అన్వేషించండి

Amit Shah: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల్ని ఏరేశాం, హోం మంత్రి అమిత్‌షా కామెంట్స్

Amit Shah: ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక దేశ అంతర్గత భద్రత బలోపేతమైందని హోం మంత్రి అమిత్‌షా అన్నారు.

Amit Shah: 

దిల్లీలో కాన్ఫరెన్స్..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో నేషనల్ సెక్యూరిటీస్ స్ట్రాటెజీస్ కాన్ఫరెన్స్-2022 సమావేశం దిల్లీలో జరిగింది. ప్రధాని మోదీ దేశ భద్రతా వ్యవస్థను ఎంత బలోపేతం చేస్తున్నారో ఈ మీటింగ్‌లో షా ప్రస్తావించారు. రక్షణను పటిష్ఠం చేసేందుకు చేపట్టిన చర్యలనూ చర్చించారు. అంతర్గత భద్రతలో ఎప్పటి నుంచో వేధిస్తున్న మూడు ముఖ్యమైన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నట్టు చెప్పారు. రెండ్రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు...గురువారం ముగిశాయి. సెంట్రల్ ఏజెన్సీల అధిపతులతో పాటు..సీఏపీఎఫ్‌లు, సీపీఓలు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డీజీపీ కాన్ఫరెన్స్‌ను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు 
జరుగుతున్నాయని అమిత్‌ షా వెల్లడించారు. అన్ని రాష్ట్రాలు జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లోని డీజీపీలు తమ ఏరియాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. సవాళ్లు ఎదుర్కొనే సమర్థత అందరికీ ఉందని చెప్పారు. 

ఉగ్రవాదాన్ని అణిచివేయటంలో విజయం సాధించాం: అమిత్ షా

జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాదాన్ని అణిచివేయటంలో విజయం సాధించామని హోం మంత్రి అమిత్ షా అన్నారు. అంతే కాదు. ఈశాన్య రాష్ట్రాల్లోని యూజీ గ్రూపులను, తీవ్రమైన వామపక్ష భావజాలాన్ని కంట్రోల్ చేయగలిగామని స్పష్టం చేశారు. "ప్రధాని మోదీ నేతృత్వంలో కొత్త చట్టాలు తీసుకొచ్చాం. రాష్ట్రాలతో సమన్వయం పెరుగుతోంది. భద్రతకు అవసరమైన నిధుల కేటాయింపు కూడా పెరిగింది. వీలైనంత మేర టెక్నాలజీని వినియోగిస్తున్నాం" అని తెలిపారు. "డ్రగ్స్ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. దొరికిన వాటిని సీజ్ చేయటం కాదు. పూర్తిగా డ్రగ్ నెట్‌వర్క్‌ మూలాలను గుర్తించటమే కీలకం" అని వివరించారు. "నేరాలకు సంబంధించిన డేటాబేస్‌ను కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తోంది. సెక్యూరిటీని పటిష్ఠం చేసేందుకు 5G టెక్నాలజీని వినియోగించే ప్రయత్నాలూ జరుగుతున్నాయి" అని చెప్పారు. 

ఆగని దాడులు..

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అణిచివేశామని అమిత్ షా చెబుతున్నా..అక్కడ దాడులు మాత్రం ఆగటం లేదు. కశ్మీరీ పండిట్‌లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు. 1990ల్లో కశ్మీర్‌ నుంచి వలస వెళ్లని పండిట్‌లు అంతా కలిసి కశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి (KPSS)ను ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల జరుగుతున్న ఘటనలపై ఈ సభ్యులు స్పందించారు. "కశ్మీర్‌ లోయలోని పండిట్‌లందరినీ వెతికి మరీ చంపేస్తాం అనే సంకేతాన్ని టెర్రరిస్టులు ఇస్తున్నారు" అని ఆందోళన చెందుతున్నారు. "లోయలోని కశ్మీరీ పండిట్‌లు అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వరుస దాడులతో టెర్రరిస్ట్‌ల లక్ష్యమేంటో స్పష్టంగా తెలుస్తోంది" అని KPSS ఛైర్మన్ సంజయ్ టిక్కూ అన్నారు. కొందరు గ్రౌండ్‌ లెవెల్‌లో టెర్రరిస్టుల కోసం పని చేస్తూ కశ్మీరీ పండిట్‌ల హత్యకు సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమర్‌నాథ్ యాత్ర సమయంలోనూ అంతా ప్రశాంతంగానే ఉందని, ముస్లిమేతర..ముఖ్యంగా కశ్మీరీ పండిట్‌లు టార్గెట్‌గా మారారని చెప్పారు. పండిట్‌లకు రక్షణ కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. "రక్షిస్తాం అనే తీపి కబుర్లు వినటం మానేయండి. ఇప్పటికిప్పుడు కశ్మీర్ లోయను వదిలి వెళ్దాం. మన ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఇక్కడి నుంచి వెళ్లిపోవటం, లేదా టెర్రిరిస్ట్‌ల చేతిలో దారుణంగా చనిపోవటం" అని చాలా ఘాటుగా స్పందిస్తోంది KPSS.

Also Read: Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసుపై స్పందించిన స్మిత సబర్వాల్, పొలిటికల్ టర్న్‌ తీసుకున్న ట్వీట్

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget