అన్వేషించండి

Wayanad Tragedy: పినరయి వర్సెస్ అమిత్ షా, వయనాడ్‌ విపత్తుపై పొలిటికల్ వార్

Wayanad News: వయనాడ్‌ విపత్తుపై రాజకీయ రగడ మొదలైంది. ముందే హెచ్చరించామని అమిత్ షా చేసిన కామెంట్స్‌ని సీఎం పినరయి విజయన్ ఖండించారు.

Kerala Landslides: వయనాడ్‌లో విపత్తు ముంచుకొస్తుందని వారం రోజుల ముందే హెచ్చరించామని అమిత్ షా రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు. కేరళ ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే ఈ స్థాయిలో ప్రాణనష్టం జరిగిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై సీఎం పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. వాతావరణ మార్పులను అసలు ఊహించలేమని తేల్చి చెప్పారు. గతంలో ఈ స్థాయిలో వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదని, వాతావరణ మార్పులను కట్టడి చేసే చర్యలు చేపట్టాల్సిన అవసరముందని వెల్లడించారు. ఇలాంటిదేదో జరగగానే రాష్ట్ర ప్రభుత్వంపైనే తప్పంతా నెట్టేయడం సరికాదని అమిత్‌షాపై ఫైర్ అయ్యారు పినరయి విజయన్. బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూడొద్దంటూ చురకలు అంటించారు. 

"వాతావరణ మార్పులు ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేమన్నది కేంద్ర ప్రభుత్వం ఓసారి ఆలోచించాలి. గతంలో ఎప్పుడైనా ఈ స్థాయిలో వర్షపాతం నమోదవడం చూశామా..? కానీ ఇప్పుడు అది జరుగుతోంది కదా. అందుకే వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే విధంగా ఏవైనా చర్యలు చేపట్టాలి. విపత్తు రాగానే మాపైన తప్పు నెట్టేస్తారా. మీ బాధ్యత నుంచి తప్పించుకుంటారా. ఇది తప్పులు ఎంచాల్సిన సమయం కాదు"

- పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి 

ఏదైనా విపత్తు సంభవిస్తుందనుకుంటే వారం రోజుల ముందే హెచ్చరించే వ్యవస్థ భారత్ వద్ద ఉందని అమిత్ షా వెల్లడించారు. ఈ టెక్నాలజీ ఉన్న నాలుగు దేశాల్లో భారత్ కూడా ఉందని వివరించారు. దీనిపైనా పినరయి విజయన్ స్పందించారు. వయనాడ్‌లో 115-204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని హెచ్చరించారని, కానీ తరవాత 48 గంటల్లో 572 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయిందని తేల్చి చెప్పారు. కొండచరియలు విరిగి పడిన రోజు కూడా కేంద్రం కేవలం ఆరెంజ్ అలెర్ట్ మాత్రమే ఇచ్చిందని వివరించారు. ముందే తెలిసుంటే రెడ్ అలెర్ట్ ఇచ్చి ఉండొచ్చు కదా అని ప్రశ్నించారు. ఈ ప్రమాదం జరిగాక అప్పుడు రెడ్ అలెర్ట్ ఇచ్చారని చెప్పారు. ఇదే సమయంలో రెస్క్యూ ఆపరేషన్‌ గురించీ వివరించారు. ఇప్పటి వరకూ 144 మంది మృతదేహాలను గుర్తించినట్టు వెల్లడించారు. 191 మంది గల్లంతైనట్టు తెలిపారు. 

 

Also Read: Wayanad Landslides: వయనాడ్ విధ్వంసానికి కారణమిదే, మరో రెండు రోజుల పాటు ఇదే బీభత్సం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Dussehra 2024: అక్టోబర్ 3 నుంచి బెజవాడ దుర్గ గుడిలో దసరా నవరాత్రులు ప్రారంభం
అక్టోబర్ 3 నుంచి బెజవాడ దుర్గ గుడిలో దసరా నవరాత్రులు ప్రారంభం
Embed widget