అన్వేషించండి

Pakistan Eid: ప్రపంచమంతా పండుగ చేసుకుంది, పాక్‌ మాత్రం పస్తులుంది - ఈద్ రోజునా అవే కష్టాలు

Pakistan Eid: పాకిస్థాన్‌లో ఈ ఏడాది రంజాన్ సందడి అసలు కనిపించలేదు.

Pakistan Eid: 


స్వీట్‌లు కూడా కొనలేక..

ప్రపంచంలోని ముస్లింలు అంతా రంజాన్ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశారు. బంధువులు, మిత్రులు అంతా కలిసి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచి పెట్టారు. కానీ ఆ దేశంలో మాత్రం ప్రజలు పస్తులున్నారు. ఆకలిని తట్టుకోలేక నీరసించిపోయి నిద్రలోకి జారుకున్నారు. పండుగ నాడు నోరు తీపి చేసుకోడానికీ వీల్లేకుండా పోయింది. దాయాది దేశం పాకిస్థాన్‌లోని దుస్థితి ఇది. ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరుకుని నానా అవస్థలు పడుతున్నారు అక్కడి పౌరులు. ఒక్క పూట తిండికే కష్టంగా ఉంది. అగ్గిపెట్టె నుంచి పెట్రోల్ వరకూ అన్ని ధరలూ దారుణంగా పెరిగాయి. నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. వీటిని కొనే స్థోమత చాలా మంది ఆకలితోనే బతుకుతున్నారు. రేషన్ షాప్‌లు, పెట్రోల్‌ బంక్‌ల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. అంత ఎదురు చూసినా దొరుకుతుందన్న నమ్మకం లేదు. ఇప్పటికే చాలా బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. రేషన్ షాపుల్లోనూ ఏమీ మిగలడం లేదు. 

రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం 

తగినంత సరుకులు లేక గంటల పాటు ఎదురు చూసి ఖాళీ సంచులతో ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు పౌరులు. ఇక గ్యాస్ సిలిండర్‌లను ప్రభుత్వమే అధికారికంగా నిలిపివేసింది. విదేశాల నుంచి చమురు కొనుగోలు చేసి తెచ్చుకునే ఆర్థిక స్తోమత ప్రస్తుతానికి పాక్‌కి లేదు. ఫారెక్స్ నిల్వలూ దారుణంగా పడిపోయాయి. పాకిస్థాన్ మీడియా కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది. పాక్ చరిత్రలోనే ఎప్పుడూ చూడనంతగా ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో నమోదైనట్టు స్పష్టం చేసింది. గత మూడు నెలల్లోనే ద్రవ్యోల్బణం రేట్ 48%కి పెరిగింది. సోషల్ మీడియాలోనూ పాక్‌ దారిద్ర్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

"మేం ఎలా రంజాన్ జరుపుకోగలం..? ఈ ప్రభుత్వంతో దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు. ఆ సర్కార్ ఉన్నా లేనట్టే ఉంది. 75 ఏళ్ల రికార్డు అధిగమించి మరీ ద్రవ్యోల్బణం పెరుగుతోంది" 

- స్థానిక పౌరులు, పాకిస్థాన్

గతేడాది ఈద్ రోజున పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.150గా ఉంది. అదే లీటర్ పెట్రోల్ ధర ఈ రంజాన్‌ పండుగ నాటికి రూ.282కి పెరిగింది. డీజిల్ లీటర్ ధర రూ.293. ఇక గ్యాస్‌ విషయానికొస్తే కేజీకి రూ.300 చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆహార పదార్థాల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. కిలో చికెన్ ధర రూ.1000కి పైనే. నెయ్యి ధర రూ.2595 నుంచి రూ.3 వేలకు పెరిగింది. లీటర్ పాల ధర రూ.100గా ఉంది. పాకిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. ఇప్పటికే ఆ దేశం పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. దానికి తోడు రోజుకో సమస్య వెంటాడుతోంది. సోమవారం పాకిస్థాన్‌ వ్యాప్తంగా విద్యుత్‌ సమస్య తలెత్తింది. నేషనల్ గ్రిడ్‌లో ఏర్పడ్డ సమస్యల కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తింది. ఇప్పుడు వందల మంది ఉద్యోగాలు లేక రోడ్డున పడుతున్నారు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో పొరుగు దేశం పాకిస్థాన్ అల్లాడుతోంది. 

Also Read: World War II Ship: రెండో ప్రపంచ యుద్ధంలో మునిగిన ఓడ, ఇన్నాళ్లకు దొరికింది - వైరల్ న్యూస్

టాప్ హెడ్ లైన్స్

భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Embed widget