అన్వేషించండి

NGT : తెలంగాణకు భారీ జరిమానా గండం ... ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకింగా ఎన్జీటీకి నివేదిక !

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా ఎన్జీటీ కమిటీ తేల్చింది. రూ.3 కోట్ల 70 లక్షల జరిమానా వేయాలని సిఫార్సు చేసింది.


పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై పరిశీలనకు ఏర్పాటైన సంయుక్త కమిటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ ఉల్లంఘనలకు పాల్పడిందని నిర్ధారించింది. అనుమతులు లేకపోయినప్పటికీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి కాంపోనెంట్‌ సహా సాగునీటి ఎత్తిపోతల పథకం నిర్మాణం కొనసాగుతోందని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ నియమించిన సంయుక్త కమిటీ నిర్ధారించింది  తప్పుడు నివేదిక అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించాలని కమిటీ సిఫార్సు చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 3 కోట్ల 70 లక్షల జరిమానా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని సిఫారసు చేసింది. 

Also Read : తెలుగు అకాడమీ ఉద్యోగులా ? బ‌్యాంక్ స్టాఫా ? కోట్లు కొట్టేసిందెవరు ?

పర్యావరణ అనుమతులు లేకుండానే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు రైతులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నిజానిజాల నిర్ధారణకు ట్రైబ్యునల్‌ ఈ సంయుక్త కమిటీని గతంలో నియమించారు. గత నెలలో ప్రాజెక్టు కింద చేపడుతున్న నార్లాపూర్‌, ఏదుల, వెట్టెం, కరివెన, ఉద్దండపూర్‌ రిజర్వాయర్లను కమిటీ సందర్శించింది. తాగునీటి కాంపోనెంట్‌ సహా సాగునీటి ఎత్తిపోతల పథకాన్ని కూడా చేపడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రస్తుతానికి తాగునీటి ప్రాజెక్టు అని, దానికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. సాగునీటి పనులు చేపట్టినప్పుడు అనుమతులు తీసుకుంటామని గతంలో మరో కేసులో ఎన్‌జీటీకి తెలిపింది.  

Also Read: TS Assembly: మీ మాటలు వింటే జాలిగా ఉంది.. కేసీఆర్ అసంతృప్తి, అందరికీ అన్ని వివరాలిస్తామని వెల్లడి
 
ఒక్క పర్యావరణ అనుమతుల విషయంలోనే కాకుండా అసలు ఆ ప్రాజెక్టే అక్రమం అని ఏపీ ప్రభుత్వం కూడా కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టుపై కర్ణాటకకు కూడా అభ్యంతరాలు ఉన్నాయి.  కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు, హోంశాఖకు కర్ణాటక ఫిర్యాదు చేసింది.  ఎగువ రాష్ట్రానికి మిగులు జలాలు వాడుకునే హక్కు లేదని మిగులు జలాలపై ఆధారపడి పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను చేపట్టరాదని కర్ణాటక వాదిస్తోంది. 

Also Read: Huzurabad Government Expenditure : హుజురాబాద్‌ ఉపఎన్నిక చాలా కాస్ట్‌లీ గురూ ! ప్రభుత్వం.. పార్టీల ఖర్చు ఎంతో తెలుసా ?

అయితే అన్ని అనుమతులతోనే నిర్మిస్తున్నామని తెలంగాణ చెబుతోంది. పాలమూరు ఎత్తిపోతలకు అనుమతిస్తూ 2013 ఆగస్టు 8న జీవో నెంబర్‌ 72, డిండి ఎత్తిపోతలకు అనుమతిస్తూ 2007 జూలై 7న జీవో నెంబర్‌ 159ను అప్పటి ప్రభుత్వాలు జారీ చేశాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ కారణంగా ప్రాజెక్టు పనులను చురుగ్గా నిర్వహిస్తారు. 

  Also Read : ఏపీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోండి... ఎన్జీటీని కోరిన తెలంగాణ...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget