అన్వేషించండి

Pariksha Pe Charcha: ఫోన్‌లు పక్కన పెట్టి ప్రశాంతంగా నిద్రపోండి, పరీక్షా పే చర్చలో ప్రధాని సూచన

Pariksha Pe Charcha: ఇళ్లలో గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ విద్యార్థులకు సూచించారు.

PM Modi Pariksha Pe Charcha: ఇళ్లలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ల వాడకాన్ని తగ్గించాలంటూ ప్రధాని మోదీ సూచించారు. పరీక్షా పే చర్చ (Pariksha Pe Charcha Highlights) కార్యక్రమంలో విద్యార్థులకు ఈ సలహా ఇచ్చారు. ఇళ్లను no gadget zone గా మార్చుకోవాలని, కుటుంబ సభ్యులతో సమయం గడపాలని తెలిపారు. టెక్నాలజీ కారణంగా అందరికీ దూరమైపోకూడదని స్పష్టం చేశారు. లైఫ్‌స్టైల్‌ని మార్చుకోవాలని...ఆరోగ్యకరమైన పోటీ ఇచ్చే విధంగా మనసుని సన్నద్ధం చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్డెట్స్‌కే కాకుండా మన శరీరాలనూ రీఛార్జ్ చేసుకోవాలంటూ విద్యార్థులకు అర్థమయ్యే భాషలో వివరించారు ప్రధాని మోదీ. గ్యాడ్జెట్స్‌ని పక్కన పెట్టి కంటినిండా నిద్రపోవాలని అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర అవసరమని తెలిపారు. 

"ఇళ్లలో గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించండి. కుటుంబ సభ్యులతో హాయిగా గడపండి. టెక్నాలజీ మీ మధ్య దూరం పెంచకూడదు. గ్యాడ్జెట్స్‌ని రీఛార్జ్ చేస్తున్నాం. మరి మన శరీరానికీ ఇలాంటి రీఛార్జ్ అవసరమే కదా. మొబైల్స్‌ని పక్కన పెట్టి కంటినిండా నిద్రపోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర అవసరం. మీరు మీ కుటుంబ సభ్యులతో కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవసరం ఏముంటుంది..? మీరు మాట్లాడుకోడానికి అవి అవసరం లేదు. నేరుగా మాట్లాడుకోండి"

- ప్రధాని నరేంద్ర మోదీ 

 

విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్న అంశాన్నీ ప్రస్తావించారు ప్రధాని మోదీ. కొందరు తమకు తామే అనవసరంగా ఒత్తిడి ఫీల్ అవుతారని చెప్పారు. కొన్నిసార్లు తల్లిదండ్రుల వల్లా విద్యార్థులపై ఈ ఒత్తిడి పెరుగుతుందని అన్నారు.

"కొన్ని సార్లు విద్యార్థులు అనవసరంగా ఒత్తిడికి గురవుతారు. అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదని బాధ పడతారు. కానీ మీరు పరీక్షలకు సన్నద్ధమవుతున్నప్పుడు చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోండి. క్రమంగా మీ పర్‌ఫార్మెన్స్‌ని పెంచుకోండి. ఆ తరవాతే పరీక్షలకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోగలుగుతారు. పరీక్షా పే చర్చ కార్యక్రమం నాకు కూడా ఓ పరీక్ష లాంటిదే"

- ప్రధాని నరేంద్ర మోదీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Iran War Updates: దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
50,000 జీతంతో Land Rover Defender కారు మెయింటైన్ చేయవచ్చా? దాని మైలేజ్ ఎంత
50,000 జీతంతో Land Rover Defender కారు మెయింటైన్ చేయవచ్చా? దాని మైలేజ్ ఎంత

వీడియోలు

Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Anakalapalle Latest News:
"మా ఫుడ్‌తో పిండివంటలు చేసుకుంటున్నార్‌ సార్" బీసీ హాస్టల్‌ దుస్థితిపై లోకేష్‌కు విద్యార్థుల ఫిర్యాదు! ప్రభుత్వం సీరియస్
Dinner Timings : సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
Srikakulam Latest News: ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
Embed widget