అన్వేషించండి

NEET Row: లోక్‌సభలో నీట్‌పై చర్చకు డిమాండ్‌, అనుమతి ఇవ్వని స్పీకర్ - విపక్షాలు వాకౌట్

NEET Issue: నీట్ వ్యవహారంపై లోక్‌సభలో చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అందుకు స్పీకర్ అంగీకరించకపోవడం వల్ల విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.

NEET Row in Parliament: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన కాసపేటికే గందరగోళం నెలకొంది. నీట్‌పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటామని వెల్లడించారు. రాహుల్ గాంధీ మైక్ స్విచాఫ్ అవడంపైనా వివరణ ఇచ్చారు స్పీకర్. అయితే...ఎంత సేపటికీ నీట్‌పై చర్చకు అనుమతి ఇవ్వకపోవడం వల్ల విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అంతకు ముందు రాహుల్ గాంధీ నీట్‌ వివాదాన్ని ప్రస్తావించారు. పార్లమెంట్ వేదికగా దీనిపై ప్రభుత్వం ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నీట్‌ వ్యవహార ప్రాధాన్యతను అర్థం చేసుకుని సభలో చర్చకు అవకాశమివ్వాలని అన్నారు. కానీ..అందుకు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించలేదు. ఫలితంగా విపక్ష సభ్యులు నిరనస వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. రాహుల్ గాంధీ ఇప్పటికే నీట్‌ని పదేపదే సభలో చర్చకు తెస్తున్నారు. ఒకరోజంతా పూర్తిగా ఈ వివాదంపై చర్చించేందుకే కేటాయించాలని స్పీకర్‌ని కోరారు. 

"నీట్ వివాదంపై ఓ ప్రకటన చేయాలి. అది ఈ పార్లమెంట్ వేదికగానే జరగాలి. నీట్‌ వ్యవహారాన్ని అంత తేలిగ్గా తీసుకోలేదన్న భరోసా విద్యార్థులకు ప్రభుత్వమే ఇవ్వాలి. అందుకే పార్లమెంట్‌లో తప్పనిసరిగా చర్చ జరగాలి. అందుకే ఓ రోజంతా సభలో చర్చించాల్సిన అవసరముందని భావిస్తున్నాం"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ

 

దేశవ్యాప్తంగా నీట్ దుమారం..

నీట్‌ పేపర్ లీక్‌ దేశవ్యాప్తంగా దుమారం (NEET UGC Exam 2024) రేపింది. ఇప్పటికే మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎగ్జామ్‌ని పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ఏకంగా ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టింది. నీట్‌ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అయితే...ప్రభుత్వం మాత్రం (NEET Row) విచారణ కొనసాగుతోందని, నిందితులను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో మార్పులు చేయాల్సిన అవసరాన్ని గుర్తించినట్టు వెల్లడించింది. నీట్‌ ఎగ్జామ్‌ ఎలా నిర్వహించాలో కోరుతూ తల్లిదండ్రులను పలు సూచనలు,సలహాలు అడిగింది. త్వరలోనే NEET UGC ఎగ్జామ్‌ తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే ఇకపైన NEET ఎగ్జామ్‌ని ఆన్‌లైన్‌లో నిర్వహించాలనే యోచన చేస్తోంది. ఆన్‌లైన్‌లో పరీక్ష పెడితే పేపర్ లీక్‌లకు అవకాశముండదని భావిస్తోంది. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన చేసే అవకాశాలున్నాయి. పలువురు నిపుణులు కూడా ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారు. 

Also Read: New Criminal Laws: అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు, తొలి కేసు నమోదు చేసిన పోలీసులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
New Renault Duster: మార్చి 17న రెనాల్ట్ డస్టర్ లాంచింగ్‌.. కారు తయారీలో ఐఐటీ కాన్పూర్ కీలకపాత్ర.. ఫీచర్ల వివరాలు
మార్చి 17న రెనాల్ట్ డస్టర్ లాంచింగ్‌.. కారు తయారీలో ఐఐటీ కాన్పూర్ కీలకపాత్ర.. ఫీచర్ల వివరాలు
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Visa Interview Tips : వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలా? ముందుగానే ఇలా ప్రిపేర్ అవ్వండి, వీసా రిజెక్ట్ కాదు
వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలా? ముందుగానే ఇలా ప్రిపేర్ అవ్వండి, వీసా రిజెక్ట్ కాదు

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Iran War Effect On Vijayawada Hotels: విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
Embed widget