీకే (ఉక్రెయిన్ని ఉద్దేశిస్తూ) తెలుసు. గతేడాది భారత్కు చెందిన విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చారు. అక్కడి పరిస్థితులేంటో చెప్పినప్పుడు నాకు మీ కష్టాలేంటో తెలిసొచ్చింది. ఈ సమస్య పరిష్కారానికి భారత్ తరపున మీకు అన్ని విధాలా సహరించేందుకు సిద్ధంగా ఉన్నానని హామీ ఇస్తున్నాను"
- ప్రధాని నరేంద్ర మోదీ
PM Narendra Modi held talks with Ukrainian President Volodymyr Zelensky during the G-7 Summit in #Hiroshima, Japan
— ANI (@ANI) May 20, 2023
(Pics source: PMO) pic.twitter.com/Uh9k1SLGTE
#WATCH | Japan: Prime Minister Narendra Modi meets Ukrainian President Volodymyr Zelensky in Hiroshima, for the first time since the Russia-Ukraine conflict, says, "Ukraine war is a big issue in the world. I don't consider it to be just an issue of economy, politics, for me, it… pic.twitter.com/SYCGWwhZcb
— ANI (@ANI) May 20, 2023
గత నెల ఉక్రెయిన్ డిప్యుటీ విదేశాంగ మంత్రి ఎమైన్ జపరోవా భారత్ పర్యటనకు వచ్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన ఏడాదిన్నర తరవాత ఉక్రెయిన్కి చెందిన ఓ లీడర్ భారత్కు రావడం అదే తొలిసారి. యుద్ధాన్ని ఆపడంలో సహకరించి "విశ్వగురు" అనిపించుకోవాలని అప్పట్లోనే ఆమె ప్రధానికి విన్నవించారు. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్తో తరచూ ఫోన్లో మాట్లాడుతూ వచ్చారు ప్రధాని మోదీ. G-20 సదస్సులోనూ ఆయనతో మాట్లాడారు. ఈ విషయంలో భారత్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎటువైపూ నిలబడకుండా "శాంతినే కోరుకుంటున్నాం" అని చెబుతోంది.
Also Read: Modi Hugs Biden: జో బైడెన్ని కౌగిలించుకున్న ప్రధాని మోదీ, ఆత్మీయంగా పలకరింపు
Indira Gandhi Assassination: ఇందిరా గాంధీ హత్యోదంతంపై కెనడాలో వేడుకలు, వార్నింగ్ ఇచ్చిన జైశంకర్
Gautam Adani: బాస్ ఈజ్ బ్యాక్, మళ్లీ పాత పొజిషన్లోకి వచ్చిన అదానీ
Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!
Arvind Kejriwal's Speech: బీజేపీ కార్యకర్తలకు దండం పెట్టిన కేజ్రీవాల్, నా మాట వినండి అంటూ రిక్వెస్ట్
JoSAA 2023 Schedule: 'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్లో కాల్మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్
Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?
Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?
Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!