అన్వేషించండి

NTPC Protest: రైలును తగలబెట్టిన అభ్యర్థులు.. ఆర్‌ఆర్‌బీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆగ్రహం

ఆర్‌ఆర్‌బీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అభ్యర్థులు చేసిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. బిహార్‌లో ఓ రైలుకు నిరసకారులు నిప్పుపెట్టారు.

బిహార్‌లో నిరుద్యోగులు చేసిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆర్​ఆర్​బీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఉద్యోగార్థులు ఆందోళనలు చేపడుతున్నారు. అయితే ఈరోజు గయాలో రైలు పట్టాలపై ఆందోళనలు చేపట్టిన ఉద్యోగార్థుల్లో కొందరు హింసకు పాల్పడ్డారు. ఆగి ఉన్న భభువా-పట్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టారు.

నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని గయా ఎస్‌ఎస్‌పీ తెలిపారు.

" ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. నిరసనకారులు.. రైలుకు నిప్పంటించారు. ఈ పని చేసిన కొంతమందిని మేం గుర్తించాం. ఎవరో చెప్పిన మాటలకు ప్రభావితులై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని ఉద్యోగార్థులను మేం కోరుతున్నాం. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఇప్పటికే కమిటీని నియమించింది.                                                             "
-ఆదిత్య కుమార్, గయా ఎస్‌ఎస్‌పీ

రద్దు చేయాల్సిందే..

మరోవైపు ఆందోళనకారులు సీబీటీ 2 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

" సీబీటీ 2 పరీక్ష నోటిఫికేషన్ ఇంకా రాలేదు. 2019లో ఇచ్చిన రైల్వే పరీక్ష నోటిఫికేషన్‌లోనూ ఎలాంటి పురోగతి లేదు. పరీక్ష ఫలితాలు ఇంకా రాలేదు. అందుకే సీబీటీ 2 పరీక్షను రద్దు చేసి ఫలితాలను విడుదల చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం.                                                      "
-ఆందోళనకారులు

అలా చేయొద్దు..

ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్ స్పందించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని నిరసనకారులకు తెలిపారు.

" మీ ఆస్తుల్ని మీరే ధ్వంసం చేసుకోవద్దు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే చట్టబద్ధంగా చర్యలు తప్పవు. సమస్య పరిష్కారానికి అంతా ప్రయత్నిస్తున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే అభ్యర్థులు సరైన మార్గంలో వాటిని ప్రభుత్వం దృష్టి తీసుకురావాలి. ఇలా చేయకూడదు.                                                   "
-అశ్వినీ కుమార్ వైష్ణవ్, రైల్వే మంత్రి 

అంతకుముందు.. ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ, లెవల్​ 1 పరీక్షలను నిలిపివేస్తున్నట్లు భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది. రైల్వేలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిరసిస్తూ పలుచోట్ల ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

రాహుల్ ఆగ్రహం..

ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరీక్షా విధానాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తోన్న యువతకు మద్దతు పలికారు రాహుల్ గాంధీ. తమ హక్కుల కోసం గళాన్ని విప్పే స్వేచ్ఛ యువతకు ఉందన్నారు.

Also Read: Republic Day 2022 Parade: కాశీ విశ్వనాథుని శోభ.. సాంస్కృతిక సౌరభం.. పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా యూపీ శకటం

Also Read: Republic Day 2022 Wishes: సంపూర్ణ స్వేచ్ఛను సాధించుకున్నాం.. నేతల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Embed widget