అన్వేషించండి

PM Modi: వయనాడ్‌లోని ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే, సహాయక చర్యలపై ఆరా

Wayanad: ప్రధాని నరేంద్ర మోదీ వయనాడ్‌లోని ప్రభావిత ప్రాంతాలపై ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆయనతో పాటు సీఎం పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేశ్ గోపీ ఉన్నారు.

PM Modi Wayanad Visit: ప్రధాని నరేంద్ర మోదీ వయనాడ్‌ చేరుకున్నారు. వాయుసేన హెలికాప్టర్‌లో కన్నూర్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిన ఆయన వయనాడ్‌లోని ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు. చూరల్‌మల, మందక్కై, పుంచిరిమట్టొం ప్రాంతాలను పర్యవేక్షించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌లో ఈ సర్వే చేశారు. ఉదయం 11.15 గంటలకు కన్నూర్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వాగతం పలికారు. ఆ తరవాత ఇద్దరూ కలిసి ప్రభావిత ప్రాంతాలపై ఏరియల్ సర్వే చేశారు. విజయన్‌తో పాటు కేంద్రమంత్రి సురేశ్ గోపీ కూడా మోదీ వెంట ఉన్నారు.

ఈ సర్వే పూర్తైన తరవాత కాల్పెట్టాలోని ఓ స్కూల్‌ వద్ద ల్యాండ్ కానున్నారు. అక్కడి నుంచి ప్రభావిత ప్రాంతాలను రోడ్డు మార్గంలో పరిశీలిస్తారు. ఇప్పటికే కేరళ ప్రభుత్వం రూ.2 వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే మోదీ ఇక్కడ పర్యటిస్తున్నారు. సహాయక చర్యలపైనా ఆయన ఆరా తీస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వరదల కారణంగా దెబ్బ తిన్న ప్రాంతాలను సందర్శిస్తారు. హాస్పిటల్స్‌లోని బాధితులనూ పరామర్శిస్తారు. ఈ పర్యటన పూర్తయ్యాక ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న చర్యలపై సమీక్షించనున్నారు. ఏరియల్ సర్వే తరవాత వయనాడ్‌లో ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ప్రధాని మోదీ. సహాయక చర్యలపై ఆరా తీశారు. ఉన్నతాధికారులు ఆయనకు రెస్క్కూ ఆపరేషన్ గురించి వివరించారు. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌తో పాటు కేంద్రమంత్రి సురేశో గోపీ ఆయనతో ఉన్నారు. (Also Read: Bangladesh: బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టుని చుట్టుముట్టిన ఆందోళనకారులు, గంటలో రాజీనామా చేయాలని చీఫ్ జస్టిస్‌కి అల్టిమేటం)

ఇటీవల వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడి 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. దాదాపు 150 మందికిపైగా వరదల్లో పడి కొట్టుకుపోయినట్టు అంచనా వేస్తున్నారు. చూరల్‌మల్, మందక్కై ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇళ్లన్నీ ధ్వంసమై చాలా మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతానికి వీళ్లంతా రిలీఫ్ క్యాంప్‌లలో తల దాచుకుంటున్నారు. ఇండియన్ ఆర్మీతో పాటు NDRF,SDRF సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. పలు చోట్ల రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. తాత్కాలికంగా బ్రిడ్జ్‌లు నిర్మించి రెస్క్యూ కొనసాగిస్తున్నారు. 

Also Read: Viral News: ట్రైనీ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం, ఆపై హత్య - శరీరమంతా లోతైన గాయాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget