అన్వేషించండి

NGT : తెలంగాణకు భారీ జరిమానా గండం ... ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకింగా ఎన్జీటీకి నివేదిక !

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా ఎన్జీటీ కమిటీ తేల్చింది. రూ.3 కోట్ల 70 లక్షల జరిమానా వేయాలని సిఫార్సు చేసింది.


పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై పరిశీలనకు ఏర్పాటైన సంయుక్త కమిటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ ఉల్లంఘనలకు పాల్పడిందని నిర్ధారించింది. అనుమతులు లేకపోయినప్పటికీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి కాంపోనెంట్‌ సహా సాగునీటి ఎత్తిపోతల పథకం నిర్మాణం కొనసాగుతోందని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ నియమించిన సంయుక్త కమిటీ నిర్ధారించింది  తప్పుడు నివేదిక అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించాలని కమిటీ సిఫార్సు చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 3 కోట్ల 70 లక్షల జరిమానా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని సిఫారసు చేసింది. 

Also Read : తెలుగు అకాడమీ ఉద్యోగులా ? బ‌్యాంక్ స్టాఫా ? కోట్లు కొట్టేసిందెవరు ?

పర్యావరణ అనుమతులు లేకుండానే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు రైతులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నిజానిజాల నిర్ధారణకు ట్రైబ్యునల్‌ ఈ సంయుక్త కమిటీని గతంలో నియమించారు. గత నెలలో ప్రాజెక్టు కింద చేపడుతున్న నార్లాపూర్‌, ఏదుల, వెట్టెం, కరివెన, ఉద్దండపూర్‌ రిజర్వాయర్లను కమిటీ సందర్శించింది. తాగునీటి కాంపోనెంట్‌ సహా సాగునీటి ఎత్తిపోతల పథకాన్ని కూడా చేపడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రస్తుతానికి తాగునీటి ప్రాజెక్టు అని, దానికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. సాగునీటి పనులు చేపట్టినప్పుడు అనుమతులు తీసుకుంటామని గతంలో మరో కేసులో ఎన్‌జీటీకి తెలిపింది.  

Also Read: TS Assembly: మీ మాటలు వింటే జాలిగా ఉంది.. కేసీఆర్ అసంతృప్తి, అందరికీ అన్ని వివరాలిస్తామని వెల్లడి
 
ఒక్క పర్యావరణ అనుమతుల విషయంలోనే కాకుండా అసలు ఆ ప్రాజెక్టే అక్రమం అని ఏపీ ప్రభుత్వం కూడా కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టుపై కర్ణాటకకు కూడా అభ్యంతరాలు ఉన్నాయి.  కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు, హోంశాఖకు కర్ణాటక ఫిర్యాదు చేసింది.  ఎగువ రాష్ట్రానికి మిగులు జలాలు వాడుకునే హక్కు లేదని మిగులు జలాలపై ఆధారపడి పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను చేపట్టరాదని కర్ణాటక వాదిస్తోంది. 

Also Read: Huzurabad Government Expenditure : హుజురాబాద్‌ ఉపఎన్నిక చాలా కాస్ట్‌లీ గురూ ! ప్రభుత్వం.. పార్టీల ఖర్చు ఎంతో తెలుసా ?

అయితే అన్ని అనుమతులతోనే నిర్మిస్తున్నామని తెలంగాణ చెబుతోంది. పాలమూరు ఎత్తిపోతలకు అనుమతిస్తూ 2013 ఆగస్టు 8న జీవో నెంబర్‌ 72, డిండి ఎత్తిపోతలకు అనుమతిస్తూ 2007 జూలై 7న జీవో నెంబర్‌ 159ను అప్పటి ప్రభుత్వాలు జారీ చేశాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ కారణంగా ప్రాజెక్టు పనులను చురుగ్గా నిర్వహిస్తారు. 

  Also Read : ఏపీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోండి... ఎన్జీటీని కోరిన తెలంగాణ...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABPMadhavi Latha vs Asaduddin Owaisi |  పాతబస్తీలో కొడితే దేశవ్యాప్తంగా రీసౌండ్ వస్తుందా..? | ABPAllari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Embed widget