అన్వేషించండి

Navi Soch Nava Punjab Virtual Rally: పంజాబ్ లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ... నవీ సోచ్ నవ పంజాబ్ పేరిట వర్చువల్ ర్యాలీ

పంజాబ్ లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. రాహుల్ గాంధీ పంజాబ్ లో జలంధర్ లో నవీ సోచ్ నవ పంజాబ్ వర్చువల్ ర్యాలీని ప్రారంభించారు. ఆ ర్యాలీలో పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ పాల్గొన్నారు.

పంజాబ్ లో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది.  ‘నవీ సోచ్‌ నవ పంజాబ్‌’ పేరిట వర్చువల్‌ ర్యాలీ చేపట్టింది.  ఈ ర్యాలీని కాంగ్రెస్ ఇటీవల కాలంలో అత్యంత విజయవంతమైన డిజిటల్ ర్యాలీలలో ఒకదానిని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీలోని వివిధ శాఖలు పూర్తి సమన్వయంతో గ్రాండ్ వర్చువల్ ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొంది. పంజాబ్‌లోని జలంధర్‌లోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఈ ర్యాలీని ప్రారంభించారు. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇతర కాంగ్రెస్ నాయకులు ఈ ర్యాలీలో పాల్గొ్న్నారు. కాంగ్రెస్ నేతలు ఈ ర్యాలీలో ప్రసంగించారు. జలంధర్ వేదిక ప్రారంభించిన డిజిటల్ ర్యాలీని రాష్ట్రంలోని 117 అసెంబ్లీ నియోజకవర్గాలు, పంజాబ్‌లోని 22 జిల్లా కేంద్రాల్లో ఎల్ఈడీల ద్వారా కనెక్ట్ చేశారు. ఇక్కడ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 300 మంది వరకు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ డిజిటల్ ర్యాలీని వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒకే సమయంలో 50,000 మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించారు. ఇప్పటికే 400000 కంటే ఎక్కువ మంది సోషల్ మీడియాలో 30 వేల కామెంట్స్, 9000 షేర్ల చేశారని కాంగ్రెస్ తెలిపింది. ఈ ర్యాలీ జరిగిన రెండు గంటల్లోనే 9 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారని కాంగ్రెస్ పేర్కొంది. ఇది దేశంలోనే అత్యంత విజయవంతమైన హైబ్రిడ్ వర్చువల్ ర్యాలీ అని  వెల్లడించింది. 

పంజాబ్ లో బిజీబిజీగా రాహుల్ 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం పంజాబ్‌లో ఒక రోజు పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. రాహుల్ గాంధీతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఉన్నారు. స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన తర్వాత రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే 117 మంది అభ్యర్థులతో కలిసి దుర్గియానా మందిర్, భగవాన్ వాల్మీకి తీర్ లో పూజలు చేశారు. గాంధీ ఆ తర్వాత రోడ్డు మార్గంలో జలంధర్‌కు వెళ్లారు. అక్కడ జలంధర్‌లోని మిథాపూర్‌లోని వైట్ డైమండ్‌లో ఏర్పాటు చేసిన వర్చువల్ ర్యాలీ "నవీ సోచ్ నవ పంజాబ్"లో పాల్గోని ప్రసంగించారు. ఈ నెల ప్రారంభంలో ఎన్నికల సంఘం భౌతిక ర్యాలీలపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం తర్వాత రాహుల్ గాంధీ తొలిసారిగా పర్యటించారు. ఫిబ్రవరి 20న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget