అన్వేషించండి

NGT : తెలంగాణకు భారీ జరిమానా గండం ... ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకింగా ఎన్జీటీకి నివేదిక !

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా ఎన్జీటీ కమిటీ తేల్చింది. రూ.3 కోట్ల 70 లక్షల జరిమానా వేయాలని సిఫార్సు చేసింది.


పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై పరిశీలనకు ఏర్పాటైన సంయుక్త కమిటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ ఉల్లంఘనలకు పాల్పడిందని నిర్ధారించింది. అనుమతులు లేకపోయినప్పటికీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి కాంపోనెంట్‌ సహా సాగునీటి ఎత్తిపోతల పథకం నిర్మాణం కొనసాగుతోందని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ నియమించిన సంయుక్త కమిటీ నిర్ధారించింది  తప్పుడు నివేదిక అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించాలని కమిటీ సిఫార్సు చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 3 కోట్ల 70 లక్షల జరిమానా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని సిఫారసు చేసింది. 

Also Read : తెలుగు అకాడమీ ఉద్యోగులా ? బ‌్యాంక్ స్టాఫా ? కోట్లు కొట్టేసిందెవరు ?

పర్యావరణ అనుమతులు లేకుండానే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు రైతులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నిజానిజాల నిర్ధారణకు ట్రైబ్యునల్‌ ఈ సంయుక్త కమిటీని గతంలో నియమించారు. గత నెలలో ప్రాజెక్టు కింద చేపడుతున్న నార్లాపూర్‌, ఏదుల, వెట్టెం, కరివెన, ఉద్దండపూర్‌ రిజర్వాయర్లను కమిటీ సందర్శించింది. తాగునీటి కాంపోనెంట్‌ సహా సాగునీటి ఎత్తిపోతల పథకాన్ని కూడా చేపడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రస్తుతానికి తాగునీటి ప్రాజెక్టు అని, దానికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. సాగునీటి పనులు చేపట్టినప్పుడు అనుమతులు తీసుకుంటామని గతంలో మరో కేసులో ఎన్‌జీటీకి తెలిపింది.  

Also Read: TS Assembly: మీ మాటలు వింటే జాలిగా ఉంది.. కేసీఆర్ అసంతృప్తి, అందరికీ అన్ని వివరాలిస్తామని వెల్లడి
 
ఒక్క పర్యావరణ అనుమతుల విషయంలోనే కాకుండా అసలు ఆ ప్రాజెక్టే అక్రమం అని ఏపీ ప్రభుత్వం కూడా కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టుపై కర్ణాటకకు కూడా అభ్యంతరాలు ఉన్నాయి.  కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు, హోంశాఖకు కర్ణాటక ఫిర్యాదు చేసింది.  ఎగువ రాష్ట్రానికి మిగులు జలాలు వాడుకునే హక్కు లేదని మిగులు జలాలపై ఆధారపడి పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను చేపట్టరాదని కర్ణాటక వాదిస్తోంది. 

Also Read: Huzurabad Government Expenditure : హుజురాబాద్‌ ఉపఎన్నిక చాలా కాస్ట్‌లీ గురూ ! ప్రభుత్వం.. పార్టీల ఖర్చు ఎంతో తెలుసా ?

అయితే అన్ని అనుమతులతోనే నిర్మిస్తున్నామని తెలంగాణ చెబుతోంది. పాలమూరు ఎత్తిపోతలకు అనుమతిస్తూ 2013 ఆగస్టు 8న జీవో నెంబర్‌ 72, డిండి ఎత్తిపోతలకు అనుమతిస్తూ 2007 జూలై 7న జీవో నెంబర్‌ 159ను అప్పటి ప్రభుత్వాలు జారీ చేశాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ కారణంగా ప్రాజెక్టు పనులను చురుగ్గా నిర్వహిస్తారు. 

  Also Read : ఏపీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోండి... ఎన్జీటీని కోరిన తెలంగాణ...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget